By: Ram Manohar | Updated at : 11 Jan 2023 12:02 PM (IST)
జమ్ముకశ్మీర్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురై ముగ్గురు జవాన్లు మృతి చెందారు.
Jammu Kashmir Accident:
కాలువలో పడిన వాహనం..
జమ్ముకశ్మీర్లో ఆర్మీ వాహనం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ముగ్గురు సైనికులు మృతి చెందారు. వీరిలో ఓ ఆఫీసర్ కూడా ఉన్నారు. కుప్వారాలో ఓ కాలువలో పడిపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ప్యాట్రోలింగ్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం సంభవించినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ట్రాక్పై మంచు భారీగా కురిసిందని ఈ కారణంగా వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోయిందని వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. ముగ్గురి మృతదేహాలను బయటకు తీసింది. గతేడాది నవంబర్లోనూ ఇలాంటి ప్రమాదమే జరిగింది. మచ్చల్ సెక్టార్లో తీవ్రంగా మంచు కురుస్తున్న కారణంగా భారత సైనికులు ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు అడుగులోతు మేర మంచు కూరుకుపోయింది. గతంలో గ్లేషియర్ విరిగిపడడం వల్ల ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇది కూడా మచ్చల్ సెక్టార్లోనే జరిగింది. ప్యాట్రోలింగ్ చేస్తున్న సమయంలో ఉన్నట్టుండి మంచు గడ్డలు వచ్చి మీద పడడం వల్ల ముగ్గురు సైనికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరి కొందరు గాయపడ్డారు.
Incident #ChinarWarriors in #Machhal Sector. During a regular op task in forward area, a party of 01 JCO & 02 OR slipped into a deep gorge, when snow on the track gave way. Mortal remains of all the three #bravehearts have been retrieved. Further details follow.@NorthernComd_IA pic.twitter.com/AjULhI33Ne
— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) January 11, 2023
J-K: 3 army personnel killed in Kupwara after their vehicle skids off snowy track, falls into gorge
— ANI Digital (@ani_digital) January 11, 2023
Read @ANI Story | https://t.co/RqTDEk8dgp#JammuAndKashmir #Kupwara #IndianArmy pic.twitter.com/urfSNxoP08
సిక్కింల్లో ఘోర ప్రమాదం..
గతేడాది డిసెంబర్లో ఉత్తర సిక్కింలో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురై 16 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు సైనికులకు తీవ్ర గాయాలయ్యాయి. భారత సైన్యం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఉత్తర సిక్కింలోని జెమా ప్రాంతంలో ఆర్మీ ట్రక్ ప్రమాదానికి గురైందని ఇండియన్ ఆర్మీ వెల్లడించింది. మలుపు తిరిగే సమయంలో ఉన్నట్టుండి స్కిడ్ అయి పడిపోయిందని లోయలోకి పడిపోయిందని అధికారులు తెలిపారు. "దురదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ముగ్గురు జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్లతో పాటు 13 మంది సైనికులను కోల్పోవాల్సి వచ్చింది. ఈ కఠిన సమయంలో ఆ సైనికుల కుటుంబాలకు ఇండియన్ ఆర్మీ అండగా ఉంటుంది. నార్త్ సిక్కిం చాలా ప్రమాదకరమైన ప్రదేశం. చాలా రోజులుగా ఇక్కడ తీవ్రంగా మంచు కురుస్తోంది" అని ఇండియన్ ఆర్మీ విచారం వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంపై భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు. "రోడ్డు ప్రమాదంలో సైనికులు మరణించడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. వాళ్లు ఇన్నాళ్లు అందించిన సేవలను దేశం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటుంది. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను" అని ట్వీట్ చేశారు.
హైదరాబాద్ లో మరో గ్లోబల్ క్యాపబిలిటీ కేంద్రం, కీలక ప్రకటన చేసిన శాండోస్ కంపెనీ
Dhanbad Fire Accident: జార్ఖండ్లో భారీ అగ్నిప్రమాదం, అపార్ట్ మెంట్లో మంటలు చెలరేగి 14 మంది దుర్మరణం
Nizamabad: నందిపేట్ సర్పంచ్ ఆత్మహత్యాయత్నంతో రచ్చ కెక్కుతున్న నిధుల పంచాయితీ !
TS Minister KTR: నిధుల వరద పారిస్తా అన్నావ్ ! ఎన్ని పైసలు తెచ్చినవ్ ఈటల: మంత్రి కేటీఆర్ సెటైర్లు
Nizamabad News: దక్షిణ మధ్య రైల్వేలో నిజామాబాద్ జంక్షన్ కీలకం - కేంద్ర బడ్జెట్ లో ఈసారైనా న్యాయం జరిగేనా!
కోటంరెడ్డి ఫోన్లు మేం ట్యాప్ చేయలేదు, కానీ తర్వాత బాధపడతాడు: మాజీ మంత్రి బాలినేని
Director Atlee: తండ్రయిన అట్లీ, పండంటి బాబు పుట్టినట్లు వెల్లడి
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ, మహిళా శిశు సంక్షేమశాఖ కమిషనర్గా భారతి హోళికేరి
Nellore Anam : నెల్లూరు వైఎస్ఆర్సీపీలో మరోసారి ఆనం బాంబ్ - ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు - ప్రాణ హానీ ఉందని ఆందోళన !