అన్వేషించండి

ఇజ్రాయెల్ ప్రపంచ మద్దతు కోల్పోవడం మొదలైందన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్ 

జ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రపంచ మద్దతు కోల్పోతోందని వ్యాఖ్యానించారు.

Isreal-Hamas War : ఇజ్రాయెల్‌-హమాస్‌ (Isreal-Hamas ) యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ (Us President joe Biden ) సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో ఇజ్రాయెల్ ప్రపంచ మద్దతు కోల్పోతోందని, దీర్ఘకాలిక పరిష్కారానికి నెతన్యాహు ప్రభుత్వం అడ్డంపడుతోందని వ్యాఖ్యానించారు.  అన్నారు. విచక్షణా రహితంగా చేస్తున్న బాంబింగే దీనికి ప్రధాన కారణమని, కఠిన పదజాలంతో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (  Netanyahu )ను హెచ్చరించారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో సహా నెతన్యాహు మారాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.  కొన్ని విషయాలను నెతన్యాహు అర్థం చేసుకొంటాడన్న బైడెన్, వార్‌ కేబినెట్‌, నేషనల్‌ సెక్యూరిటీ మినిస్టర్‌ బెన్‌ గ్విర్‌ ఎంత వరకు అర్థం చేసుకొంటారో చెప్పలేనంటూ కుండబద్దలు కొట్టారు. 

జోబైడెన్‌, నెతన్యాహు మధ్య అభిప్రాయ భేదాలు
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌, ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు మధ్య అభిప్రాయ భేదాలు మరోసారి బయటపడ్డాయి. తాజాగా బైడెన్‌ బహిరంగ వ్యాఖ్యలు ఈ విషయాన్ని చెబుతున్నాయి. నెతన్యాహుతో ఇప్పటికే పలు మార్లు మాట్లాడానన్న బైడెన్, ఇజ్రాయెల్‌ రక్షణ బాధ్యత అమెరికాతో ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. ఆ దేశానికి ఐరోపా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు మద్దతు ఉందని, గాజాలో జరుపుతున్న విచక్షణా రహిత బాంబింగ్‌ తో ప్రస్తుతం ఇజ్రాయెల్ మద్దతు కోల్పోవడం మొదలైందని అన్నారు. అమెరికాపై  9/11 దాడుల అనంతర పరిణామాల నుంచి ఇజ్రాయెల్‌ పెద్దగా నేర్చుకోలేదని బైడెన్‌ అభిప్రాయపడ్డారు.

 హౌతీ రెబల్స్‌ పై చర్యలు తీసుకోకపోతే...
మరోవైపు అమెరికా ప్రతిపాదించిన యుద్ధానంతర ప్రణాళికను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు తిరస్కరించారు. ప్రధానంగా డెమొక్రటిక్‌ పార్టీకి విరాళాలు ఇచ్చే వారి నుంచి ఒత్తిడి పెరగడంతో...జో బైడెన్‌ స్వరంలో మార్పునకు కారణమైనట్లు తెలుస్తోంది. ఎర్ర సముద్రంలో హౌతీ రెబల్స్‌ తరచూ తమ దేశ నౌకలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేయడంపై ఇజ్రాయెల్‌ ఆగ్రహంతో రగిలిపోతోంది. అమెరికా చర్యలు తీసుకోకపోతే తామే రంగంలోకి దిగుతామని నెతన్యాహు హెచ్చరించారు. 

 ఇజ్రాయెల్ - హమాస్ యుద్ధంలో కాల్పుల విరమణ, బందీలను బేషరతుగా విడుదల చేయాలంటూ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్  అనుకూలంగా ఓటు వేసింది. రెండు ప్రాంతాల మధ్య శాంతి నెలకొల్పాల్సిన ఆవశ్యకతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ మద్య సమతుల్యతను సాధించడమే సవాలు అని రుచిరా కాంబోజ్ పేర్కొన్నారు. సమస్యను పరిష్కరించడానికి అంతర్జాతీయ సమాజం  ఉమ్మడిగా ఆలోచించడం గొప్ప విషయమని, భారత్ దానిని స్వాగతిస్తుందని పేర్కొన్నారు. మంగళవారం ఐక్యరాజ్యసమితిలో జరిగిన అత్యవసర ప్రత్యేక సమావేశంలో ఈజిప్ట్ ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానాన్ని 193 మంది సభ్యుల UN జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 153 ఓట్లు రాగా, 10 దేశాలు వ్యతిరేకంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్‌కు గైర్హాజరు అయ్యాయి. గాజాలో తక్షణం మానవతావాద కాల్పుల విరమణను కోరుతూ అల్జీరియా, బహ్రెయిన్, ఇరాక్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, పాలస్తీనా  తీర్మానించాయి. అంతర్జాతీయ చట్టాల ప్రకారం అన్ని దేశాలు తమ బాధ్యతలను పాటించాలని ఐక్యారాజ్య సమితి పునరుద్ఘాటించింది. ముఖ్యంగా పౌరుల రక్షణకు సంబంధించిన అంశాలను విధిగా పాటించాలని యూన్ సూచించింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections 2026: తమిళనాట విజయ్ వర్సెస్ రజనీకాంత్ - ఘాటు లేఖ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ !
తమిళనాట విజయ్ వర్సెస్ రజనీకాంత్ - ఘాటు లేఖ రిలీజ్ చేసిన సూపర్ స్టార్ !
Pawan Kalyan Tamil Interview: విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
విజయ్ ఎన్డీఏ కూటమిలోకి వస్తే ఆహ్వానిస్తా - కానీ ప్రతిపాదన పెట్టలేదు - తమిళ ఇంటర్యూలో పవన్ కీలక వ్యాఖ్యలు
Renault Duster 2026 Price: భారత్‌లో కం బ్యాక్ చేసిన రెనాల్ట్ డస్టర్.. హైదరాబాద్‌లో బేసిక్, టాప్ ఎండ్ ధరలు ఇవే..
భారత్‌లో కం బ్యాక్ చేసిన రెనాల్ట్ డస్టర్.. హైదరాబాద్‌లో బేసిక్, టాప్ ఎండ్ ధరలు ఇవే..
Drug Test in Telangana Assembly: డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్
డ్రగ్స్ టెస్టుకు సీఎం రేవంత్‌ రెడ్డి రెడీ.. మరి కేసీఆర్, కేటీఆర్‌ వస్తారా ? మండలిలో మహేష్ గౌడ్ ఛాలెంజ్

వీడియోలు

Vaibhav Suryavanshi Gayle IPL Record | వైభవ్ సూర్యవంశీ సంచలన ఛాలెంజ్ | ABP Desam
AIMIM MLAs Walkout Vandematarm | తెలంగాణ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కేంద్ర మంత్రుల ఫైర్ | ABP Desam
Jay Shah Smashes T20W C 2026 Controversies | పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లకు జై షా వార్నింగ్ | ABP Desam
Abhishek Sharma T20WC 2026 Secret Revealed | అభిషేక్ కు గంభీర్ సలహా | ABP Desam
Rishabh Pant Transformation IPL 2026 | యువరాజ్ సింగ్ శిక్షణలో రిషబ్ పంత్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ramzan 2026: ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
ఇమామ్‌లు, మౌజన్లకు చంద్రబాబు సర్కార్ రంజాన్ కానుక.. 10 వేల ఖాతాల్లోకి నగదు జమ
BRS On Rohit Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
మొయినాబాద్ డ్రగ్స్ కేసు- రోహిత్ రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజ్ నోటీసులు.. పార్టీకి దూరంగా ఉండాలని ఆదేశాలు
Pakistan Airstrike: కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
కాబూల్‌లో పాక్ వైమానిక దాడులు.. 400 మందికి పైగా మృతి- హాస్పిటల్స్, నివాస ప్రాంతాలే టార్గెట్
Akshay Kumar: నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
నవ్వించడం కష్టమే కానీ... అవార్డులు ఇవ్వరుగా - అక్షయ్ కుమార్ కామెంట్స్‌
Telangana Assembly Budget Session: ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
ప్రశ్నోత్తరాలు లేకుండా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. బీఆర్ఎస్ విమర్శలు! బీజేపీ వినూత్న నిరసన
Kerala Assembly Elections 2026: కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
కేరళంలో కాంగ్రెస్‌కు డూ ఆర్ డై ఎన్నికలు - మూడోసారీ ఓడిపోతే బీజేపీదే ఆ స్థానం !
YSRCP local polls plan: లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
లోకల్‌పోల్స్‌లో అసలు టార్గెట్ కూటమి మధ్య చిచ్చే - వైసీపీ పక్కా ప్లాన్‌తో రెడీ అవుతోందా?
Weight Loss Journey : మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
మూడు సంవత్సరాల్లో 72 కిలోలు తగ్గిన మహిళ.. ఈ 7 సింపుల్ హ్యాబిట్స్ మిమ్మల్నీ కూడా మార్చేస్తాయి
Embed widget