అన్వేషించండి

Karnataka: సిద్దరామయ్యకి బిగ్ రిలీఫ్, ల్యాండ్ స్కామ్ కేసులో చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు

Siddaramaiah: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి హైకోర్టు ఊరటనిచ్చింది. ల్యాండ్ స్కామ్ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు జారీ చేసింది.

 Land Scam Row: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యకి భూ కుంభకోణం కేసులో హైకోర్టు ఊరటనిచ్చింది. తదుపరి ఆదేశాలిచ్చేంత వరకూ ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు ట్రయల్ కోర్టుకి ఆదేశాలిచ్చింది. ఆగస్టు 29వ తేదీ వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆ రోజు మరోసారి హైకోర్టు ఈ కేసుపై విచారణ చేపట్టనుంది. గవర్నర్ నోటీసులు ఇవ్వడాన్ని చట్ట వ్యతిరేకమని వాదించిన సిద్దరామయ్య ఈ మేరకు కోర్టుని ఆశ్రయించి పిటిషన్ వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్నీ కూల్చే ప్రయత్నం జరుగుతోందని ప్రస్తావించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..సిద్దరామయ్యకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. 

"ప్రస్తుతం ఈ కేసుని ఈ కోర్టు విచారిస్తోంది. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ ఇంకా జరగాల్సి ఉంది. తదుపరి విచారణ వరకూ ట్రయల్ కోర్టు సిద్దరామయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు"

- కర్ణాటక హైకోర్టు

 

ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్వరలోనే విచారణ చేపట్టనుంది. అయితే హైకోర్టు మాత్రం సిద్దరామయ్యకి సానుకూలంగానే ఆదేశాలు ఇచ్చింది. MUDA స్కామ్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని ఇప్పటికే సిద్దరామయ్య తేల్చి చెప్పారు. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించారు. ఆగస్టు 17న సిద్దరామయ్యపై చర్యలకి గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు నోటీసులు కూడా పంపించారు. ఇది అనైతికమని ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సిద్దారమయ్య తరపున సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తున్నారు. ప్రజల మద్దతు ఉన్న ప్రభుత్వానికి మచ్చ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు ఫిర్యాదు చేసి నోటీసులు ఇవ్వడంలో అర్థం లేదని వాదించారు. (Also Read: Viral Video: రెండో అంతస్తు నుంచి మీద పడిన ఏసీ, విలవిలలాడి అక్కడికక్కడే వ్యక్తి మృతి - వీడియో)

ఏంటీ స్కామ్..?

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీకి స్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయన్నది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. కేసరు గ్రామంలో సిద్దరామయ్య సతీమణి పార్వతికి 3 ఎకరాల స్థలం ఉంది. దీన్ని MUDA అక్వైర్ చేసుకుంది. ఇందుకు బదులుగా మరో చోట 14 స్థలాలు పరిహారంగా ఇచ్చారు అధికారులు. అయితే..MUDA సేకరించిన స్థలం ధరతో పోల్చితే పరిహారంగా ఇచ్చిన స్థలాల విలువ ఎక్కువని పిటిషనర్లు ఆరోపిస్తున్నారు. 

Also Read: Kolkata: కోల్‌కతా కేసులో నిందితుడికి లై డిటెక్టర్ టెస్ట్, నిజాలు బయటకు వస్తాయా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

‘కూలీ’లో నాగార్జున సైమన్ లుక్ లీక్One Nation One Election | జమిలి ఎన్నికలంటే ఏంటి | ABP Desamమోదీని త్వరలోనే కలుస్తా, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలుఏపీలో బడి పంతులమ్మ, ఇప్పుడు ఢిల్లీ సీఎం - అతిషి గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో జానీ మాస్టర్? - బెంగుళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు
YSRCP : పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న  జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
పార్టీకి పిల్లర్ల లాంటి వాళ్లను కాపాడుకోలేకపోతున్న జగన్ - వదులుకుంటున్నారా ? వదిలేస్తున్నారా ?
Tragedy Incident: పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
పళ్లు తోముతుండగా బాలుడి దవడలో చొచ్చుకుపోయిన బ్రష్ - ఆపరేషన్ చేసి బయటకు తీసిన వైద్యులు
Devara: ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
ఫ్యాన్స్‌కి 'దేవర' టీం షాక్‌ - ఆ అప్‌డేట్‌ రాదంటూ బ్యాడ్‌న్యూస్‌ - నెటిజన్స్‌ రియాక్షన్‌ ఇదే!
Balineni Srinivasa Reddy : నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
నేడు పవన్‌తో భేటీకానున్న బాలినేనికి వైసీపీకి గ్యాప్ ఎందుకొచ్చింది?
Jani Master: పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
పరారీలో జానీ మాస్టర్‌ - ఎక్కడున్నాడో పట్టేసిన పోలీసులు - ఏ క్షణమైనా అరెస్టు!
Telangana News: వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
వైద్యారోగ్యశాఖలో 2050 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల- దరఖాస్తు, ఎంపిక వివరాలు ఇలా
Tirumala: తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
తిరుమలలో మహిళలు తలలో పూలు పెట్టుకుంటే ఏమవుతుంది ..అసలెందుకు పూలు పెట్టుకోరు!
Embed widget