అన్వేషించండి

Jaishankar: ‘భారత్-చైనా’ మధ్యలో మూడో దేశం అక్కర్లేదు: జైశంకర్ కీలక వ్యాఖ్యలు

India China conflict : భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు దేశాల సమస్యల పరిష్కారంలో మూడో దేశం ప్రమేయం అవసరం లేదన్నారు.

Union Minister Jaishankar: భారత్- చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2020లో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనా ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఇది ఘర్షణకు దారితీసింది.  రెండు వైపుల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు సమస్యపై మూడో దేశం జోక్యం అక్కర్లేదని స్పష్టం చేశారు.  చైనాతో మాకు సమస్య ఉందని, దానికి మేమిద్దరం పరిష్కారం కనుగొనాలని అన్నారు.

భారత్, చైనా మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించడానికి ఇతర దేశాల వైపు తాము చూడడం లేదన్నారు. పొరుగు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు ఇరువురు పరిష్కారం చూపాల్సి ఉందని ఆయన సోమవారం అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో విలేకరుల సమావేశంలో జైశంకర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్‌, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించేందుకు ఇతర దేశాల వైపు చూడటం లేదు. చైనాతో భారత్ సంబంధాలు బాగా లేవని కూడా అన్నారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లారు. 

మేం చూసుకుంటాం
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, 'భారత్  చైనాల మధ్య సమస్య ఉంది.  ఇది మా దేశాల మధ్య నెలకొన్న వివాదం. దాని గురించి ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కొనుగొనడం మా ఇద్దరి బాధ్యత.  సహజంగానే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ విషయంలో ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే భారత్, చైనా రెండూ పెద్ద దేశాలు. మన సంబంధాల స్థితి మిగిలిన ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. కానీ, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతర దేశాల వైపు చూడడం లేదు. ఇందులో మూడో దేశం ప్రమేయం అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో రెండుసార్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాను జరిపిన సమావేశాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.  

తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభనపై చర్చ
జైశంకర్,  వాంగ్ యీ గత వారం లావో రాజధానిలో కలుసుకున్నారు. అక్కడ వారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మే 2020లో తూర్పు లడఖ్‌లో సైనిక బలగాలను ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ప్రతిష్టంభనను తొలగించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. సరిహద్దులో శాంతిని తిరిగి తీసుకురావాలని కోరారు. జూలై 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ సందర్భంగా జైశంకర్,  వాంగ్ కజకిస్థాన్ రాజధాని అస్తానాలో కలుసుకున్నారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. దశాబ్దాల కాలంలో సరిహద్దులో ఇలాంటి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాలు ఇప్పటివరకు 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Annamalai Real Name: అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ
అన్నామలైకు రజనీకాంత్ భాషాకు ఉన్నంత ఫ్లాష్ బ్యాక్ ఉంది - ఆయన అసలు పేరు శివ సెంథిల్ కుమార్ - ఇదిగో ఫుల్ స్టోరీ
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Trinamool Congress Crisis 2026: మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
మమతా బెనర్జీ వర్గంలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలే - దీదీ రాజకీయం ముగిసిపోయినట్లేనా?
Lingamaneni Ramesh Rajya Sabha: రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
రాష్ట్రం కోసం పార్లమెంట్‌లో గళం విప్పుతా - జనసేన రాజ్యసభ అభ్యర్థి లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు
Sai Durgha Tej : సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
సుప్రీం హీరో నెక్స్ట్ మూవీ - అహోబిలం ఆలయ ఉత్సవంతో లింక్... క్రేజీ టైటిల్ ఫిక్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
Embed widget