News
News
వీడియోలు ఆటలు
X

Sweeper Bank Notice: రూ. 16 కోట్లు చెల్లించాలంటూ స్వీపర్ కు నోటీసు, ఆస్తులు జప్తు చేయాలా అంటూ షాకిచ్చిన బ్యాంక్!

Sweeper Bank Notice: గుజరాత్ కు చెందిన ఓ స్వీపర్ కు బ్యాంకు నోటీసులు పంపింది. రూ. 16 కోట్ల రుణం చెల్లించాలని లేకపోతే ఆస్తులు జప్తు చేస్తామని పేర్కొంది.

FOLLOW US: 
Share:

Sweeper Bank Notice: సాధారణ జీవనం గడిపే ఓ స్వీపర్ కు బ్యాంకు భారీ షాక్ ఇచ్చింది. వెయ్యి, రెండు వేలు కాదు ఏకంగా రూ. 16 కోట్ల రుణం చెల్లించాలని నోటీసులు పంపింది. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో జరిగింది. ఇక్కడ ట్విస్టు ఏంటంటే.. ఆ నోటీసులు అందుకున్న వ్యక్తికి ఆ బ్యాంకులో కనీసం అకౌంట్ కూడా లేకపోవడం. అదేంటి అనుకుంటున్నారా.. బ్యాంక్ సిబ్బంది తప్పిదం అలా ఉంటుంది మరి. రూ.16 కోట్ల రుణం చెల్లించాలని పంపిన ఆ నోటీసుతో ఆ స్వీపర్ కుటుంబం అవాక్కయింది. అతని భార్య భయంతో అనారోగ్యానికి గురైంది. ఆసుపత్రిలో చేరాల్సిన పరిస్థితి వచ్చింది. గుజరాత్ లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

16 కోట్లను తిరిగి చెల్లించాలని నోటీసులు

గుజరాత్ రాష్ట్రం వడోదర నగరానికి చెందిన శాంతిలాల్ అనే వ్యక్తి తన భార్య జాషిబెన్ తో కలిసి రాజ్యలక్ష్మి సొసైటీలో నివాసం ఉంటున్నాడు. ఉత్తర ప్రదేశ్ కు చెందిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాంతిలాల్ కు ఈ నోటీసు పంపింది. రూ. 16 కోట్లను మార్చి 4వ తేదీ లోపు తిరిగి చెల్లించాలని నోటీసులు పంపించారు పంజాబ్ నేషనల్ బ్యాంకు అధికారులు. లోన్ చెల్లించకపోతే చట్టప్రకారం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని అందులో పేర్కొన్నారు అధికారులు. బ్యాంకు నోటీసులు అందుకున్న శాంతిలాల్ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది. శాంతిలాల్ భార్య జాషిబెన్ అయితే సొమ్మసిల్లి పడిపోయింది. అనారోగ్యానికి గురైన ఆమెను స్థానిక ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.

నోటీసులు ఎందుకు వచ్చాయో కూడా వారికి తెలీదు..!

బ్యాంకు నుండి తమకు అందిన నోటీసు గురించి తెలుసుకునేందుకు శాంతిలాల్ కుటుంబం వడోదర నగర కార్యాలయానికి వెళ్లారు. వారికి ఎందుకలా నోటీసులు వచ్చాయోనని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ అధికారులు ఏ విషయాన్నీ సరిగ్గా చెప్పలేదు. వారికి ఎందుకు నోటీసులు పంపించిన విషయాన్ని వారికి చెప్పకుండా వారిపై కసురుకున్నారు. అసలు వారికెందుకు నోటీసులు వచ్చాయోనన్న విషయం శాంతిలాల్ కుటుంబానికి సరిగ్గా తెలీదు. అసలు ఎందుకు వచ్చాయో తెలుసుకునేందుకు పలువురు బ్యాంక్ అధికారులను కలిశారు. చివరకు చేసేదేం లేక శాంతిలాల్ స్థానిక ఎమ్మెల్యే నీరజ్ చోప్రాను ఆశ్రయించాడు. ఎమ్మెల్యే నీరజ్ చోప్రా బాధితుల తరఫున జిల్లా అధికారులకు వినతి పత్రాన్ని అందించి మరీ వారికి న్యాయం చేయాలని అధికారులను కోరారు.

వారి ఆస్తులే 5 నుంచి 10 లక్షలు ఉంటాయిని ఎమ్మెల్యే

శాంతిలాల్ స్వీపర్ గా పని చేస్తున్నాడని, వారి మొత్తం ఆస్తులే రూ. 5 నుండి రూ. 10 లక్షలు ఉంటుందని ఎమ్మెల్యే నీరజ్ చోప్రా అన్నారు. అలాంటి వారు రూ. 16 కోట్లు ఎలా అప్పు చేశారని బ్యాంకు అధికారులను ప్రశ్నించారు. ఇదొక తప్పుడు నోటీసని అన్నారు. దీని వల్ల శాంతిలాల్ కుటుంబం ఆస్పత్రి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసుపై విచారణ జరిపించాలని అధికారులను ఎమ్మెల్యే నీరజ్ చోప్రా డిమాండ్ చేశారు. ఎలాగైనా సరే వారికి త్వరగా న్యాయం చేస్తే బాగుంటుందని వివరించారు. 

Published at : 23 Apr 2023 08:18 PM (IST) Tags: Gujarat Sweeper Notices to Sweeper Bank Notices Sweeper Family

సంబంధిత కథనాలు

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

EMRS Teacher Jobs: ఏకలవ్య పాఠశాలల్లో 38 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌, వివరాలు ఇలా!

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Mukhtar Ansari Life Imprisonment: అవదేష్ రాయ్ హత్య కేసులో బీఎస్పీ నేత ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు, జరిమానా 

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

Odisha Train Accident: రైలు ప్రమాదానికి మతం రంగు పులిమితే కఠిన చర్యలు, ఒడిశా పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్

సెంగోల్‌ ఆలోచనలో పడి సిగ్నల్‌ మర్చిపోయారు, ఒడిశా ప్రమాదంపై డీఎమ్‌కే నేత వివాదాస్పద ట్వీట్

సెంగోల్‌ ఆలోచనలో పడి సిగ్నల్‌ మర్చిపోయారు, ఒడిశా ప్రమాదంపై డీఎమ్‌కే నేత వివాదాస్పద ట్వీట్

టాప్ స్టోరీస్

Amit Shah Vizag Tour: కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా, అయినా బీజేపీ అగ్రనేతల వరుస సభలు

Amit Shah Vizag Tour: కేంద్ర మంత్రి అమిత్ షా విశాఖ పర్యటన వాయిదా, అయినా బీజేపీ అగ్రనేతల వరుస సభలు

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

KTR IT Report: హైదరాబాద్‌లో 1.83 లక్షల కోట్లకు ఐటీ ఎగుమతులు - వార్షిక ఐటీ నివేదిక విడుదల

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!

Citroen 2CV: కారు చేసింది చెక్కతో - రేటు మాత్రం చుక్కల్లో - ఏకంగా రూ.1.85 కోట్లతో రికార్డు!