By: ABP Desam | Updated at : 04 May 2022 05:12 PM (IST)
Edited By: Murali Krishna
ఐదేళ్ల తర్వాత తల్లిని కలిసి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
UP CM Yogi:
ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఐదేళ్ల విరామం తర్వాత తన తల్లిని కలిశారు. ఉత్తరాఖండ్లో మూడు రోజుల పర్యటనలో యోగి ఉన్నారు. ఈ సందర్భంగా పౌరి గర్హ్వాల్ జిల్లాలోని తన సొంతూరు పంచూరుకు యోగి వెళ్లారు.
Uttar Pradesh CM Yogi Adityanath met his mother at his village Panchur, in Pauri Garhwal District of Uttarakhand earlier today.
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 3, 2022
(Pic: UP CM's Twitter account) pic.twitter.com/57P5mdxfgd
తన తల్లి సావిత్రి దేవితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. తన తల్లి కాళ్లకు యోగి నమస్కరించారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. యోగి తన సొంతూరును 2017 ఫిబ్రవరిలో చివరిసారిగా సందర్శించారు.
భారీ విజయం
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా భారీ విజయాన్ని సాధించింది. వరుసగా రెండోసారి యూపీలో సర్కార్ను ఏర్పాటు చేసింది.
403 అసెంబ్లీ స్థానాల్లో 255 సీట్లు గెలుచుకుంది భాజపా. తన మిత్రపక్షం అప్నాదళ్ (ఎస్)కు 12 స్థానాలు దక్కాయి. మరో మిత్రపక్షం నిషాద్ పార్టీ 6 చోట్ల గెలుపొందింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షంగా నిలిచిన సమాజ్వాదీ పార్టీకి 111 సీట్లు దక్కాయి.
భాజపా దెబ్బకు కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీలు కొట్టుకుపోయాయి. యూపీ చరిత్రలో ఎన్నడూలేనంత తక్కువ సీట్లు సాధించాయి. కాంగ్రెస్ రెండంటే రెండు సీట్లలో గెలుపొందితే, బీఎస్పీ ఒకే ఒక్క స్థానంలో గెలిచింది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 7 సీట్లు, బీఎస్సీ 19 సీట్లు పొందాయి. సీట్లు పెరగకపోగా దారుణంగా తగ్గడం ఆ పార్టీల శ్రేణులను నిరాశ పరుస్తోంది.
Also Read: LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ షురూ- మరి దరఖాస్తు చేసుకున్నారా?
EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
Top 10 Headlines Today: పోలవరం టూర్కు జగన్, నాగర్ కర్నూల్లో కేసీఆర్ పర్యటన, తిరుపతిలో ఆదిపురుష్ వేడుక
Top 10 Headlines Today: ఏపీకి గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం, ఒడిశా ప్రమాద బాధితులపై మమత
Gold-Silver Price Today 06 June 2023: ఎటూ మొగ్గని పసిడి - ఇవాళ బంగారం, వెండి ధరలు
దేశంలోనే టాప్ విద్యాసంస్థగా ఐఐటీ మద్రాస్, యూనివర్సిటీల్లో 10వ స్థానంలో హెచ్సీయూ!
పోలవరం ప్రాజెక్టుకు రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
డ్వాక్రా మహిళల్ని మోసం చేసిన ఘనుడు సీఎం జగన్, చార్జ్ షీట్ రిలీజ్ చేసిన తెలుగు మహిళలు
Prabhas - Tirumala Darshan : ఉదయమే ఏడు కొండల వేంకటేశ్వరుని దర్శించుకున్న ప్రభాస్