అన్వేషించండి

Inter Supply Results: ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు విడుద‌ల‌, ఇక్కడ చూసుకోండి!

ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. జ‌న‌ర‌ల్ కోర్సుల్లో 67.72 శాతం ఉత్తీర్ణత సాధించ‌గా, వోకేష‌న‌ల్ కోర్సుల్లో 57.28 శాతం ఉత్తీర్ణత సాధించారు

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్షా ఫ‌లితాలు విడుద‌ల‌య్యాయి. ఇంట‌ర్ బోర్డు కార్యాల‌యంలో కార్యద‌ర్శి ఉమ‌ర్ జ‌లీల్ మంగ‌ళ‌వారం సాయంత్రం ఫ‌స్టియ‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. జ‌న‌ర‌ల్ కోర్సుల్లో 67.72 శాతం ఉత్తీర్ణ‌త సాధించ‌గా, వోకేష‌న‌ల్ కోర్సుల్లో 57.28 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. జ‌న‌ర‌ల్ కోర్సు ప‌రీక్షల‌కు 2,20,456 మంది విద్యార్థులు హాజ‌రు కాగా, 1,49,285 మంది పాస‌య్యారు. వొకేష‌న్ కోర్సు ప‌రీక్ష‌ల‌కు 18,955 మంది హాజ‌రు కాగా, 10,858 మంది విద్యార్థులు ఉత్తీర్ణ‌త సాధించారు. ఫ‌లితాల కోసం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.


ఇక మంగ‌ళ‌వారం ఉద‌యం విడుద‌లైన‌ ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల్లో జనరల్‌లో 48,816 మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులకు పరీక్షలకు హాజరయ్యారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. 65.07శాతం ఉత్తీర్ణత సాధించారు. అయితే, సెప్టెంబర్‌ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్‌ బోర్డు అవకాశం కల్పించింది.

 

ఫలితాల కోసం క్లిక్ చేయండి..

 

తెలంగాణలో ఆగస్టు 1 నుంచి 10 వరకు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ పరీక్షలకు దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,34,329 మంది, సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు 1,13,267 మంది విద్యార్థులు హాజరయ్యారు

ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలకు మొత్తం 9.28 లక్షల మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు. మే 6 నుంచి 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు,  మే 7 నుంచి 24వ వరకు  సెంకడ్ ఇయర్ పరీక్షలను నిర్వహించారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్టియర్‌లో 63.32 శాతం.. సెకండియర్‌లో 67.16 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలో మొత్తం 2,94,378 మంది ఉత్తీర్ణత సాధించగా.. సెకండ్ ఇయర్‌లో 4,63,370 మంది ఉత్తీర్ణులయ్యారు. రెగ్యూలర్ పరీక్షల్లో ఫెయిలైన వారికి ఆగస్టు 1 నుంచి 10 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. వీటి ఫలితాలను ఆగస్టు నెలాఖరులో విడుదల చేయనున్నారు.

 

Also Read:

HORTICET - 2022: ఏపీ హార్టీసెట్‌ నోటిఫికేషన్ విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ - పశ్చిమగోదావరి జిల్లా వెంకటరామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ, 2022-23 విద్యా సంవత్సరానికి గాను బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో ప్రవేశానికి 'ఏపీ హార్టీసెట్‌-2022' నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగంలో డిప్లొమా పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. హార్టీసెట్‌ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం 92 సీట్లను భర్తీ చేస్తారు. వీటిలో యూనివర్సిటీ కాలేజీ సీట్లు 52 కాగా.. ప్రైవేట్ కాలేజీ సీట్లు 40 ఉన్నాయి. మొత్తం సీట్లులో లోకల్ అభ్యర్థులకు 85 శాతం సీట్లు, 15 శాతం సీట్లు అన్-రిజర్వ్‌డ్ కింద భర్తీ చేస్తారు.
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి.. 

 

Also Read:

NTR Health University: పారా మెడికల్‌ కోర్సుల్లో ప్రవేశాలు, చివరితేది ఇదే!
ఏపీలోని పారా మెడికల్  కళాశాలల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్  ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆగస్టు 12న  నోటిఫికేషన్  విడుదల చేసింది. దీనిద్వారా ఆయా కళాశాలల్లో బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ (పారామెడికల్) కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. సరైన అర్హతలున్న అభ్యర్థులు ఆగస్టు 13న మధ్యాహ్నం 11 గంటల నుంచి సెప్టెంబరు 2న సాయంత్రం 4 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాలి.
కోర్సుల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

 

