అన్వేషించండి

వరుడు లేకుండానే పెళ్లిళ్లు, యూపీలో బోగస్ వెడ్డింగ్ స్కామ్‌ - 15 మంది అరెస్ట్

Wedding Fraud: యూపీలో సామూహిక వివాహాల స్కామ్‌ వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది.

Mass Wedding Fraud in UP: ఉత్తరప్రదేశ్‌లో భారీ వెడ్డింగ్ స్కామ్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో 15 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యాక కానీ ఈ స్కామ్ బయటపడలేదు. కొంత మంది యువతులు తమకు తామే పూలదండలు వేసుకున్న వీడియోపై ఆరా తీస్తే అసలు డొంకంతా కదిలింది. అయితే...ఇందులో కొంత మంది యువకులు పెళ్లి కొడుకుల్లా తయారై పక్కన ఊరికే నిలబడ్డారు. కానీ పూల దండలు మాత్రం యువతులు తమకు తామే వేసుకున్నారు. ఇదే అనుమానాలకు తావిచ్చింది. జనవరి 25వ తేదీన ఈ సామూహిక వివాహాలు జరిగినట్టు గుర్తించారు పోలీసులు. ఈ కార్యక్రమంలో దాదాపు 568 జంటలు పాల్గొన్నాయి. అయితే...ఈ స్కామ్‌ బయటపడ్డాక విచారణ చేపట్టగా వాళ్లందరికీ డబ్బులిచ్చి అలా పెళ్లి కూతురి గెటప్ వేశారని తేలింది. ఈ స్కామ్‌పై స్థానికులు కీలక విషయాలు వెల్లడించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు గెటప్‌ వేసినందుకు ఒక్కొక్కరికీ రూ.500 నుంచి రూ.2 వేల వరకూ ఇచ్చారని చెప్పారు. కొంత మంది యువకులు ఆ సమయానికి దొరకలేదని, అందుకే వధువులే తమకు తాముగా పూలదండలు వేసుకున్నారని వివరించారు. 

"అక్కడ సామూహిక వివాహాలు జరుగుతున్నాయని మాకు తెలిసింది. ఊరికే చూద్దామని అక్కడికి వెళ్లాను. కానీ ఇంతలోనే కొంత మంది వచ్చి నాతో మాట్లాడారు. అక్కడ కూర్చుంటే డబ్బులిస్తామని అన్నారు. అలా చాలా మందిని అక్కడ డబ్బులిచ్చి కూర్చోబెట్టారు"

- స్థానికుడు 

చీఫ్‌గెస్ట్‌గా బీజేపీ ఎమ్మెల్యే  

ఇక్కడ కీలక విషయం ఏంటంటే బీజేపీ ఎమ్మెల్యే కేత్కీ సింగ్ ఈ కార్యక్రమానికి హాజరయ్యాడు. ఆయన చీఫ్‌గెస్ట్‌గా రావడం వల్ల ఎవరికీ అనుమానం రాలేదు. అయితే...ఈ స్కామ్‌పై ఆయనను ప్రశ్నించగా తనకు రెండు రోజుల ముందు సమాచారం ఇచ్చారని, తనకూ అనుమానం వచ్చిందని వెల్లడించారు. పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు. ఇలా సామూహిక వివాహాల్లో ఒక్కటవుతున్న జంటలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.51,000 నగదు అందిస్తోంది. ఇందులో రూ.35 వేలు వధువుకి, రూ.10 వేలు పెళ్లి బట్టలకి, రూ.6 వేలు వివాహ ఖర్చులకి ఇస్తోంది. దీనికి ఆశపడి కొంత మంది ఇలా చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌పై విచారణ జరిపేందుకు ప్రభుత్వం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. లబ్ధిదారుల వివరాలన్నీ పరిశీలిస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తరపున వాళ్లకు ఒక్క రూపాయి కూడా అందలేదని తెలిపారు. 

Also Read: డబ్బుకి ఆశపడి పాక్‌కి గూఢచర్యం, ఇండియన్ ఎంబసీ ఉద్యోగి అరెస్ట్

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Iran Israel War: ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
ఆకాశం నుంచి ప్యారాచూట్‌తో దిగిన అమెరికన్ పైలట్ - కువైట్ ప్రజలు రాడ్డుతో కుమ్మేయబోయారు - అక్కడే ట్విస్ట్
Vijay Divorce Alimony: విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
విడాకుల కోసం విజయ్ దూకుడు... భరణంగా 250 కోట్లు ఇవ్వడానికి రెడీ?
Hero Xoom 125 లో రెండు వేరియంట్లు - ఏ వేరియంట్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి?
Hero Xoom 125 VX vs ZX - ₹8,000 తేడాతో ఏ ఫీచర్లు మారాయి?
Bihar Politics: బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?
బీహార్ రాజకీయాల్లో పెను మార్పులు- సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా ?

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Guntur Mirchi: ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
ఆనంద్ మహింద్రాను కదిలించిన గుంటూరు మిర్చి వీడియో - లోకేష్‌కు సలహా - ఇలా చేస్తే అదుర్స్ !
Kolikapudi controversy: చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
చివరి హెచ్చరిక అయిపోయింది - కొలికపూడికి తేల్చి చెప్పిన పల్లా శ్రీనివాస్
YS Jagan: కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
కల్తీ నెయ్యి, టీటీడీ ఛైర్మన్‌పై వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు
ఇరాన్‌-అమెరికా యుద్ధం: బ్యారెల్‌కు ఒక్క డాలర్‌ పెరిగినా ₹12,000 కోట్ల అదనపు భారం - మన పెట్రోల్‌ బడ్జెట్‌పై ప్రభావం ఎంత?
ఇరాన్‌-అమెరికా యుద్ధం: ఇండియాలో పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతాయా? ఆటో ఇండస్ట్రీకి హెచ్చరిక సంకేతాలు
Andhra Pradesh Latest News: ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
ఏపీ రాజకీయాల్లో మండలి సెగ; ఛైర్మన్‌ మోషేన్‌ రాజుపై అవిశ్వాసం పెట్టే యోచనలో వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్సీలు!
Balka Suman Released : ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
ఆదిలాబాద్ జైలు నుంచి బాల్క సుమన్ విడుదల! భారీగా తరలి వచ్చిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు 
US Shooting: అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
అమెరికాలో ఇరాన్ జెండా టీ-షర్ట్ ధరించిన వ్యక్తి కాల్పులు! భారతీయ విద్యార్థి సహా ముగ్గురు మృతి!
Palamaner Latest News:తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
తిరుమల వెళ్తుండగా తీరని విషాదం; పలమనేరు వద్ద ఘోర ప్రమాదం! ఐదుగురు బెంగళూరు వాసులు మృతి!
Embed widget