అన్వేషించండి

Suicide Attack: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడి! ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి - ముగ్గురు సైనికుల వీరమరణం

రాజౌరీకి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న సైనిక శిబిరంపై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఇద్దరు టెర్రరిస్టులు ఆత్మాహుతికి పాల్పడినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది.

Jammu Kashmir Terrorist Attack: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి బరితెగించారు. ఓ సైనిక శిబిరంపై ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో ముగ్గురు భారత సైనికులు అక్కడికక్కడే వీర మరణం పొందారు. రాజౌరీకి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ ఆపరేటింగ్ బేస్‌పై ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఇద్దరు టెర్రరిస్టులు ఆత్మాహుతికి పాల్పడినట్లుగా ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. మరో నాలుగు రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం ఉన్న వేళ ఈ ఘటన జరగడం చర్చనీయాంశం అయింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రాజౌరిలో ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం హతమార్చింది. అంతకుముందు, రాజౌరీలో 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ కంపెనీ ఆపరేటింగ్ బేస్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు, దీనికి భారత సైన్యం తీవ్రంగా ప్రతిఘటించి ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఉగ్రవాదులపై ఈ ఆపరేషన్ పూర్తయిందని భారత సైన్యం ప్రకటించింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యానికి చెందిన ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా, ఐదుగురు జవాన్లు గాయపడినట్లు సమాచారం. సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది.

రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంపులోకి ఎవరో ప్రవేశించేందుకు ప్రయత్నించారని, ఇరువైపుల నుంచి కాల్పులు జరిగాయని, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని గతంలో జమ్మూ ఏడీజీపీ తెలియజేశారు. ఉగ్రదాడిలో గాయపడిన సైనికుల్లో ఒకరిని చికిత్స నిమిత్తం తరలించినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఒకరోజు ముందుగానే బుద్గామ్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. రాహుల్‌ భట్‌, అమ్రీన్‌ భట్‌ హత్యల్లో ఒక ఉగ్రవాది ప్రమేయం ఉన్నట్లు తెలిసింది.

ఉరి దాడిని గుర్తు చేసేలా
ఈ రోజు (ఆగస్టు 11) రాజౌరిలో జరిగిన ఉగ్రదాడి ఉరీ దాడిని గుర్తుచేసేలా ఉంది. 18 సెప్టెంబర్ 2016న, జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులు తెల్లవారుజామున జమ్మూ కాశ్మీర్‌లోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ సమీపంలోని భారత సైన్యం యొక్క స్థానిక ప్రధాన కార్యాలయంలోకి చొరబడి, శిబిరంలో నిద్రిస్తున్న భారత సైనికులపై దాడి చేశారు. నిద్రిస్తున్న భారత సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 17 హ్యాండ్ గ్రెనేడ్లను కూడా ప్రయోగించారు. ఈ ఉగ్రదాడిలో 16 మంది భారత జవాన్లు వీరమరణం పొందారు. ఆరు గంటల పాటు జరిగిన ఎన్‌ కౌంటర్‌లో భారత ఆర్మీ జవాన్లు నలుగురు జైష్-ఏ-మహ్మద్ ఉగ్రవాదులను హతమార్చారు. 10 రోజుల తర్వాత భారత సైన్యం పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోకి ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Medaram Jatara Kumkum Bharani Speciality | కుంకుమ భరిణెలను ఎందుకు కొలుస్తారు?
Bamboo Sticks are Idols in Medaram Jatara | వెదురు కర్రలే ఉత్సవ మూర్తులుగా ఎందుకు ?
Vaibhav Suryavanshi broke Virat Record | కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన వైభవ్
India vs Bangladesh Under-19 World Cup | బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన టీమిండియా
Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసు.. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు
Ilayaraja : ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
ఇళయరాజాకు ప్రతిష్టాత్మక 'పద్మపాణి' అవార్డు - మ్యూజిక్ మ్యాస్ట్రోను వరించిన అవార్డులివే!
PM Modi: గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
గాజా శాంతి బోర్డులో చేరాలని భారత్‌కు ఆహ్వానం.. మోదీ పేరు ట్రంప్ ఎందుకు సూచించారు
Revanth Reddy In Medaram: మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
మేడారంలో పైలాన్ ఆవిష్కరించి, గద్దెలను పునః ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
Bandla Ganesh : బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
బండ్ల గణేష్ సంకల్ప యాత్ర ప్రారంభం - హైదరాబాద్ To తిరుమల వెంకటేశుని సన్నిధి వరకూ...
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
ఫుల్ ట్యాంక్‌తో 800 KM రేంజ్ ఇస్తున్న TVS Star City Plus.. అత్యంత చవకైన డిస్క్ బ్రేక్ బైక్
Chandrababu In Davos: దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
దావోస్‌ పర్యటనకు చంద్రబాబు.. నేడు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్న ఏపీ సీఎం
Ind vs nz 3rd odi: మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
మూడో వన్డేలో టీమిండియా ఓటమికి 5 కారణాలు- సిరీస్ మొత్తం ఫెయిల్ అయిన రోహిత్ శర్మ
Embed widget