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

WHO BP Report:హైబీపీతో బాధడుతున్న భారతీయులు- కంగారు పెట్టిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  
హైబీపీతో బాధడుతున్న భారతీయులు- కంగారు పెట్టిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  
Devara 2 Update: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'దేవర 2'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది
NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'దేవర 2'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది
పవర్‌ఫుల్‌ స్పోర్టీ ఇంజిన్‌తో Skoda Octavia RS త్వరలోనే లాంచ్‌ - ప్రి-బుకింగ్ డేట్‌ కూడా వచ్చింది
పవర్‌ఫుల్‌ స్టోరీ ఫీచర్స్‌తో Skoda పెర్ఫార్మెన్స్‌ కార్‌ రాబోతోంది - ప్రి-బుకింగ్ డిటైల్స్‌ ఇవిగో!
OG Movie: 'ఓజాస్ గంభీర' కూతురు సయేషా - యాడ్స్ To మూవీస్... చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఓజాస్ గంభీర' కూతురు సయేషా - యాడ్స్ To మూవీస్... చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Advertisement

వీడియోలు

India vs Sri Lanka Asia Cup 2025 | Pathum Nissanka | నిశాంక సూపర్ సెంచరీ
India vs Sri Lanka Asia Cup 2025 | Arshdeep Singh | మలుపు తిప్పిన అర్ష్‌దీప్ సింగ్
India vs Sri Lanka Highlights Asia Cup 2025 | లంకపై విజయం సాధించిన భారత్
Asia Cup 2025 Sri Lanka Super Over | భారత్ పై పోరాడి ఓడిన లంక
Christopher nolan Movies Decode Telugu | టైమ్ తో ఫుట్ బాల్ ఆడతాడు..సైన్స్ ఫిక్షన్ తో బుర్ర తినేస్తాడు..| ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
WHO BP Report:హైబీపీతో బాధడుతున్న భారతీయులు- కంగారు పెట్టిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  
హైబీపీతో బాధడుతున్న భారతీయులు- కంగారు పెట్టిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక  
Devara 2 Update: NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'దేవర 2'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది
NTR ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - 'దేవర 2'పై బిగ్ అప్డేట్ వచ్చేసింది
పవర్‌ఫుల్‌ స్పోర్టీ ఇంజిన్‌తో Skoda Octavia RS త్వరలోనే లాంచ్‌ - ప్రి-బుకింగ్ డేట్‌ కూడా వచ్చింది
పవర్‌ఫుల్‌ స్టోరీ ఫీచర్స్‌తో Skoda పెర్ఫార్మెన్స్‌ కార్‌ రాబోతోంది - ప్రి-బుకింగ్ డిటైల్స్‌ ఇవిగో!
OG Movie: 'ఓజాస్ గంభీర' కూతురు సయేషా - యాడ్స్ To మూవీస్... చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
'ఓజాస్ గంభీర' కూతురు సయేషా - యాడ్స్ To మూవీస్... చైల్డ్ ఆర్టిస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?
Zoho:మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను వెనక్కి నెట్టేసిన కొత్త ప్లాట్‌ఫామ్‌! కేంద్రమంత్రి కూడా వాడుతున్నారు!
మైక్రోసాఫ్ట్, గూగుల్‌ను వెనక్కి నెట్టేసిన కొత్త ప్లాట్‌ఫామ్‌! కేంద్రమంత్రి కూడా వాడుతున్నారు!
Dussehra 2025: ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 5 రోజుల్లో భారీ ఆదాయం, ఇకపై భక్తులందరకీ ఉచిత దర్శనం - వీఐపీలు గమనించాలి!
ఇంద్రకీలాద్రి దుర్గమ్మకు 5 రోజుల్లో భారీ ఆదాయం, ఇకపై భక్తులందరకీ ఉచిత దర్శనం - వీఐపీలు గమనించాలి!
Telangana IPS Transfers: తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు- హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్‌- మరికొందరు సీనియర్లకు కీలక బాధ్యతలు  
తెలంగాణలో 23 మంది ఐపీఎస్‌ల బదిలీలు- హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్‌- మరికొందరు సీనియర్లకు కీలక బాధ్యతలు  
Mohan Babu: ఇట్స్ అఫీషియల్... నాని 'ది ప్యారడైజ్' విలన్ 'శికంజా మాలిక్' - మోహన్ బాబు మాస్ లుక్‌ మీరు చూసుండరు!
ఇట్స్ అఫీషియల్... నాని 'ది ప్యారడైజ్' విలన్ 'శికంజా మాలిక్' - మోహన్ బాబు మాస్ లుక్‌ మీరు చూసుండరు!
Embed widget