అన్వేషించండి

India-Maldives: 'దయచేసి మా దేశానికి రండి' - భారతీయ పర్యాటకులకు మాల్దీవుల మంత్రి విజ్ఞప్తి

Maldives: భారత్ - మాల్దీవుల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ క్రమంలో ఆ దేశ మంత్రి భారతీయులకు తమ దేశానికి రావాలని విజ్ఞప్తి చేశారు.

India-Mladives: భారత్ - మాల్దీవులు (Maldives) దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ క్రమంలో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మాల్దీవుల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. భారతీయ పర్యాటకులు ఎక్కువగా లక్షద్వీప్ (Laksdweep)కు వెళ్తుండడంతో  ఆ దేశ పర్యాటకం దివాళా తీసింది. దీంతో తమ దేశ ఆర్థిక వ్యవస్థకి సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైసల్ (Ibrahim Fisal) భారతీయులకు విజ్ఞప్తి చేశారు. ఇరుదేశాల మధ్య బంధం చారిత్రకమైందని గుర్తు చేశారు. 'మనకు ఓ చరిత్ర ఉంది. కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం భారత్ తో కలిసి పని చేయాలనుకుంటోంది. మేం ఎప్పుడూ శాంతి, స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రోత్సహిస్తాం. మా ప్రభుత్వంతో పాటు దేశ ప్రజలు కూడా భారతీయులకు ఘన స్వాగతం పలుకుతున్నాం. దయచేసి మాల్దీవుల టూరిజంలో భాగం కావాలని పర్యాటక మంత్రిగా భారతీయులను కోరుతున్నాను.' అంటూ సోమవారం ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోరారు.

ఇదీ జరిగింది

భారత్ లో అంతర్భాగమైన లక్షద్వీప్ దీవులను ప్రధాని మోదీ (PM Modi) ఈ ఏడాది జనవరిలో సందర్శించిన సంగతి తెలిసిందే. అక్కడి పర్యాటక అద్భుతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్ లో షేర్ చేశారు. దీనిపై మాల్దీవుల మంత్రులు భారత్ సహా ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. మాల్దీవుల నేతల వ్యాఖ్యలపై భారతీయ ప్రముఖులు, నటులు, పర్యాటకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత తీరాలు, ద్వీపాల ప్రాధాన్యంపై ప్రశంసలు కురిపించారు. నెటిజన్లు సైతం మాల్దీవులకు ఇక సెలవు లక్షద్వీప్ కు వెళ్లాలని ట్వీట్స్ చేశారు. మరోవైపు, మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) భారత దళాలను వెనక్కు పంపాలని నిర్ణయించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.

ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయ ప్రముఖులు సహా ఇతర పర్యాటకులు మాల్దీవులకు వెళ్లేందుకు అప్పటికే వేసిన ప్రణాళికలను రద్దు చేసుకున్నారు. విమాన, హోటల్ బుకింగ్స్ రద్దు చేశారు. కొన్ని ట్రావెల్ ఏజెన్సీలు కూడా ఆ దేశానికి తాత్కాలికంగా బుకింగ్స్ నిలిపేశాయి. ఈ క్రమంలో ఆ దేశ పర్యాటకం పూర్తిగా దెబ్బతింది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడింది. అప్పటివరకూ మాల్దీవులను సందర్శిస్తున్న పర్యాటకుల జాబితాలో తొలి స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు ఆరో స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది తొలి 4 నెలల్లోనే అక్కడికి వెళ్లే భారత పర్యాటకుల సంఖ్య దాదాపు 50 శాతానికి తగ్గిపోయింది. 2024, మే 4వ తేదీ నాటికి 43,991 మంది భారతీయులు మాల్దీవులకు వెళ్లారు. ఇదే గతేడాది జనవరి - ఏప్రిల్ మధ్య ఈ సంఖ్య 73,785 గా ఉంది. ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న తర్వాత ఈ పరిస్థితి తలెత్తిందని నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో తమ దేశ ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిన పడేలా సహకరించాలని భారతీయులకు మాల్దీవుల మంత్రి విజ్ఞప్తి చేశారు.

Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర వాయిదా - చివరి నిమిషంలో మిషన్ నిలిపేసిన నాసా

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Anantapur New SP Gowthami Sali | అనంతపురం కొత్త ఎస్పీ ప్రెస్‌మీట్ | ABP DesamHusband Accused His Wife For Threatening | భార్య వేధింపులపై భర్త సెల్ఫీ వీడియో | ABP DesamWife Beats Her Husband: Viral Video | భార్య కొడుతోందని..రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించిన భర్తSRH vs PBKS Match Fans Reactions | పంజాబ్ తో మ్యాచ్... ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ సందడి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
RR vs KKR Match abandoned: వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
వర్షం కారణంగా కోల్‌కత్తా, రాజస్థాన్ మ్యాచ్ రద్దు - అదృష్టమంటే సన్‌రైజర్స్‌దే!
Harish Rao: బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
బీఆర్ఎస్ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు కాంగ్రెస్ నేతల యత్నం! హరీష్ రావు ఆరోపణలు
Devara Fear Song: 'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
'దేవర'కు హారతి పట్టండమ్మా - అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చే ఎన్టీఆర్ యాంథమ్ వచ్చేసింది
Market Holiday: సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
సోమవారం మార్కెట్లకు సెలవు- NSE, BSE క్లోజ్ ఎందుకంటే?
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
తెలంగాణ కేబినెట్ భేటీకీ ఈసీ గ్రీన్ సిగ్నల్ - ఈ అంశాలపై షరతులు
Pavithra Jayaram: నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
నటి పవిత్ర జయరామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన చందు భార్య శిల్ప
IPL 2024:  అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
అదే ఊచకోత, భారీ లక్ష్యాన్ని ఛేదించిన హైదరాబాద్
Rains In Telangana: తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
తెలంగాణలో విషాదం- ఒకే మండలంలో రెండు పిడుగులు, ముగ్గురు మృతి
Embed widget