అన్వేషించండి

ప్రజాస్వామ్యం అంటే పట్టింపులేదు- ఓబీసీలు అంటే గౌరవం లేదు- రాహుల్‌పై మంత్రి స్మృతి ఇరానీ ఆగ్రహం

కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యం గురించి పట్టింపు లేదని, ఓబీసీ సమాజంపై గౌరవం లేదని స్మృతి ఇరానీ విమర్శించారు. రాహుల్ టార్గెట్ మోడీ మాత్రమేనని, మోదీ లక్ష్యం దేశ అభివృద్ధే అన్నారు.

రాహుల్‌ గాంధీని పార్లమెంట్‌ నుంచి వేటు వేయడంపై విపక్షాలు  ఏకమయ్యాయి. రాహుల్‌పై చర్యల విషయాన్ని తప్పుబడుతూనే అదాని, మోదీ సంబంధాలపై నిలదీస్తున్నారు. బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. దీన్ని ఎప్పటికప్పుడు తిప్పుకొడుతోంది బీజేపీ. నేతలు ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు. కాంగ్రెస్, ఇతర విపక్షాల తీరుపై మండిపడుతున్నారు. 

కాంగ్రెస్ పార్టీపై, రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్ర విమర్శలోత విరుచుకుపడుతోంది. ఈ రోజు (మార్చి 28) ఉదయం విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ... ప్రధాని మోడీని అవమానించడం ద్వారా ఒబిసి సమాజాన్ని రాహుల్ గాంధీ అవమానిస్తున్నారని అన్నారు. మీరు నన్ను ఎంత కావాలంటే అంత అవమానించాలి కానీ దేశాన్ని కించపరచకండి అని ప్రధాని ఎప్పుడూ చెబుతుంటారు. కానీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ మాత్రం దేశాన్ని అవమానిస్తున్నారన్నారు. 

రాజకీయ రణరంగంలో మోదీపై రాహుల్ గాంధీ చిమ్మిన విషం దేశానికి అప్రతిష్టగా మారిందని స్మృతి ఇరానీ విమర్శించారు. ప్రధాని మోదీని అవమానిస్తున్నామన్న భ్రమలో మొత్తం ఓబీసీ సమాజాన్ని అవమానించడం సముచితమా అని ఆమె ప్రశ్నించారు. మోదీ ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు రాహుల్ గాంధీ విదేశాల్లో అబద్ధాలు చెప్పారన్నారు. దేశంలో అబద్ధాలు చెప్పి... పార్లమెంటులో అబద్ధాలు చెప్పారని విమర్శించారు. సుప్రీం కోర్టు ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పిన వ్యక్తి పిరికివాడు కానట్టు నటిస్తున్నాడన్నారు. 

ఓ పత్రికకు రాహుల్‌ గాంధీ ఇచ్చిన ఇంటర్వ్యూను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ప్రస్తావించారు. ప్రధాని నరేంద్ర మోడీ బలం తన ఇమేజ్ అని 4 మే 2019 న ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేప్పారన్నారు. ఆ ఇమేజ్‌ను నాశనం చేసే వరకు ప్రధాని మోడీ ఇమేజ్‌పై దాడి చేస్తూనే ఉంటానని రాహుల్ గాంధీ ప్రతిజ్ఞ చేశారన్నారు. గాంధీ కుటుంబం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని మోదీ ప్రతిష్టను దిగజార్చిందన్నారు.

నరేంద్ర మోడీపై దాడి జరగడం ఇదే మొదటిసారి కాదని స్మృతి ఇరానీ అన్నారు. పార్లమెంటులో ఆయన ఈ వ్యాఖ్య చేసినప్పుడు వాటిని రుజువు చేయాలంటే పారిపోయారన్నారు. రుజువు చేయలేకపోయారన్నారు. ఇటీవల భారత యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ స్మృతి ఇరానీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్మృతి ఇరానీ మంత్రగత్తెలా మారిందని కామెంట్ చేశారు. వీటిపై కూడా స్క్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్త చేశారు. కాంగ్రెస్ లో ప్రమోషన్ కోరుకునే వారు తనపై ఇలాంటి భాషలో మాట్లాడటం కొత్త కాదన్నారు. ఇదే మొదటి సారి కూడా కాదన్నారు. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
గుడ్ న్యూస్.. హర్మూజ్ జలసంధిని దాటిన 2 భారత నౌకలు, గుజరాత్ ఎప్పుడు చేరుకుంటాయి ?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
Sonam Wangchuk: సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
సోనమ్‌వాంగ్ చుక్‌కు కేంద్రం గుడ్ న్యూస్ - నిర్బంధం ఎత్తివేయాలని నిర్ణయం
Raghav Chadha On Menstrual Health: మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!
మందు, సిగరెట్‌కు లేని సిగ్గు శానిటరీ ప్యాడ్స్‌కు ఎందుకు? పార్లమెంట్‌లో గళమెత్తిన రాఘవ్‌ చద్దా!

వీడియోలు

Pawan Kalyan Paderu Tour | పాడేరులో పర్యటించి గిరిజనులతో గడిపిన పవన్ కళ్యాణ్ | ABP Desam
Yuvraj Singh Mentoring Rishabh Pant | స్పైడీ రిషభ్ పంత్ కు అండగా యువరాజ్ సింగ్ | ABP Desam
RCB Acquisition Race | కోహ్లీ కోసం 17వేల కోట్లు పెట్టడానికైనా ఆ సంస్థ సిద్ధం | ABP Desam
Salman Agha Run out Controversy | బాల్ ఇద్దామనుకున్నాడు..రనౌట్ అయిపోయాడు | ABP Desam
MS Dhoni Crafting Bat | ధోని క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదుగా | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా.. వాస్తవాలను వెల్లడించిన హైదరాబాద్ పోలీస్ శాఖ
Jeevan Reddy To joins BRS: బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
బీఆర్ఎస్‌లో చేరే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేత - ఫిరాయింపు ఎమ్మెల్యేతో పొసగకపోవడం వల్లే!
Deputy CM Pawan Kalyan: గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
గిరిపుత్రుల గడపకు ఉప ముఖ్యమంత్రి - అల్లూరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ‘మాటా-మంతి’
Fake Ranker: సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
సివిల్స్‌లో ర్యాంక్ వచ్చిందని పోలీసులు, రాజకీయ నేతలతో సన్మానాలు చేయించుకున్నాడు - నిజం తెలిసే సరికి జంప్!
IntrCity SmartBus: భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
భారత్‌లో తొలి AQI ఇంటర్‌సిటీ బస్సు సర్వీస్ విజయవాడలో ప్రారంభించిన ఇంట్రసిటీ స్మార్ట్‌బస్
Dhanush : శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
శంకర్ 'వేల్పారి'లో ధనుష్ ఫిక్స్! - వరుస ప్రాజెక్టులు... అంత రిస్క్ చేస్తారా?
Indian Ships Stuck In Hormuz: హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
హర్మూజ్ జలసంధిలో ఎన్ని భారత ఓడలు చిక్కుకున్నాయి, వాటిలో ఏమేం ఉన్నాయి?
BCCI Naman Awards: శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
శుభ్‌మన్ గిల్‌కు అత్యున్నత పురస్కారం ప్రకటించిన BCCI.. స్మృతీ మంధానా ఏకంగా 5వసారి
Embed widget