అన్వేషించండి

Assembly Polls 2022 Live: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్- గోవాలో 5 గంటల వరకు 75 శాతం ఓటింగ్

2022లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు యూపీలో రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉత్తరాఖండ్, గోవాల్లోనూ నేడు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Voting for Goa Uttarakhand Elections and 2nd Phase of UP Elections 2022 Live Updates Assembly Polls 2022 Live: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్- గోవాలో 5 గంటల వరకు 75 శాతం ఓటింగ్
ప్రతీకాత్మక చిత్రం

Background

ఉత్తర్​ప్రదేశ్ రెండో దశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. 586 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, ఈ రెండో దశలో జరిగే స్థానాల్లో ముస్లింలదే హవా. ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం కానున్నాయి. స్థానికంగా చెరకు రైతులకు ఉన్న బిల్లుల చెల్లింపుల అంశం ఎన్నికలపై ప్రభావం పడనుంది. ఈ క్రమంలో మొదటిదశ పోలింగ్‌తో పోలిస్తే బీజేపీ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు, రెండో విడతలో పోలింగ్ జరిగే సహారన్‌పుర్‌, రాంపుర్‌ తదితర జిల్లాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ సమాజ్​వాదీ పార్టీకి గట్టి పట్టు కూడా ఉంది.

దీనికి తోడు కేంద్ర వ్యవసాయ చట్టాలు.. అనంతర పరిణామాలు కూడా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ అంశం కూడా కీలకమే. ఇలాంటి కారణాల నేపథ్యంలో రెండోదశలో బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. ముస్లిం ఓట్లను చీల్చగలిగితే బీజేపీకి లాభం కలిగే ఛాన్స్ ఉంది.

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో దళితులు 20 శాతంగా ఉన్నారు. వీరి ఓట్లు ఎటువైపు పడతాయనే అంశంపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గతంలో ఈఈ ప్రాంతాల్లో ముస్లిం, జాట్‌, దళిత ఓటర్ల కూటమి ఫార్ములా విజయవంతం అయింది. అందుకే ఈసారి సమాజ్ వాదీ పార్టీ ఆర్‌ఎల్‌డీ, మహాన్‌ దళ్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ కారణంగా జాట్‌ ఓట్లపై ఆర్‌ఎల్‌డీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. బదాయూ, సంభల్‌ జిల్లాల్లో ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అక్కడ ఎస్పీకే బలమెక్కువ.

నేడు ఉత్తరాఖండ్‌లోనూ...
ఉత్తరాఖండ్​లోనూ నేడు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 13 జిల్లాల్లోని 70 నియోజకవర్గాలకు అన్నీ ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో 82,38,187లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ అభ్యర్థుల్లో 152 మంది స్వతంత్రులు ఉన్నారు. కరోనా కారణంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 101 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం 6 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

గోవాలోనూ ఒకేదశలో
గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు శివసేన కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కూడా గతంలో తన తండ్రి స్థానం పనాజీ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడి టికెట్ బీజేపీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

18:29 PM (IST)  •  14 Feb 2022

గోవాలో 75 శాతం

దేశంలో ఈరోజు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు గోవాలో 75 శాతం, ఉత్తరాఖండ్‌లో 59 శాతం పోలింగ్ నమోదైంది. యూపీ రెండో విడత పోలింగ్‌లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.

14:08 PM (IST)  •  14 Feb 2022

1 గంట వరకు

గోవా, ఉత్తరాఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు గోవాలో 44 శాతం, ఉత్తరాఖండ్‌లో 35 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు యూపీలో జరుగుతోన్న రెండో విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget