అన్వేషించండి

Kakinada Farmers: గోదావరి తీర ప్రాంత పొలాలకు బీటలు- కన్నీరు పెడుతున్న రైతులు

Kakinada Farmers: పొలాలకు బీటలు వారడంతో కాకినాడ జిల్లా రైతులంతా కన్నీరు పెడుతున్నారు. ఏం చేయాలో తెలియక అదే పోలంలో కూర్చొని తలలు పట్టుకుంటున్నారు. 

Kakinada Farmers: పెద్ద ఎత్తున వర్షాలు పడినా, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారినా.. ఆ ప్రాంతంలో మాత్రం పంట పొలాలకు సాగు నీరు అందడం లేదు. కారణంగా పంట భూములన్నీ బీటలు వారాయి. అది చూసిన రైతులకు ఏం చేయాలో తెలియక కన్నీరు పెడుతున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న తాము ఏం చేయాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి నెర్రలు వారిని భూమిలో కూర్చొని తల్లడిల్లిపోతున్నారు. బతకడం కంటే చావడమే నయం అని అంటున్నారు. 

ఆర్ఆర్బీ చెరువు ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు

కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం మల్లవరంలో సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో గల ఆడ్ ఆర్ బీ చెరువు ద్వారా గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి మండాల పరిధిలో పది గ్రామాల్లో ఉన్న సుమారు 20 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఈ చెరువుపై ఆధారపడే అక్కడి ప్రజలు పంటలు సాగు చేస్తుంటారు. సాధారణంగా జూన్, జులై నెలలలో కురిసే వర్షాలతో పాటు పీబీసీ ద్వారా వచ్చే గోదావరి నీటితో చెరువులోకి సాగునీరు అందుతుంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం, రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల్లోని రైతులు తమ పొలాలను దమ్ము చేసుకుని వెదజల్లు పద్ధతిలో వరిసాగును చేపట్టారు. రెండు వారాల వరకూ వర్షం ద్వారా లభించిన తడి సరిపోయింది. 

ఐదు రోజుల ఎండకే బీటలు వారిన భూములు

అయితే గత ఐదు రోజులుగా ఎండలు మండిపోతుండడంతో.. ఆర్ ఆర్ బీ చెరువులో 13 తూములు ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో పంట ఎండిపోవడం ప్రారంభం అయింది. కొన్ని చోట్ల వరి పొలాలు బీటలు వారాయి. రెండు గ్రామాల్లో సుమారు 1400 ఎకరాలకు ప్రస్తుతం సాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు తెలిపారు. ఎకరాకు రూ.15 వేల వరకూ పెట్టుబడులు పెట్టామని... ఇప్పుడు ఏం చేయాలో పాలుపోవట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడే తమ జీవనం సాగుతుందని.. కానీ ఐదు రోజుల ఎండకే పంట భూములు నెరల వారాయని వాపోతున్నారు.

ఇరిగేషన్ అధికారులు ఏమయ్యారో తెలియడం లేదు 

ఇరిగేషన్ అధికారులు సాగునీరుకు ఇబ్బంది ఉండదని చెప్పడంతో వర్షపు నీటిపై ఆధారపడి వెదజల్లు పద్ధతిలో వరి వేశామని... కానీ అధికారులు ఇప్పుడు తమ కష్టాలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ నుంచి గోదావరి నీరు రావడం లేదని. ఏలేరు నీరు మళ్లించకపోవడంతో ఆర్ఆర్బీ చెరువుకు నీరు వచ్చే మార్గాలు కనిపించడం లేదని చెబుతున్నారు. పంట పొలాలు ఎండిపోవడమే కాకుండా పశువులకు తాగునీరు లభించని పరిస్థితి ఉందని అంటున్నారు. పొలాలకు సాగునీరు అందకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్యం అని స్పష్టం చేశారు. అసలు ఇరిగేషన్ అదికారులు ఎక్కడ ఉన్నారో కూడా తమకు తెలియడం లేదని.. బీటలు వారిని పొలాలు చూసైనా సాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను కోరుతున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala: రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
𝙺𝚃𝚁 𝙽𝚎𝚠𝚜: మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
Arjun Son Of Vyjayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Suryakumar Yadav Checking Abhishek Sharma Pockets | అభిషేక్ జేబులు వెతికేసిన సూర్య కుమార్ యాదవ్Klassen's glove error Rickelton Not out | IPL 2025 MI vs SRH మ్యాచ్ లో అరుదైన రీతిలో రికెల్టన్ నాట్ అవుట్MI vs SRH Match Highlights IPL 2025 | సన్ రైజర్స్ హైదరాబాద్ పై 4వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ విక్టరీ | ABP DesamMitchell Starc vs Yashasvi Jaiswal in IPL 2025 | స్టార్క్ వర్సెస్ జైశ్వాల్  | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala: రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
రాజకీయ ప్రయోజనాల కోసం మనోభావాలు దెబ్బతిస్తారా.. భూమనపై కేసునమోదు!
Revanth Reddy Japan Tour: ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్‌ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్‌- జపాన్‌ కంపెనీ అంగీకారం
𝙺𝚃𝚁 𝙽𝚎𝚠𝚜: మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
మోదీ గారు నిర్ణయం మీ చేతుల్లోనే... కేంద్రం పై కేటీర్ ఒత్తిడి!
Arjun Son Of Vyjayanthi Twitter Review: అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్విట్టర్ రివ్యూ... ఓవర్సీస్ నుంచి మిక్స్డ్ టాక్, హిట్ అయ్యే ఛాన్సుందా?
IPL 2025 GT Replacement: గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పు.. గాయ‌ప‌డిన ఫిలిప్స్ స్థానంలో లంక  ఆల్ రౌండ‌ర్.. రేపు ఢిల్లీతో మ్యాచ్
గుజ‌రాత్ టీంలో కీల‌క మార్పు.. గాయ‌ప‌డిన ఫిలిప్స్ స్థానంలో లంక ఆల్ రౌండ‌ర్.. రేపు ఢిల్లీతో మ్యాచ్
Hyderabad Crime News: పిల్లల బాధ చూడలేకపోతున్నా, పిచ్చిది అంటే తట్టుకోలేకపోతున్నా- గాజులరామారంలో తల్లి రాసిన లేఖ లభ్యం
పిల్లల బాధ చూడలేకపోతున్నా, పిచ్చిది అంటే తట్టుకోలేకపోతున్నా- గాజులరామారంలో తల్లి రాసిన లేఖ లభ్యం
Tirumala: తిరుమలలో పార్కింగ్ వద్ద అగ్నిప్రమాదం ..భయంతో పరుగులు తీసిన భక్తులు!
తిరుమలలో పార్కింగ్ వద్ద అగ్నిప్రమాదం ..భయంతో పరుగులు తీసిన భక్తులు!
Kesari Chapter 2 Twitter Review: 'కేసరి చాప్టర్ 2' ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాపై నెటిజన్లు ఏమంటున్నారంటే?
'కేసరి చాప్టర్ 2' ట్విట్టర్ రివ్యూ.. అక్షయ్ కుమార్ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామాపై నెటిజన్లు ఏమంటున్నారంటే?
Embed widget