అన్వేషించండి

Gudivada Amarnath: బొమ్మల ఎగుమతి హబ్‌గా ఆంధ్రప్రదేశ్- వెయ్యి ఎకరాల్లో టాయ్‌ పార్క్‌ ఏర్పాటు: మంత్రి అమర్నాథ్

Minister Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ బొమ్మల ఎగుమతి హబ్‌గా మారబోతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. రాష్ట్రంలో వెయ్యి ఎకరాల్లో టాయ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయన్నారు.

Minister Gudivada Amarnath: ఆంధ్రప్రదేశ్ బొమ్మల ఎగుమతి హబ్‌గా మారబోతోందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బొమ్మలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసేందుకు పల్స్‌ ప్లష్‌ కంపెనీ రూపొందించిన గ్లోబల్ ఇ-కామర్స్‌ పోర్టల్‌ను గాజువాకలోని గ్రీన్‌ సిటీలో మంత్రి అమర్‌నాథ్ ప్రారంభించారు. ఈ కంపెనీ తయారు చేసిన బొమ్మలను అమెరికాలోని వివిధ నగరాలకు ఎగుమతి చేయనుంది. 

పోర్టల్ ప్రారంభించిన సందర్భంగా మాట్లాడిన అమర్‌... వెయ్యి ఎకరాల్లో బొమ్మల పరిశ్రమ పెట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నాయని.. సీఎం జగన్ ను సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వివరించారు. ఏపీలో తయారైన బొమ్మలు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మంత్రి అమర్‌నాథ్ చెప్పారు. ఇటీవల తాను శ్రీ సిటీని సందర్శించినప్పుడు దేశంలో బొమ్మల మార్కెట్‌ ప్రాముఖ్యతను తెలుసుకున్నానని, దేశ వ్యాప్తంగా ఏటా ఏడు నుంచి 8 లక్షల కోట్ల విలువైన బొమ్మలు అమ్ముడు అవుతున్నాయని తెలిపారు. బొమ్మల తయారీలో చైనా అగ్రస్థానంలో ఉందని, ఆంధ్ర ప్రదేశ్‌ త్వరలో బొమ్మల ఎగుమతి హబ్‌గా మారనుందని అన్నారు. ఏపీలో టాయ్ పార్క్ ఏర్పాటు చేస్తే 30 నుంచి 40 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

30 ఏళ్లుగా బొమ్మల తయారీ రంగంలోనే ఉన్న అజయ్ సిన్హా..

ఈ సందర్భంగా పల్స్ ప్లష్‌ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ ప్రెసిడెంట్ అజయ్ సిన్హా మాట్లాడారు. బొమ్మల తయారీ అంటే తనకు చాలా ఇష్టం అని.. దేశం, విదేశాల్లో ఉన్న అనేక సంస్థలలో దాదాపు 30 సంవత్సరాలుగా ఈ రంగంలో కీలక పాత్రలు పోషించానని చెప్పారు. ఈ బొమ్మలు 1995లో నోయిడాలో తయారు అయ్యాయని, డిస్నీ లైసెన్స్ దేశంలోని తన కంపెనీకి మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు.

1997 నుంచి 2000 వరకు తమ కంపెనీ తయారు చేసిన బొమ్మలను ఇతర దేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు అజయ్ సిన్హా. నాణ్యమైన బొమ్మలను తయారు చేయడమే తమ లక్ష్యమని వివరించారు.  అయితే ఆ సమయంలో ముడి సరుకు సమస్యను ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా నాణ్యమైన బొమ్మల తయారీలో వెనుకడుగు వేయకూడదనే లక్ష్యంతో.. 2011-12 మధ్య కాలంలో తిరుపతి సమీపంలోని శ్రీసిటీలో  పల్స్ ప్లష్ బొమ్మల తయారీని ప్రారంభించినట్లు తెలిపారు. 

