అన్వేషించండి

Assembly Polls 2022 Live: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్- గోవాలో 5 గంటల వరకు 75 శాతం ఓటింగ్

2022లో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేడు యూపీలో రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉత్తరాఖండ్, గోవాల్లోనూ నేడు ఒకే దశలో పోలింగ్ జరుగుతోంది. లైవ్ అప్ డేట్స్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తుండండి.

Key Events
Voting for Goa Uttarakhand Elections and 2nd Phase of UP Elections 2022 Live Updates Assembly Polls 2022 Live: 3 రాష్ట్రాల్లో ప్రశాంతంగా పోలింగ్- గోవాలో 5 గంటల వరకు 75 శాతం ఓటింగ్
ప్రతీకాత్మక చిత్రం

Background

ఉత్తర్​ప్రదేశ్ రెండో దశ ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 9 జిల్లాల్లోని 55 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది. 586 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే, ఈ రెండో దశలో జరిగే స్థానాల్లో ముస్లింలదే హవా. ముస్లింలతో పాటు చెరకు రైతుల ఓట్లు కీలకం కానున్నాయి. స్థానికంగా చెరకు రైతులకు ఉన్న బిల్లుల చెల్లింపుల అంశం ఎన్నికలపై ప్రభావం పడనుంది. ఈ క్రమంలో మొదటిదశ పోలింగ్‌తో పోలిస్తే బీజేపీ గట్టి పోటీ ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మరోవైపు, రెండో విడతలో పోలింగ్ జరిగే సహారన్‌పుర్‌, రాంపుర్‌ తదితర జిల్లాల్లో ముస్లింల జనాభా చాలా ఎక్కువ. సాధారణంగా ఇక్కడ సమాజ్​వాదీ పార్టీకి గట్టి పట్టు కూడా ఉంది.

దీనికి తోడు కేంద్ర వ్యవసాయ చట్టాలు.. అనంతర పరిణామాలు కూడా యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ అంశం కూడా కీలకమే. ఇలాంటి కారణాల నేపథ్యంలో రెండోదశలో బీజేపీకి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అయితే, యూపీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ.. ముస్లిం ఓట్లను చీల్చగలిగితే బీజేపీకి లాభం కలిగే ఛాన్స్ ఉంది.

రెండో దశ ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో దళితులు 20 శాతంగా ఉన్నారు. వీరి ఓట్లు ఎటువైపు పడతాయనే అంశంపై పార్టీల విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. గతంలో ఈఈ ప్రాంతాల్లో ముస్లిం, జాట్‌, దళిత ఓటర్ల కూటమి ఫార్ములా విజయవంతం అయింది. అందుకే ఈసారి సమాజ్ వాదీ పార్టీ ఆర్‌ఎల్‌డీ, మహాన్‌ దళ్‌తో పొత్తు పెట్టుకుంది. ఈ కారణంగా జాట్‌ ఓట్లపై ఆర్‌ఎల్‌డీ ఆధిపత్యం సాధించే అవకాశం ఉంది. బదాయూ, సంభల్‌ జిల్లాల్లో ములాయం సింగ్‌ యాదవ్‌ కుటుంబ ప్రభావం ఎక్కువగా ఉండే సంగతి తెలిసిందే. అక్కడ ఎస్పీకే బలమెక్కువ.

నేడు ఉత్తరాఖండ్‌లోనూ...
ఉత్తరాఖండ్​లోనూ నేడు ఎన్నికలు ప్రారంభం అయ్యాయి. 13 జిల్లాల్లోని 70 నియోజకవర్గాలకు అన్నీ ఒకే దశలో సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో 82,38,187లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా 632 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. ఈ అభ్యర్థుల్లో 152 మంది స్వతంత్రులు ఉన్నారు. కరోనా కారణంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. తొలిసారిగా మహిళల కోసం రాష్ట్రవ్యాప్తంగా 101 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగుల కోసం 6 పోలింగ్ బూత్​లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

గోవాలోనూ ఒకేదశలో
గోవాలోని 40 అసెంబ్లీ స్థానాలకు నేడు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి గోవా అసెంబ్లీ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన మొత్తం 301 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు శివసేన కూటమి ఎన్నికల్లో తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కూడా గతంలో తన తండ్రి స్థానం పనాజీ అసెంబ్లీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అక్కడి టికెట్ బీజేపీ ఇవ్వకపోవడంతో పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

18:29 PM (IST)  •  14 Feb 2022

గోవాలో 75 శాతం

దేశంలో ఈరోజు మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు గోవాలో 75 శాతం, ఉత్తరాఖండ్‌లో 59 శాతం పోలింగ్ నమోదైంది. యూపీ రెండో విడత పోలింగ్‌లో 60 శాతం ఓటింగ్ నమోదైంది.

14:08 PM (IST)  •  14 Feb 2022

1 గంట వరకు

గోవా, ఉత్తరాఖండ్‌లో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు గోవాలో 44 శాతం, ఉత్తరాఖండ్‌లో 35 శాతం పోలింగ్ నమోదైంది. మరోవైపు యూపీలో జరుగుతోన్న రెండో విడత పోలింగ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు 40 శాతం ఓటింగ్ నమోదైంది.

Load More
New Update
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Sukhbir Singh Badal News: నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
నాందేడ్‌లో సుఖ్బీర్ సింగ్ బాదల్‌పై కత్తితో దాడి!  
Digital India: డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
డిజిటల్ ఇండియా మీ జీవితాన్ని ఎలా మార్చింది?
Parliament Monsoon Session: లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!
లోక్‌సభ నిరవధికంగా వాయిదా!సమావేశాల చివరి రోజున అమిత్ షా రాక!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget