అన్వేషించండి

Maoists Peace Talks: శాంతి చర్చలకు వేడుకుంటున్న మావోయిస్టులు - అంతం చేసేదాకా వదిలేది లేదంటున్న బలగాలు

Maoists :శాంతి చర్చలకు పిలవాలని మావోయిస్టులు కోరుతున్నారు. కానీ కేంద్రం మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ఆపరేషన్ నిర్వహిస్తోంది.

Maoists wants invitation for peace talks:  మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా సాగుతున్న ఆపరేషన్ ను ఆపేందుకు ప్రాణాలు కాపాడుకునేందుకు మావోయిస్టులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. శాంతి చర్చలకు పిలవాలని.. కోరుకుంటూ లేఖలు విడుదల చేస్తున్నారు. తాజాగా రూపేష్ పేరుతో లేఖను మావోయిస్టులు విడుదల చేశారు.  బీజాపూర్ తెలంగాణ సరిహద్దులో  వందల కొద్దీ బలగాలు   'సీజ్ ఎరాడికేషన్   మిలటరీ ఆపరేషన్'ను ను నిర్వహిస్తున్నాయని  మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.  ఈ ఆపరేషన్ వెంటనే ఆపాలని మావోయిస్టులు  పిలుపునిచ్చారు.  

శాంతియుత చర్చల ద్వారా సమస్య పరిష్కారం కావాలని అందరూ కోరుకుంటున్నారని..  మా పార్టీ ఎల్లప్పుడూ శాంతి చర్చలకు సిద్ధంగా ఉంటుందని కేంద్ర కమిటీ తరపున ఓ సందేశాన్ని మీడియా ద్వారా పంపించారు.    కేంద్ర కమిటీ కూడా శాంతి చర్చలకు సంబంధించి లేఖలు జారీ చేసిందని కానీ ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేలా కనిపిస్తోందని మావోయిస్టు నేత ఆరోపిస్తున్నారు.  శాంతియుత చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ప్రభుత్వం అణచివేత , హింసను ఉపయోగించి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు.  బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో పెద్ద  ఆపరేషన్ ప్రారంభమైంది. కీలక  మావోయిస్టు హిడ్మాను బలగాలు చుట్టుముట్టినట్లుగా ప్రచారం జరుగుతోంది.  

మావోయిస్టులకు కేంద్రంగా ఉన్న కర్రెగుట్టలను అటునుంచి చత్తీస్‌గఢ్ పోలీస్ బలగాలు ఇటువైపు నుంచి తెలంగాణ పోలీస్ బలగాలు చుట్టుముట్టాయి.  కర్రెగుటల్లో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకోనుందన్న ప్రచారం జరుగుతోంది.   ఇరు రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగలనుంద ని చెబుతున్న సమయంలో శాంతి చర్చలకు మావోయిస్టులు పిలుస్తున్నారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారతదేశంలో నక్సలిజం  ను అంతం చేయడానికి మార్చి 31, 2026 నాటికి గడువు పెట్టుకున్నారు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు, భద్రతా బలగాలు పనిచేస్తున్నాయి.  బస్తర్ డివిజన్‌లో 2024 జనవరి నుండి 310 మంది మావోయిస్టులు హతమయ్యారు, 2021 నుండి మొత్తం 385 మంది హతమయ్యారు. ప్రస్తుతం బస్తర్‌లో కేవలం 400 మంది సాయుధ క్యాడర్‌లు మాత్రమే మిగిలి ఉన్నారని బస్తర్ ఐజీ పి. సుందర్‌రాజ్  ప్రకటించారు. మావోయిస్టు సెంట్రల్ కమిటీ కూడా బలహీనపడింది, కేవలం 12-14 మంది కమాండర్‌లు మాత్రమే చురుకుగా ఉన్నారు. 2024లో చత్తీస్‌గఢ్‌లో 287 మావోయిస్టులు హతమయ్యారు, 1000 మంది అరెస్టయ్యారు, 837 మంది లొంగిపోయారు. 2025 ఏప్రిల్ 19న, సుక్మా మరియు బీజాపూర్ జిల్లాల్లో 33 మావోయిస్టులు లొంగిపోయారు, దీంతో సుక్మాలోని బడేసెట్టి గ్రామం నక్సల్-రహితంగా ప్రకటించారు.                 
  
మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, విద్య, విద్యుత్, ఆరోగ్య సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా స్థానికుల మద్దతు సంపాదించే ప్రయత్నం జరుగుతోంది. నక్సల్-రహిత గ్రామాలకు రూ.1 కోటి అభివృద్ధి నిధులు కేటాయిస్తున్నారు. షా చత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ, నిధులు, ఆర్థిక మూలాలను అడ్డుకోవడం, ఇంటెలిజెన్స్ బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ కారణంగా మావోయిస్టుల శాంతి చర్చలను కేంద్రం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు.       

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vizag Ganja Lady Don: సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి గంజాయి స్మగ్లింగ్ డాన్‌గా మారిన రేణుక - ఏ సినిమా చూసి ఇన్‌స్పయిర్ అయిందో మరి !
New Year 2026: శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
శుక్రవారం నుంచి న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌పై నిఘా- తేడా వస్తే లైసెన్స్‌ రద్దు: హైదరాబాద్ సీపీ వార్నింగ్ 
NTR Bharosa Pensions: ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
ఏపీలో పింఛన్‌దారులకు ముందే కొత్త సంవత్సరం- డిసెంబర్ 31న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ
PPP Kims: ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
ఆదోని మెడికల్ కాలేజీకి టెండర్ వేసింది కిమ్స్ కాదు - ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ !
Anti Cancer Drug:జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
జపనీస్ కప్ప కడుపులో క్యాన్సర్‌ మందు- శాస్త్రవేత్తల ఆశాజనకమైన ఆవిష్కరణ 
India vs Sri Lanka Highlights: మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
మూడో టి20లో టీమ్ ఇండియా ఘన విజయం- శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ ముందంజ
Rajasthan: ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
ఉద్యోగినిపై గ్యాంగ్‌రేప్‌ కు పాల్పడిన ఐటీ కంపెనీ ఓనర్ - రాజస్థాన్‌లో కలకలం !
Amaravathiki Aahwanam: హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
హారర్ థ్రిల్లర్‌లో సురేఖ కుమార్తె... వీఎఫ్ఎక్స్ పనుల్లో 'అమరావతికి ఆహ్వానం'
Embed widget