అన్వేషించండి

Maharashtra Politics: ఉద్ధవ్‌ ఠాక్రేకు బిగ్ షాక్! అసలైన శివసేన షిండే వర్గమే - స్పీకర్ తీర్పు

Shiv Sena Latest News: ఏక్ నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన వర్గం అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. బుధవారం స్పీకర్ ఈ కీలకమైన తీర్పు వెలువరించారు.

Uddhav Thackeray Shiv Sena: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతం శివసేన పార్టీ రెండు వర్గాలు ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాలుగా ఉండగా.. వీటిలో ఉద్ధవ్ వర్గానికి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీలో ఏక్ నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన వర్గం అంటూ మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకర్ ప్రకటించారు. బుధవారం స్పీకర్ ఈ కీలకమైన తీర్పు వెలువరించారు. ఈ రెండు వర్గాలు పరస్ఫరం ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూ.. తమకు తామే అసలైన శివసేన అంటూ పిటిషన్లు వేశారు. దీనిపై స్పీకర్ తాజా తీర్పు ఇచ్చారు. షిండే వర్గానికే మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని స్పీకర్‌ అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్లు అన్నింటినీ తిరస్కరించారు. అలాగే, శివసేన పార్టీ 2018 రాజ్యాంగాన్ని పరిగణించాలన్న ఉద్ధవ్‌ వర్గం అభ్యర్థనను స్పీకర్‌ తోసిపుచ్చారు. ఎన్నికల కమిషన్‌కు 1999లో సమర్పించిన ఆ పార్టీ  రాజ్యాంగమే చెల్లుబాటవుతుందని.. దాని ప్రకారం శివసేన ప్రముఖ్‌ (ఉద్ధవ్‌ ఠాక్రే)కు ఏ నేతనూ తొలగించే అధికారం లేదని స్పీకర్ తేల్చి చెప్పారు.

2022 జూన్‌లో శివసేన ప్రభుత్వం కూలిపోయిన సంగతి తెలిసిందే. శివసేనలోనే ఒక ఎమ్మెల్యే అయిన ఏక్ నాథ్ షిండే దాదాపు 50 మంది ఎమ్మెల్యేలతో ఉద్ధవ్‌ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేశారు. దీంతో శివసేన ప్రభుత్వం కూలిపోయింది. తనకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేలు అందర్నీ తీసుకొని షిండే అసోంకు తీసుకువెళ్లారు. ఆ తర్వాత బీజేపీ షిండేకు మద్దతు ప్రకటించింది. సుప్రీంకోర్టు అనుమతితో ఉద్ధవ్‌ ఠాక్రే బలపరీక్షలో తన మెజార్టీని నిరూపించుకోవాలని గవర్నర్‌ కోరారు. ఈ పరిణామాల వల్ల ఉద్ధవ్‌ ఠాక్రే తన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. 

ఆ తర్వాత శివసేనలో షిండే వర్గం- బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 2022 జూన్‌ 30న ఏక్‌ నాథ్‌ షిండే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జులై 4న ఏక్‌ నాథ్‌ అసెంబ్లీ బలపరీక్షలో గెలిచారు. ఈ రాజకీయ సంక్షోభం వెనుక బీజేపీ ఉండి ప్రభుత్వాన్ని కూలదోసిందనే ఆరోపణలు అప్పుడు బాగా వచ్చాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR vs RCB IPL 2025 Match Highlights | కేకేఆర్ పై 7వికెట్ల తేడాతో ఆర్సీబీ గ్రాండ్ విక్టరీ | ABP Desamడీలిమిటేషన్ పై దక్షిణాది యుద్ధంమేము రాజకీయంగా నష్టపోతాంIPL 2025 Captain's Meet | రేపటి నుంచే ఐపీఎల్ మహా సంగ్రామం ప్రారంభం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana: తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
తెలంగాణ ఎన్డీఏ ఊహాగానాలు - కాంగ్రెస్ వైపు కేసీఆర్ చూపు - చెన్నై సమావేశానికి వెళ్లింది అందుకేనా ?
YS Jagan:  అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
అటు ఎన్డీఏ - ఇటు ఇండీ కూటమి - ఎటు వైపో తేల్చుకోలేకపోతున్న జగన్ !
KCR Latest News: అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
అందుకే చంద్రబాబు గెలిచాడు, మనం అలా కాదు : కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు
Kohli Completes 1000 Runs Vs KKR: కేకేఆర్ పై వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
కేకేఆర్ పై కోహ్లీ వెయ్యి ప‌రుగులు పూర్తి.. ఫిఫ్టీతో స‌త్తా చాటిన విరాట్, ఫ‌స్ట్ మ్యాచ్ లో ఆర్సీబీ శుభారంభం
Sushant Singh Rajput Case: నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ది ఆత్మహత్యే- తేల్చేసిన సీబీఐ
Pawan Kalyan Latest News: పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
పవన్ పేరు చెబితే ర్యాగింగ్ చేశారు- నంద్యాల ఎంపీ శబరి ఆసక్తికర వ్యాఖ్యలు
Vizag:  వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
వైజాగ్ బీచ్‌కు మళ్లీ బ్లూఫ్లాగ్ గుర్తింపు - కలెక్టర్ కఠిన చర్యలతో మళ్లీ కళకళ
Actor Posani Latest News : గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
గుంటూరు జైలు నుంచి నటుడు పోసాని కృష్ణమురళి విడుదల 
Embed widget