అన్వేషించండి

Myanmar Earthquake: మయన్మార్‌ భూకంపం.. 334 అణుబాంబులతో సమానమైన శక్తి విడుదల

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన రెండు భారీ భూకంపాలు 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేశాయని, అందుకే భారీ ప్రళయం సంభవించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు.

మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో సంభవించిన రెండు భారీ భూకంపాలు ఆ దేశాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. 7.7 మ్యాగ్నిట్యూడ్​తో వచ్చిన భూకంపం ధాటికి అనేక భవనాలు కుప్పకూలాయి. శిథిలాల్లో నలిగిపోయి చనిపోయిన దాదాపు 1700 మంది డెడ్​బాడీలను ఇప్పటివరకు గుర్తించారు. రెస్క్యూ ఆపరేషన్​ కొనసాగుతోంది. 3,400 మందికి పైగా గాయపడ్డారు. 

అయితే ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేందని, అందుకే భారీ ప్రళయం సంభవించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

10 కి.మీ. లోతులోనే ప్రకంపనల కేంద్రాలు
భారత టెక్టానిక్‌ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం కారణంగా నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్‌ వచ్చే ప్రమాదం ఉందని జెస్ ఫీనిక్స్ అన్నారు. దేశంలో కొనసాగుతున్న అంతర్యుద్ధం కారణంగా మయన్మార్ విపత్తు మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. కమ్యూనికేషన్‌లో అంతరాయం వల్ల అక్కడి పూర్తిస్థాయి పరిస్థితులను బాహ్య ప్రపంచం గుర్తించే అవకాశం లేకుండా పోయిందన్నారు. భూఉపరితలానికి 10 కి.మీ. లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. ఈ విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10వేలు దాటే అవకాశం ఉందని అమెరికా ఏజెన్సీ అంచనా వేసింది.

మయన్మార్​లోని రెండో అతిపెద్ద నగరమైన మండలేలో నివసించే 1.5 మిలియన్ల మందిలో చాలా మంది నిరాశ్రయులయ్యారు. దీంతో రాత్రిపూట వీధుల్లో నిద్రపోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇంకా 3 వేల మందికి పైగా జాడ తెలియలేదని మయన్మార్‌లోని కాథలిక్ రిలీఫ్ సర్వీసెస్ మేనేజర్ కారా బ్రాగ్ పేర్కొన్నారు.

నేపిడాలోని అంతర్జాతీయ విమానాశ్రయ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ టవర్‌ కూడా భూకంపం ధాటికి కూలిపోయింది. ఈ నగరంలో రహదారులు, విద్యుత్, ఫోన్, ఇంటర్నెట్‌ సేవల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. మాండలేలో అధిక సంఖ్యలో నివాస భవనాలు కూలిపోవడంతో ప్రాణ నష్టం అధికంగా ఉంది. శిథిలాల తొలగింపుతో పాటే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడంతో క్షతగాత్రులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

సాయమందిస్తున్న భారత్​, ఇతర దేశాలు
కష్టకాలంలో అక్కడి ప్రజలకు చేయూతనందించేందుకు భారత్‌ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్‌ బ్రహ్మ’ పేరుతో 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలు, తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్‌ బ్యాగ్స్‌, వాటర్‌ ప్యూరిఫయర్లు, సోలార్‌ ల్యాంప్‌, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం.  80 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కూడా అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. 

నిమిషాల వ్యవధిలో వరుస భూకంపాలు
మయన్మార్‌లో శనివారం ఉదయం 11.53 గంటల సమయంలో 4.3 తీవ్రతతో, మధ్యాహ్నం 2.30 గంటలకు 3.8 తీవ్రతతో,  ఆ తర్వాత మరో 20 నిమిషాల వ్యవధిలో 4.7 తీవ్రతతో వరుసగా ప్రకంపనలు వచ్చినట్లు భూకంపన వైజ్ఞానిక కేంద్రాలు వెల్లడించాయి.

ఈరోజు మళ్లీ ప్రకంపనలు
ఇదిలా ఉండగా ఆదివారం మయన్మార్‌లోని మండలే నగరంలో 5.1 తీవ్రతతో మళ్లీ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు వీధుల్లోకి చేరి కేకలు వేశారు. అయింతే ఎలాంటి నష్టం జరిగినట్లు నివేదికలు లేవని అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Advertisement

వీడియోలు

Stampedes in India 2025 | తొక్కిసలాటలతో నిండిపోయిన 2025 సంవత్సరం | ABP Desam
భారత్, సౌతాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు.. మ్యాచ్ రద్దయితే విన్నర్ ఎవరు?
చరిత్ర సృష్టించడానికి అడుగు దూరంలో భారత్, సౌత్‌ఆఫ్రికా
అయ్యో పాపం.. దూబే రికార్డ్ పోయిందిగా..!
భారత మహిళల టీమ్ తలరాత  మార్చిన ద్రోణాచార్యుడు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kasibugga Stampede Exgratia: కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
Hyderabad Metro Timings: హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
హైదరాబాద్‌ వాసులకు అలర్ట్.. ఈ 3 నుంచి మెట్రో రైలు టైమింగ్స్‌లో మార్పులు
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ..  రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
SSMB 29 నుంచి అప్‌డేట్‌ల వెల్లువ.. రాజమౌళి మహేష్ అర్థరాత్రి అంతా లీక్ చేసి పడేశారుగా
Rajamouli - Rana Daggubati: ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
ఒక అబద్దంతో టాలీవుడ్ చరిత్రను మార్చేశాడు... తెలుగు సినిమా పొగరు బాహుబలి కాదు, భళ్లాల దేవుడు
Jubilee Hills By Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికపై కేకే సర్వే ఫలితాలు వెల్లడి.. వారికి బిగ్ రిలీఫ్
Maruti e Vitara Car: మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
మారుతి సుజుకీ తొలి ఎలక్ట్రిక్ కారు విడుదలకు అంతా సిద్ధం- ఫీచర్లు, మైలేజ్ రేంజ్ పూర్తి వివరాలు
Srikakulam Stampede News: శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్,  నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
శ్రీకాకుళం కాశీబుగ్గ తొక్కిసలాట దుర్ఘటనపై చంద్రబాబు సీరియస్, నిర్వాహకుల అరెస్టుకు ఆదేశం!
Top 5 Most Affordable Cars: దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
దేశంలో అత్యంత చవకైన కార్లు ఇవే.. మారుతి ఆల్టో నుంచి సెలెరియో వరకు బడ్జెట్ కార్లు
Embed widget