అన్వేషించండి

Jaishankar: ‘భారత్-చైనా’ మధ్యలో మూడో దేశం అక్కర్లేదు: జైశంకర్ కీలక వ్యాఖ్యలు

India China conflict : భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు దేశాల సమస్యల పరిష్కారంలో మూడో దేశం ప్రమేయం అవసరం లేదన్నారు.

Union Minister Jaishankar: భారత్- చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2020లో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనా ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఇది ఘర్షణకు దారితీసింది.  రెండు వైపుల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు సమస్యపై మూడో దేశం జోక్యం అక్కర్లేదని స్పష్టం చేశారు.  చైనాతో మాకు సమస్య ఉందని, దానికి మేమిద్దరం పరిష్కారం కనుగొనాలని అన్నారు.

భారత్, చైనా మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించడానికి ఇతర దేశాల వైపు తాము చూడడం లేదన్నారు. పొరుగు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు ఇరువురు పరిష్కారం చూపాల్సి ఉందని ఆయన సోమవారం అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో విలేకరుల సమావేశంలో జైశంకర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్‌, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించేందుకు ఇతర దేశాల వైపు చూడటం లేదు. చైనాతో భారత్ సంబంధాలు బాగా లేవని కూడా అన్నారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లారు. 

మేం చూసుకుంటాం
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, 'భారత్  చైనాల మధ్య సమస్య ఉంది.  ఇది మా దేశాల మధ్య నెలకొన్న వివాదం. దాని గురించి ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కొనుగొనడం మా ఇద్దరి బాధ్యత.  సహజంగానే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ విషయంలో ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే భారత్, చైనా రెండూ పెద్ద దేశాలు. మన సంబంధాల స్థితి మిగిలిన ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. కానీ, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతర దేశాల వైపు చూడడం లేదు. ఇందులో మూడో దేశం ప్రమేయం అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో రెండుసార్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాను జరిపిన సమావేశాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.  

తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభనపై చర్చ
జైశంకర్,  వాంగ్ యీ గత వారం లావో రాజధానిలో కలుసుకున్నారు. అక్కడ వారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మే 2020లో తూర్పు లడఖ్‌లో సైనిక బలగాలను ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ప్రతిష్టంభనను తొలగించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. సరిహద్దులో శాంతిని తిరిగి తీసుకురావాలని కోరారు. జూలై 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ సందర్భంగా జైశంకర్,  వాంగ్ కజకిస్థాన్ రాజధాని అస్తానాలో కలుసుకున్నారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. దశాబ్దాల కాలంలో సరిహద్దులో ఇలాంటి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాలు ఇప్పటివరకు 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు

వీడియోలు

Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Antarvedi Thar Tragedy | అంతర్వేది బీచ్‌లో సముద్రంలోకి కొట్టుకుపోయిన థార్.. ఒకరి మృతి | ABP Desam
Rohin Uttappa about Rohit Virat Retirement | రో - కో టెస్ట్ రిటైర్మెంట్ పై మాజీ ప్లేయర్ వ్యాఖ్యలు
Sarfaraz Khan in Vijay Hazare Trophy | రోహిత్ రికార్డు బద్దలు కొట్టిన సర్ఫరాజ్
Devdutt Padikkal Vijay Hazare Trophy | సూపర్ ఫామ్‌లో దేవ్‌దత్ పడిక్కల్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
అక్కడైతే కేసీఆర్, హరీష్‌లను రాళ్లతో కొట్టి చంపేవాళ్లు - జలవివాదంపై సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు
Vande Bharat Sleeper Train: రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
రైల్వే శాఖ నూతన సంవత్సర కానుక! ఈ మార్గంలో తొలి వందే భారత్ స్లీపర్ పరుగులు! టికెట్‌ ఎంతో తెలుసా?
Bullet train: బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
బుల్లెట్ ట్రైన్ ఓపెనింగ్ డేట్ ఖరారు - ఆ రోజున టిక్కెట్ బుక్ చేసుకుంటారా?
Jogi Ramesh: కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
కల్తీ లిక్కర్ స్కాంలో నిండా మునిగిన జోగి రమేష్ - సిట్ చార్జిషీట్‌లో సంచలన విషయాలు
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Record Liquor Sales | మద్యం అమ్మకాల్లో తెలంగాణ ఆల్ టైం రికార్డ్ | ABP Desam
Bangladesh Violence : బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
బంగ్లాదేశ్‌లో మరో హిందువును సజీవ దహనం చేసే ప్రయత్నం! ముందు కత్తితో పొడిచి ఆపై పెట్రోల్ పోసి నిప్పు!
Fact Check: భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
భార్య అనుమతి లేకుండా మద్యం తాగితే జైలుకు వెళ్లాల్సి వస్తుందా? చట్టం ఏం చెబుతోంది ?
Big EPFO Update: ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
ATM నుంచి PF డబ్బులు తీసుకునే వెసులుబాటు ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? ఎంత పరిమితి ఉంటుంది?
Embed widget