అన్వేషించండి

Minister Nagarjuna: తహసీల్దార్‌, ఎస్‌ఐలు ప్రతి వారం గ్రామాలకు వెళ్లాలి- మంత్రి మేరుగ నాగార్జున ఆదేశాలు

తహసీల్దార్లు, ఎస్.ఐలు వారంలో ఒక రోజు గ్రామాలకు వెళ్లి ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రజల్లో చైతన్యం కలించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి మేరుగ నాగార్జున‌ సూచించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై పట్ల ప్రజల్లో అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున ఆదేశించారు. ఈ చట్టంపై అవగాహన పెంచడం ద్వారానే దళితులపై దాడులు తగ్గించడానికి వీలు అవుతుందన్నారు. అదే టైంలో ఈ చట్టం దుర్వినియోగం కాకుండా చూడటానికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. సచివాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలు తీరును మంత్రి సమీక్షించారు.

సమీక్షలో నాగార్జున మాట్లాడుతూ... ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ (పీసీఆర్) చట్టం ప్రకారంగా మండలాల్లో పని చేసే తహసీల్దారులు, ఎస్.ఐలు వారానికి ఒకసారి గ్రామాలకు వెళ్లి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం గురించి ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉందని చెప్పారు. అయితే ఎవరూ కూడా గ్రామాలకు వెళ్లడం లేదని, ఈ చట్టం గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చే ప్రయత్నం చేయడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం వస్తే దళితులపై దాడులు చేయకూడదనే విషయంగా అగ్రవర్ణాల వారికి, తప్పుడు కేసులు పెట్టకూడదనే విషయంగా దళిత వర్గాలకు అవగాహన కలుగుతుందని పేర్కొన్నారు. అందుకే తహసీల్దార్లు, ఎస్.ఐలు వారంలో ఒక రోజు గ్రామాలకు వెళ్లి ఈ చట్టంపై ప్రజల్లో చైతన్యం కలించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో విచారణ ఏళ్ల తరబడిగా కొనసాగడం వల్ల సాక్షులను బెదిరించడం, కేసులు వెనక్కి తీసుకొనేలా ఒత్తిడి తీసుకురావడం జరిగే అవకాశం ఉంటుందని మంత్రి నాగార్జున అనుమానం వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం జరగడంలోనూ తీవ్రమైన జాప్యం జరుగుతుందని చెప్పారు. ఈ కేసుల్లో విచారణను త్వరితగతిన ముగించి కోర్టుల్లో చార్జిషీట్లను దాఖలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదు చేసిన కేసుల్లో చాలా అత్యల్ప స్థాయిలోనే నిందితులకు శిక్షలు పడుతున్నాయని, ఎక్కువ భాగం కేసులు కోర్టుల్లో వీగిపోవడం జరుగుతోందని నాగార్జున తెలిపారు. అతి తక్కువ శాతం కేసుల్లో మాత్రమే నిందితులకు శిక్షలు పడటం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.

సీఐడీకి చెందిన అధికారులు మాట్లాడుతూ... కోర్టుకు వచ్చిన వాళ్లు తాము ఏసుక్రీస్తును పూజిస్తామని... చర్చిలకు వెళ్తామని, తమ ఇంట్లో బైబిల్ ఉందని చెప్పడం వల్లే వారు బీసీ-సీ వర్గానికి చెందిన క్రైస్తవులని ఎస్సీలు కాదని నిరూపితమవుతుందని అన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, భగవంతుడిని ఆరాధించడానికీ, మతానికీ ముడిపెట్టకూడదని ఇలాంటి కారణాలతో కొట్టి వేసిన కేసుల వివరాలను తీసుకొస్తే ముఖ్యమంత్రి అనుమతితో అలాంటి కేసులను రీ ఓపెన్ చేయించడానికి కృషి చేస్తానని తెలిపారు. అలాగే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద బాధితులు అందించాల్సిన పరిహారం, ఉద్యోగ ఉపాధుల కేటాయింపుల్లో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ జిల్లా కలెక్టర్లకు డీఓ లెటర్లు రాయాలని నాగార్జున అధికారులను ఆదేశించారు.

ప్రస్తుతం జిల్లాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అన్ని జిల్లాల్లోనూ ఎస్సీ, ఎస్టీ కేసులను విచారించే డీఎస్పీలను నియమించడానికి చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఎస్సీలపై జరిగే దాడుల విషయంగా 24 గంటలూ ఫిర్యాదులను స్వీకరించే కాల్ సెంటర్ సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఏర్పాటు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, దీన్ని త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. పీసీఆర్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడానికి తీసుకుంటున్న వినూత్న చర్యలను గురించి సీఐడీ అధికారులు మంత్రి నాగార్జునకు వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

Bullet Train Corridors: హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
హైదరాబాద్- చెన్నై, హైదరాబాద్- బెంగళూరు బుల్లెట్ రైళ్ల పనుల్లో తొలి అడుగు.. మార్కింగ్ చేస్తున్న అధికారులు
Breaking News: మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులు
మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల ఖాతాల్లోకి పరిహారం నిధులు
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Nutrition vs ideology in Bengal School Meals : బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?
బెంగాల్ మిడ్-డే మీల్స్ వివాదం - చేపల రాజకీయం నుంచి గుడ్డు రద్దు వరకు.. బీజేపీ వ్యూహం బెడసికొడుతుందా?

వీడియోలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Viral News: దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
దుప్పటి అడిగినందుకు విద్యార్థినిని హాస్టల్ ఖాళీ చేపించిన వార్డెన్! చింతలపూడిలో ఘటన
Union Cabinet Reshuffle: త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
త్వరలో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ.. మంత్రివర్గంలో మిత్రపక్షాలకు పెద్దపీట.. ఓ శాఖపై ఉత్కంఠ!
CM Revanth Reddy: ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
ఎవడు అడ్డొచ్చినా, ఎవడు ఆత్మహత్య చేసుకున్నా.. మూసీ లేసి తొక్కుతా, ప్రక్షాళన చేసితీరుతా: నల్గొండలో రేవంత్ రెడ్డి
Power Vs Opposition Mindset: మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
మళ్లీ గెలిస్తే అన్నీ కార్యకర్తల చేతుల మీదుగానే - జగనే కాదు కేటీఆర్ కూడా సేమ్ హామీలు - అలా చేయగలరా?
Morning Phone Habit : నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా? రోజంతా తలనొప్పి, అలసటకు అదే కారణం కావొచ్చు
Ambati Arjun: బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
బుల్లితెర, బిగ్ బాస్ టు వెండి తెర.. మిస్టర్ పర్ఫెక్ట్ అంబటి అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు
Nitin Nabin: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం.. బెంగాల్ తరహాలో పోరాడాలి: నితిన్ నబిన్
T20 World Cup - IND W VS AUS W Result Update:  టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
టీమిండియా ఔట్.. ఆసీస్ చేతిలో ఓట‌మితో సెమీస్ బెర్తు దూరం.. కంగారుల‌తోపాటు నాకౌట్ చేరిన ప్రొటీస్.. 
Embed widget