అన్వేషించండి

Indonesia: జకార్తా జైలులో అగ్నిప్రమాదం.. 41 మంది ఖైదీలు మృతి..

ఇండోనేషియాలో బుధవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బాంటెన్ ప్రావిన్స్ జైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు.

ఇండోనేషియా దేశ రాజధాని జకార్తాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బాంటెన్ ప్రావిన్స్ జైలులో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటనలో 41 మంది ఖైదీలు మరణించారు. మరో 39 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున ఒంటి గంట సమయంలో జైలులో మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలు ఆర్పేందకు యత్నిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు వెల్లడించారు.  

జకార్తా శివార్లలోని టాంగెరంగ్ జైలులోని బ్లాక్ సి వద్ద అగ్నిప్రమాదం జరిగిందని.. ప్రభుత్వ అధికారి ఒకరు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోనేషియా న్యాయ మంత్రిత్వ శాఖ ఆధీనంలోని జైళ్ల శాఖ అధికార ప్రతినిధి రికా అప్రియంతి వెల్లడించారు. 

ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు జైలు అధికారులు అంచనా వేస్తున్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో అరెస్టు అయిన ఖైదీలు ఈ బ్లాక్‌లో ఉంటారు. 122 మంది ఉండేందుకు ఈ జైలులో ఏర్పాట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంత మంది ఉన్నారనే వివరాలు మాత్రం తెలియరాలేదు. 

సామర్థ్యానికి మించి ఖైదీలు..
ఇండోనేషియా జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలను ఉంచుతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇది ఇప్పుడు ఇండోనేషియాలో పెద్ద సమస్యగా మారింది. తాజాగా ప్రమాదం జరిగిన టాంగెరంగ్ జైలు విషయానికి వస్తే.. దీనిలో 1,225 మందిని ఉంచవచ్చు. అయితే ప్రస్తుతం ఈ జైలులో సామర్థ్యానికి మించి దాదాపు 2000 మందిని ఉంచారు. జైళ్లలో కనీస వసతులు కూడా సరిగా ఉండవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధుల కేటాయింపులో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో జైళ్లలో ఖైదీల మధ్య గొడవలు, తగదాలు వంటివి పరిపాటిగా మారాయి. కొంతమంది ఖైదీలు తప్పించుకోవడానికి కూడా యత్నాలు చేస్తుంటారు. ఇలా తప్పించుకునే క్రమంలో చిన్న చిన్న అగ్ని ప్రమాదాలు సంభవించిన ఘటనలు చాలా ఉన్నాయి. 

Also Read: Guntur: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్‌.. దేహశుద్ధి చేసిన గ్రామస్థులు.. గుంటూరు జిల్లాలో ఘటన

Also Read: Petrol-Diesel Price, 8 September 2021: ఇవాళ్టీ పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Advertisement

వీడియోలు

Asifabad DCC President Athram Suguna Interview | ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణిస్తానంటున్న ఆత్రం సుగుణ | ABP Desam
Philosophy Behind Avatar Movie | అవతార్ 3 చూసే ముందు ఓ సారి ఇది ఆలోచించు | ABP Desam
ఐయామ్ సారీ.. మేం సరిగా ఆడలేకపోయాం.. కానీ..!
డబ్ల్యూపీఎల్‌ మెగా వేలంలో ఆంధ్రా అమ్మాయికి రికార్డ్ ధర..
ధోనీ ఇంట్లో కోహ్లీ, రోహిత్ గంభీర్‌పై రెచ్చిపోతున్న ఫ్యాన్స్!
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Surrendered: మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
మావోయిస్టు పార్టీ బిగ్‌షాక్! పోలీసులకు కీలక నేత సరెండర్‌!
Kokapet land auction: 150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
150 కోట్లు దాటిన కోకాపేటలో ఎకరం భూమి- తాజా వేలంలో కొత్త రికార్డులు
Pinnelli Brothers: పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
పిన్నెల్లి బ్రదర్స్ ను నిండా ముంచిన లాయర్లు - ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
Kavitha Politics: కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
కాళేశ్వరం నుంచి కామారెడ్డికి ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదు: కవిత సంచలనం
Goa Sarswat Math: పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
పనాజీలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముని విగ్రహం ఆవిష్కరించిన ప్రధాని మోదీ
Pawan Kalyan: రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్ పై కుట్ర - అపరిచిత వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు
India GDP: భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
భారత్‌ GDP బుల్లెట్ ట్రైన్ వేగంతో దూసుకెళ్తోంది! అంచనాలకు మించిన గణాంకాలు
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
కొత్త చిక్కుల్లో హైడ్రా రంనాథ్! బతుకమ్మ కుంట వివాదంలో కోర్టును ధిక్కరించి చేసిన తప్పేంటి? అరెస్ట్ తప్పదా!?
Embed widget