సంస్థను మరింత విస్తరించేందుకు ఏర్పాట్లు

శ్రీసిటీలోని ఐదెకరాల పరిశ్రమలో ఎగుమతి అనుకూలమైన బొమ్మలను తయారు చేస్తున్నట్లు అజయ్ సిన్హా తెలిపారు. కాకినాడలోని 300 ఎకరాల్లో బొమ్మల తయారీ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో తమ కార్యకలాపాలను విశాఖపట్నం నగరానికి మార్చినట్లు అజయ్ సిన్హా వెల్లడించారు. ప్రస్తుతం విశాఖలో నిర్వహిస్తున్న తమ సంస్థను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం విశాఖలో తయారవుతున్న బొమ్మలు గ్లోబల్ ఇ-కామర్స్ ద్వారా న్యూయార్క్, ఫ్లోరిడా, శాన్ ఫ్రాన్సిస్కో, అమెరికాలోని మరిన్ని నగరాల్లో కూడా విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. తమ బొమ్మలను తైవాన్‌, సౌత్‌ కొరియ సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్టు పేర్కొన్నారు అజయ్ సిన్హా. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Bengal Assembly Elections 2026: బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
బెంగాల్‌లో త్రిముఖ పోరు దిశగా రాజకీయం - లెఫ్ట్, కాంగ్రెస్ దూకుడు - టీఎంసీకి ముచ్చెమటలు?
Kumbh Mela Monalisa Marriage : ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా మోనాలిసా - పోలీసులను ఆశ్రయించి మరీ...
Internet Data Tax: ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
ఇంటర్నెట్ డేటాపై పన్ను! సన్నాహాలు చేస్తున్న మోదీ ప్రభుత్వం!
Viral News:కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!
కోమాలోని మహిళకు పునర్జన్మ ప్రసాదించిన రోడ్డు గుంత! ఇది నిజంగానే మెడికల్‌ మిరాకిల్‌!

వీడియోలు

Sanju Samson Phone Call with Sachin | సంజు విజయం వెనుక సచిన్
ICC Penalizes Arshdeep After T20 World Cup Final | అర్ష్‌దీప్ సింగ్‌పై ఐసీసీ వేటు
Shahid Afridi praises Team India | భారత జట్టుపై షాహిద్ అఫ్రిదీ ప్రశంసలు
BCCI Reward for T20 World Cup Champions | టీమిండియాపై బీసీసీఐ కాసుల వర్షం
Gambhir Dedicates T20WC Win to Dravid & Laxman | ట్రోఫీ గెలిచాక గంభీర్ సంచలన నిర్ణయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gas Cylinder shortage: గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
గ్యాస్ కొరతతో అయోధ్య సహా అనేక దేవాలయాల్లో అన్నదానం నిలిపివేత - మరి తిరుమల పరిస్థితి ఏమిటి?
Good news for AP farmers: ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
ఏపీ రైతులకు ఉగాది కానుక - 13న అన్నదాత సుఖీభవ నిధులు రూ.6వేలు జమ !
Harish Rana Case : 13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
13 ఏళ్లు మంచంపై ఉన్న హరీష్‌ రాణా కేసు సుప్రీంకోర్టుకు ఎలా చేరింది? బ్రెయిన్ డెడ్, PVS మధ్య తేడా ఏంటీ?
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్, ప్రజల తీర్పును అవమానించడం: కేటీఆర్
First Euthanasia: ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
ఏ దేశంలో తొలి కారుణ్యమరణం (Mercy Killing) అమలులోకి వచ్చింది? దాని బ్యాక్‌డ్రౌండ్ పూర్తి వివరాలివే
Kavuri Sambasivarao Passes Away: కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత, సీఎం చంద్రబాబు సహా ప్రముఖుల సంతాపం
Hansika Divorce : భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
భర్త సోహైల్‌తో హీరోయిన్ హన్సిక డివోర్స్ - నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Team India నెక్ట్స్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఎప్పుడు ఆడుతుంది? IPL కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
Embed widget