అన్వేషించండి

రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాలను అడ్డుకోలేం, బిహార్ కులగణన సర్వేపై సుప్రీంకోర్టు

కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధారపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది.

కులగణనకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే విధారపరమైన నిర్ణయాలను అడ్డుకోలేమని స్పష్టం చేసింది. బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కులగణనకు సంబంధించి తదుపరి సమాచారాన్ని వెల్లడించకుండా, నిరోధించాలని పిటీషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బిహార్ ప్రభుత్వం తీసుకున్న కులగణన సమాచారం బయటకు రాకుండా చేయడానికి నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొనే విధానపరమైన నిర్ణయాన్ని అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఒకవేళ డేటాకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటే.. దాన్ని పరిశీలనలోకి తీసుకుంటామని తెలిపింది. బిహార్‌ ప్రభుత్వం చేపట్టిన కుల ఆధారిత సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్ల విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 

బిహార్ ప్రభుత్వానికి నోటీసులు
నితీష్ కుమార్ సర్కార్ చేపట్టిన కుల ఆధారిత సర్వేను ఆగస్టు 2న పట్నా హైకోర్టు సమర్థించింది. ఈ సర్వే రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ, యూత్‌ ఫర్‌ ఈక్వాలిటీ, ఏక్‌ సోచ్‌ ఏక్‌ ప్రయాస్‌ అనే స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. వీటిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్‌వీఎన్‌ భట్టీ ధర్మాసనం విచారణ జరిపింది. కులగణన అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పటికీ, నితీష్ కుమార్ ప్రభుత్వం  సర్వే వివరాలను వెల్లడించిందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇది గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని, దీనిపై స్టే ఇవ్వాలని వాదించారు. పిటిషనర్ల సవాలుపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

బిహార్‌లో 63 శాతం బీసీలే.. కులగణన వెల్లడి
దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న బిహార్‌ కుల గణన సర్వే వివరాలను నితీష్ కుమార్ సర్కార్ వెల్లడించింది. 13.07 కోట్లున్న రాష్ట్ర జనాభాలో 63.13శాతం బీసీలే ఉన్నారని నివేదికలో తేలింది. ఇందులో అత్యంత వెనుకబడిన వర్గాలు 36శాతం, ఇతర వెనుకబడిన వారి జనాభా  27.13శాతంగా ఉన్నట్లు తేలింది. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టడం వీలుకాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో తమ రాష్ట్రంలో ఈ ప్రక్రియ చేపడతామని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ గత ఏడాది జూన్‌లో ప్రకటించారు. ఈ ఏడాది జనవరిలో కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 38 జిల్లాల్లో రెండు దశల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. మరోవైపు కులగణనను వ్యతిరేకిస్తూ పట్నా హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం వాటిని కొట్టివేస్తూ సర్వేకు అనుమతించింది. దీంతో ఈ విషయం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కుల ఆధారిత సర్వేపై దాఖలైన పిటిషన్లపై తదుపరి విచారణను 2024 జనవరికి వాయిదా వేసింది అత్యున్నత న్యాయస్థానం. 

యాదవుల జనాభా 14.27శాతం
ఓబీసీల్లో యాదవులు అత్యధికంగా 14.27శాతం ఉన్నారు. దళితులు 19.65శాతం ఉంటే, గిరిజనులు కేవలం  1.68 శాతమే ఉన్నారు. అంటే గిరిజనుల జనాభా రాష్ట్రంలో ఉన్నది 22 లక్షలు మాత్రమే. మొత్తం జనాభాలో హిందువులు 81.99 శాతంగా ఉంటే, ముస్లింల జనాభా 17.7శాతంగా ఉంది. క్రైస్తవులు, సిక్కులు, జైన్లు వేళ్లమీద లెక్కబెట్టేంత స్థాయిలోనే ఉన్నారు.  

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
West Bengal Elections: ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
ప్రధాని మోదీ నుంచి హేమా మాలిని వరకు... 40 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసిన బీజేపీ
Kerala Assembly Elections: ఇంట్లో కుస్తీ - బయట దోస్తీ - కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై అమిత్ షా ఫైర్
ఇంట్లో కుస్తీ - బయట దోస్తీ - కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల తీరుపై అమిత్ షా ఫైర్
PM Modi: దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన
దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్ల తగ్గింపు ఉండదు: ప్రధాని మోదీ కీలక ప్రకటన

వీడియోలు

Rajasthan Royals vs Gujarat Titans IPL 2026 | రాజ‌స్థాన్ రాయల్స్ థ్రిల్లింగ్ విక్ట‌రీ
IPL 2026 Jofra Archer Death Overs RR vs GT | 19వ ఓవర్ లో జోఫ్రా ఆర్చర్ మ్యాజిక్
Siraj Catch Drop GT vs RR IPL 2026 | సిరాజ్ ఈజీ క్యాచ్‌ను సిక్సర్‌గా మార్చేశాడా
IPL 2026 Delhi Capitals vs Mumbai Indians | ఢిల్లీకి వ‌రుస‌గా రెండో విజ‌యం
Riyan Parag Credits Dhruv Jurel RR vs GT IPL 2026 | రియాన్ పరాగ్ ప్లాన్ వెనుక ఉన్నది అతనే

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains Update: కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్.. ప్రజలకు సూచనలు
కొన్ని గంటల్లో ఏపీలో భారీ వర్షాలు, ఆ జిల్లాల్లో పిడుగులు పడతాయని వార్నింగ్.. ప్రజలకు సూచనలు
Andhra Pradesh Financial Status: అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
అప్పుల వేటలో సంపద సృష్టి విస్మరణ.. ఏపీ ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోందా?
Huzurabad Politics: హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
హుజురాబాద్‌లో డంపింగ్ యార్డ్ వివాదం.. పోరాటానికి సిద్ధమని ప్రకటించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
Granny OTT : గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
గ్రామంలో చిన్నారుల హత్యలు - బంగ్లాలో ఒళ్లు గగుర్పొడిచే ఘటనలు... ట్రెండింగ్‌లో హారర్ థ్రిల్లర్ 'గ్రానీ'
Tamil Nadu Assembly Elections: పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
పొత్తులు పెట్టుకోరు - డబ్బులు ఖర్చు చేయరు - కానీ ఓటు బ్యాంక్ ఘనం- తమిళ రాజకీయాల్లో సీమాన్ స్టైలే వేరు!
Donald Trump: ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
ఇరాన్ నిరసనకారులకు గన్స్ పంపించాం.. కానీ వారికి చేరాయో లేదో? డొనాల్డ్ ట్రంప్
Hyderabad Crime News: పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
పెళ్లిబట్టలతో హోటల్ రూంలో యువకుడు ఆత్మహత్య.. లవర్ వచ్చేలోపే విషాదం- కేపీహెచ్‌బీలో ఘటన
Mrunal Thakur : సరస్వతి రోల్ వెరీ ఛాలెంజింగ్ - అంబులెన్స్‌తో రిస్కీ సీన్స్... మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూ
సరస్వతి రోల్ వెరీ ఛాలెంజింగ్ - అంబులెన్స్‌తో రిస్కీ సీన్స్... మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ ఇంటర్వ్యూ
Embed widget