అన్వేషించండి

KCR Jagan Meet : 45 నిమిషాల పాటు కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు - రాజకీయాలపైనే ?

Jagan And KCR : కేసీఆర్ , జగన్ రాజకీయాలపై చాలా సేపు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. పరామర్శ తర్వాత 40 నిమిషాలు ఇద్దరూ చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.

KCR and Jagan held political talks : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోని నివాసంలో కేసీఆర్ ను పరామర్శించారు. తర్వాత దాదాపుగా 40 నిమిషాల పాటు ఇరువురు రాజకీయ అంశాలపై చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ నేతలు ఎవరూ లేకుండా వారిద్దరే పలు అంశాలపై మాట్లాడుకున్నారని తెలుస్తోంది. కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఉద్యమం సమయంలో జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన సమయంలో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. జగన్ పరకాల పర్యటనకు వెళ్లిన సమయంలో రైల్వే స్టేషన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.. తెలంగాణలోనూ ఆయన రాజకీయాలు చేస్తూండటంతో.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా  కేసీఆర్, జగన్ రాజకీయ స్నేహితులు అయ్యారు.
KCR Jagan Meet : 45 నిమిషాల పాటు కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు - రాజకీయాలపైనే ?

కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ స్నేహం              

2018 ముందస్తు ఎన్నికల సమయంలో వైసీపీకి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా సహకరించింది. డేటా చోరీ వంటి కేసులు పెట్టడంతో పాటు.. టీడీపీకి ఆర్థికపరమైన వనరులు తెలంగాణ నుంచి అందకుండా చేయడంలో కేసీఆర్ సర్కార్ కీలక పాతర్  పోషించిందని చెబుతారు. అదే సమయంలో వైసీపీకి ఆర్థిక సాయం కూడా అందించారని అంటారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఆ తర్వాత కూడా భేటీలు జరిగాయి. కానీ గత రెండు, మూడేళ్లుగా నేరుగా సమావేశం కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య  పలు సమస్యలు వచ్చినా నేరుగా జగన్ ఎప్పుడూ కల్పించుకోలేదు. రాజకీయ సంబంధాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి.
KCR Jagan Meet : 45 నిమిషాల పాటు కేసీఆర్‌తో ఏపీ సీఎం జగన్ చర్చలు - రాజకీయాలపైనే ?

ఇటీవల ఎన్నికల సమయంలో వైసీపీ సహకారం            

ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన కీలక నేత చెవిరెడ్డి  భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కీలక పాత్ర పోషించారు.సర్వేలు, అభ్యర్థులు, అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. అయినా ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వచ్చింది. తాజా భేటీలో చెవిరెడ్డి కూడా పాల్గొన్నారు. కానీ కేసీఆర్, జగన్ ముఖాముఖి చర్చలు జరిపిన సమయంలో పక్కన చెవిరెడ్డి కూడా లేనట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వ్యూహాలపై కేసీఆర్ చర్చించినట్లుగా చెబుతున్నారు. 

కేసీఆర్ తో భేటీ తర్వాత లోటస్ పాండ్ వెళ్లి విజయమ్మతో జగన్  భేటీ           

మరో వైపు భేటీ ముగిసిన తర్వాత సీఎం జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. షెడ్యూల్ ప్రకారం ఆయన నేరుగా  ఎయిర్ పోర్టుకు వెళ్లాల్సి ఉంది. కానీ లోటస్ పాండ్ ఇంటికి వెళ్లారు. అక్కడ జగన్ తల్లి విజయమ్మ ఉండటంతో ఆమెతో చర్చలు జరిపేందుకు వెళ్లారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంలో జగన్ విజయమ్మతో భేటీకి హైదరాబాద్ రావడం ఆసక్తికరంగా మారింది. 

టాప్ హెడ్ లైన్స్

Junior Doctors Stipend: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ విషయంలో ఏపీ ప్రభుత్వం అన్యాయం చేస్తుందా? అసలు వాస్తవాలు ఏమిటి?
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Breaking News: హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 
హైదరాబాద్‌లోని కూలిన ఏడు అంతస్తుల భవనం! 

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget