అన్వేషించండి

Sedition Law: దేశద్రోహ చట్టం చాలా ముఖ్యం, దానివల్లే దేశానికి భద్రత - లా ప్యానెల్ చీఫ్

కశ్మీర్ నుంచి కేరళ వరకూ, పంజాబ్ ఈశాన్య రాష్ట్రాల వరకూ "భారత భద్రత, సమగ్రతను" కాపాడటానికి దేశద్రోహ చట్టం అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు.

వలసరాజ్యాల కాలం నాటి దేశద్రోహ చట్టాన్ని రద్దు చేయాలనే డిమాండ్ ల మధ్య, లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రీతు రాజ్ అవస్తీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అనేక ప్రాంతాలలో కశ్మీర్ నుంచి కేరళ వరకూ, పంజాబ్ ఈశాన్య రాష్ట్రాల వరకూ "భారత భద్రత, సమగ్రతను" కాపాడటానికి దేశద్రోహ చట్టం అనేది చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. గత ఏడాది మేలో జారీ చేసిన సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. ప్రస్తుతం ఉపసంహరణలో ఉన్న చట్టాన్ని నిలుపుదల చేయాలనే ప్యానెల్ సిఫార్సును సమర్థించారు. దాని దుర్వినియోగాన్ని నిరోధించడానికి తగిన మార్గదర్శకాలను ప్రతిపాదించామని పీటీఐ వార్తా సంస్థకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు.

చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, జాతీయ భద్రతా చట్టం లాంటి ప్రత్యేక చట్టాలు రెండు వేర్వేరు పనులకు ఉపయోగిస్తున్నారని అన్నారు. కానీ, దేశద్రోహ నేరాలకు ఈ రెండు చట్టాలకు సంబంధం లేదని అన్నారు. అందుకే దేశ ద్రోహంపై నిర్దిష్ట చట్టం కూడా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

దేశద్రోహ చట్టం ఉపయోగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ‘‘కశ్మీర్ నుంచి కేరళ - పంజాబ్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు ఉన్న ప్రస్తుత పరిస్థితి భారతదేశ ఐక్యత, సమగ్రతను కాపాడటానికి ఈ చట్టం అవసరం’’ అని న్యాయమూర్తి అవస్థి చెప్పారు. దేశద్రోహ చట్టం అనేది వలసరాజ్యాల నాటి తరహాలో ఉండడం వల్ల దాని రద్దు చేస్తున్నామని చెప్పడం సరైన కారణం కాదని అన్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీతో సహా అనేక దేశాలు తమ సొంత చట్టాలను కలిగి ఉన్నాయని కూడా ఆయన అన్నారు.

దేశద్రోహ చట్టానికి సంబంధించి ఇండియన్ పీనల్ కోడ్ లోని 124ఏ సెక్షన్‌ను పునరుద్ధరించాల్సిందేనని 22వ లా కమిషన్  ఇటీవల కేంద్రానికి ఇచ్చిన రిపోర్టులో స్పష్టం చేసింది. అయితే కొన్ని సవరణలు చేయడంద్వారా ఈ సెక్షన్‌పై మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉందని అభిప్రాయపడింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రాం మేఘ్‌వాల్‌కు 22వ లా కమిషన్‌ ఛైర్మన్‌ జస్టిస్‌ రితు రాజ్‌ అవస్థి నేతృత్వంలోని కమిటీ ఓ నివేదిక సమర్పించింది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Bobbili Maharaja Vintage Cars and Weapons | ఇలాంటి పాత, ఖరీదైన కార్లు మీకు ఎక్కడా కనిపించవు.! | ABPSingirikona Narasimha Swamy Temple | సింగిరికోన అడవిలో మహిమాన్విత నారసింహుడి ఆలయం చూశారా.! | ABP80 Years Old Man Completes 21 PGs | చదువు మీద ఈ పెద్దాయనకున్న గౌరవం చూస్తుంటే ముచ్చటేస్తుందిCM Chandrababu CM Revanth Reddy Meeting | అందరి కళ్లూ... తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపైనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Group 1 Results: గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
గ్రూప్ 1 ప్రిలిమినరీ రిజల్ట్ విడుదల - ఇలా చెక్ చేసుకోండి
Jon Landau Death: ‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
‘టైటానిక్‘, ‘అవతార్‘ చిత్రాల నిర్మాత జాన్ మృతి - హాలీవుడ్‌లో ఘోర విషాదం
The Cave Pub Case: కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
కేవ్ పబ్‌లో వీకెండ్ డ్రగ్స్ పార్టీ, లిమిట్‌ దాటి డీజే సౌండ్ - మణికొండ పబ్ కేసులో కీలక వివరాలు
Free Sand Scheme: ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఇకపై ఇసుక ఫ్రీ, ఈ విషయాలు తెలుసా!
Gudivada News: బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!
Hyderabad: మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
మణికొండలోని ది కేవ్ పబ్‌పై దాడి, డ్రగ్స్ టెస్టుల్లో 24 మందికి పాజిటివ్
Andhra Pradesh: ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
ఏపీలో స్కూల్ విద్యార్థుల బ్యాగుల్లో గంజాయి, తెలంగాణతో కలిసి డ్రగ్స్‌పై యుద్ధం - అనగాని సత్యప్రసాద్
Weather Latest Update: ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
ఏపీ తీరం వద్ద ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో నేడు భారీ వర్షాలు - ఐఎండీ
Embed widget