అన్వేషించండి

Formula E Race Case: అప్పటివరకూ కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దు, హైకోర్టులో మరోసారి ఊరట

Telangana News | తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు అరెస్ట్ చేయవద్దని ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది.

Formula E car race In Hyderabad | హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా కలకలం రేపిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాల ఉత్తర్వులను డిసెంబర్ 31 వరకు హైకోర్టు పొడిగించింది. తనపై నమోదైన కేసు కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ దాఖలు  చేయాలని ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేయగా.. అధికారులు కౌంటర్ దాఖలు చేశారు. పిటిషన్ విచారించిన హైకోర్టు తదుపరి విచారణ 31కి వాయిదా వేసింది. దాంతో బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను అప్పటివరకూ అరెస్ట్ చేయకుండా హైకోర్టు ఊరట కల్పించింది. 

ఈకేసులో ఫిర్యాదుదారుడు దానకిశోర్ స్టేట్మెంట్‌ను ఏసీబీ రికార్డ్ చేసింది. దాంతో దానకిశోర్ స్టేట్మెంట్, ఏసీబీ కౌంటర్ నేడు హైకోర్టులో కీలకంగా మారుతుందని ప్రభుత్వం భావించింది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని ఏసీబీ కోరినా హైకోర్టు తదుపరి ఉత్తర్వుల వరకు అరెస్ట్ చేయకూడదని చెప్పింది.

బీఆర్ఎస్ హయాంలో కారు రేసింగ్‌కు ఒప్పందం..

తెలంగాణ ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి వెళ్లడానికి హైదరాబాద్‌లో ఈ కార్ రేసింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దాంతో గత బీఆర్ఎస్ హయాంలో కార్ రేసింగ్ నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. మిగతా నగరాలు పోటీ పడుతున్నా హైదరాబాద్ కు ఛాన్స్ తీసుకుని ఘనంగా నిర్వహించారు. నెల్సన్ సంస్థ అయితే రూ.700 కోట్లు ప్రయోజనం పొందారని చెప్పింది. ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. కానీ ఆ సమయంలో నష్టం వచ్చిందని గ్రీన్‌ కో సంస్థ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకోగా, ఈ కార్ రేస్‌ రద్దవుతుందని భావించి గత ప్రభుత్వం రూ.55 కోట్లు నిర్వహణ సంస్థకు చెల్లించింది. ఒకవేళ ఒప్పందం రద్దు అయితే భారీగా జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చింటే ఈజీగా స్పాన్సర్‌ను తెచ్చేవారు. కానీ అన్ని రోజులు ఒకలా ఉండవు. ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 

Also Read: Allu Arjun Bail Petition: అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా, తొక్కిసలాటపై జనవరి 10న విచారణ 

గవర్నర్ అనమతితో పెరిగిన దూకుడు

2018 కంటే ముందు ఎవరి మీద అయినా అవినీతి ఆరోపణలు వస్తే చాలు వెంటనే ఏసీబీ, సీబీఐ రంగంలోకి దిగి విచారణ జరిపేవి. కానీ 2018లో ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్ట్‌కు సవరణ తీసుకురావడంతో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి సంబంధించిన హెచ్‌వోడీ అనుమతిని ఏబీసీ తీసుకోవాలి. అయితే నేరుగా డబ్బులు తీసుకుంటూ దొరికిపోతే మాత్రం ఎవరి అనుమతి అవసరం లేదు. ఈ-కార్‌ రేసింగ్‌ హైదరాబాద్ విషయంలో డబ్బులు చేతులు మారలేదు. ఆరోపణలు రావడంతో విచారణకు సంబంధించి గవర్నర్ అనుమతి కోరారు. నెల తరువాత గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ అనుమతి ఇవ్వడంతో మాజీ మంత్రి కేటీఆర్‌‌తో పాటు ఐఏఎస్‌ అధికారి ఆర్వింద్‌కుమార్‌, HMDA చీఫ్‌ ఇంజినీర్‌ పై కేసు నమోదు చేశారు.

క్యాబినెట్‌ అనుమతి లేకుండా, ఆర్బీఐ పర్మిషన్‌ తీసుకోకుండా రూ.55 కోట్లు ఓ సంస్థకు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే హెచ్‌ఎండీఏ చైర్మన్‌గా అప్పటి సీఎం కేసీఆర్, వైస్‌ చైర్మన్‌గా ఎంఏయూడీ మంత్రి కేటీఆర్‌, మెంబర్‌ కన్వీనర్‌గా ఐఏఎస్ అర్వింద్‌కుమార్‌ ఉన్నారు. కేబినెట్ పర్మిషన్ లేకుండానే వైస్‌ చైర్మన్‌గా నిర్ణయం తీసుకొనే అధికారం తనకు ఉందని కేటీఆర్‌ చెబుతున్నారు. అందుక సంబంధించి తన దగ్గర ఉన్న ఆధారాలను కేటీఆర్ ఏసీబీకి ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కరెక్టుగా ఉన్నాయని తేలితే కేసు కొట్టి వేయాల్సి ఉంటుంది. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sri Ramakrishna Teertham Mukkoti | ముక్కోటి తీర్థానికి వెళ్లి రావటం ఓ అనుభూతి | ABP DesmBr Shafi Interview on Radha Manohar Das | నాది ఇండియన్ DNA..మనందరి బ్రీడ్ ఒకటే | ABP DesamAP Deputy CM Pawan kalyan in Kerala | కొచ్చి సమీపంలో అగస్త్యమహర్షి గుడిలో పవన్ కళ్యాణ్ | ABP DesamMegastar Chiranjeevi Comments Controversy | చిరంజీవి నోరు జారుతున్నారా..అదుపు కోల్పోతున్నారా.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manipur: మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
మణిపూర్ లో రాష్ట్రపతి పాలన - సీఎం రాజీనామాతో కేంద్రం నిర్ణయం
KCR Re Entry: కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
కేసీఆర్ రీ ఎంట్రీకి ఫిబ్రవరి 19న ముహుర్తం - తెలంగాణ భవన్‌లో కీలక సమావేశం - ఇక సమరమే !
Andhra Pradeh BirdFlu: బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
బర్డ్ ఫ్లూ భయం లేదు - ఉడికించిన గుడ్లు, చికెన్ తినొచ్చు - ఏపీ సర్కార్ కీలక ప్రకటన
Google And Microsoft AI Centers In Hyderabad : తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
తెలంగాణలో ఒకే రోజు రెండు కీలక ఒప్పందాలు- గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ ఏఐ కేంద్రాల ఏర్పాటుకు ఎంవోయు
30 Years PrudhviRaj: 'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
'డోంట్ బాయ్ కాట్.. వెల్ కమ్ టు 'లైలా' - క్షమాపణలు చెప్పిన నటుడు పృథ్వీ, కాంట్రవర్సీకి ఎండ్ కార్డ్ పడుతుందా?
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
వల్లభనేని వంశీకి స్టేషన్ బెయిల్ వస్తుందా ? ఆయనపై పెట్టిన కేసులేంటి ?
Viral news: తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
తాగుబోతు పైగా అప్పుల అప్పారావు - భార్య ఇచ్చిన షాక్‌తో ఒంటరైపోయాడు !
Telangana Caste Survey: తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
తెలంగాణ కుల గణనలో తప్పులను కాంగ్రెస్ సర్కార్ అంగీకరించినట్లేనా!
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.