అన్వేషించండి

Jaishankar: ‘భారత్-చైనా’ మధ్యలో మూడో దేశం అక్కర్లేదు: జైశంకర్ కీలక వ్యాఖ్యలు

India China conflict : భారత్-చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు దేశాల సమస్యల పరిష్కారంలో మూడో దేశం ప్రమేయం అవసరం లేదన్నారు.

Union Minister Jaishankar: భారత్- చైనా దేశాల మధ్య సంబంధాలు బాగోలేవని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. 2020లో సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించడం ద్వారా చైనా ఒప్పందాలను ఉల్లంఘించడమే ఇందుకు కారణం. ఇది ఘర్షణకు దారితీసింది.  రెండు వైపుల సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దు సమస్యపై మూడో దేశం జోక్యం అక్కర్లేదని స్పష్టం చేశారు.  చైనాతో మాకు సమస్య ఉందని, దానికి మేమిద్దరం పరిష్కారం కనుగొనాలని అన్నారు.

భారత్, చైనా మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించడానికి ఇతర దేశాల వైపు తాము చూడడం లేదన్నారు. పొరుగు దేశాల మధ్య నెలకొన్న సమస్యకు ఇరువురు పరిష్కారం చూపాల్సి ఉందని ఆయన సోమవారం అన్నారు. జపాన్ రాజధాని టోక్యోలో విలేకరుల సమావేశంలో జైశంకర్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'భారత్‌, చైనాల మధ్య ఉన్న అసలు సమస్యను పరిష్కరించేందుకు ఇతర దేశాల వైపు చూడటం లేదు. చైనాతో భారత్ సంబంధాలు బాగా లేవని కూడా అన్నారు. క్వాడ్ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు టోక్యో వెళ్లారు. 

మేం చూసుకుంటాం
ఈ సందర్భంగా జైశంకర్ మాట్లాడుతూ, 'భారత్  చైనాల మధ్య సమస్య ఉంది.  ఇది మా దేశాల మధ్య నెలకొన్న వివాదం. దాని గురించి ఇద్దరం చర్చించుకుని పరిష్కారం కొనుగొనడం మా ఇద్దరి బాధ్యత.  సహజంగానే ప్రపంచంలోని ఇతర దేశాలు కూడా ఈ విషయంలో ఆసక్తి చూపుతాయి. ఎందుకంటే భారత్, చైనా రెండూ పెద్ద దేశాలు. మన సంబంధాల స్థితి మిగిలిన ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. కానీ, మా సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇతర దేశాల వైపు చూడడం లేదు. ఇందులో మూడో దేశం ప్రమేయం అవసరం లేదు.’ అని అన్నారు. ఈ సందర్భంగా ఈ నెలలో రెండుసార్లు చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో తాను జరిపిన సమావేశాలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు.  

తూర్పు లడఖ్‌లో సైనిక ప్రతిష్టంభనపై చర్చ
జైశంకర్,  వాంగ్ యీ గత వారం లావో రాజధానిలో కలుసుకున్నారు. అక్కడ వారు అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ (ఆసియాన్) సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమావేశంలో మే 2020లో తూర్పు లడఖ్‌లో సైనిక బలగాలను ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు ప్రతిష్టంభనను తొలగించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు. సరిహద్దులో శాంతిని తిరిగి తీసుకురావాలని కోరారు. జూలై 4న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సమ్మిట్ సందర్భంగా జైశంకర్,  వాంగ్ కజకిస్థాన్ రాజధాని అస్తానాలో కలుసుకున్నారు. జూన్ 2020లో గాల్వాన్ లోయలో జరిగిన భీకర ఘర్షణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా క్షీణించాయి. దశాబ్దాల కాలంలో సరిహద్దులో ఇలాంటి ఘర్షణ జరగడం ఇదే తొలిసారి. ప్రతిష్టంభనను పరిష్కరించడానికి ఇరుపక్షాలు ఇప్పటివరకు 21 రౌండ్ల కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపాయి.

 

టాప్ హెడ్ లైన్స్

Breaking News: పట్టాలున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకోవడం అన్యాయం: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు
పట్టాలున్న రైతులను అటవీ అధికారులు అడ్డుకోవడం అన్యాయం: సిర్పూర్ ఎమ్మెల్యే హరీష్ బాబు
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Kohli Magic Advice: సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
సింధు గ్రాండ్ కంబ్యాక్ వెనుక కోహ్లీ మైండ్ బ్లాకింగ్ అడ్వైస్.. జపాన్ ఓపెన్ గోల్డ్ విక్టరీ సీక్రెట్ బయటపెట్టిన తెలుగు స్టార్!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
భారత్‌లో అమ్మకానికి వచ్చిన ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ బైక్‌లు ఇవిగో - ఎథనాల్ మిశ్రమంపై ఇక ఆందోళన అక్కర్లేదు!
ఎథనాల్ టెన్షన్‌ను తగ్గించే E85 బైక్‌లు - E20 నుంచి E85 వరకు ఏ పెట్రోల్‌ అయినా వీటిలో వాడొచ్చు!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
Pradeep Machiraju ETV Show: మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
మళ్ళీ ఈటీవీకి మాచిరాజు... రష్మీని రీప్లేస్ చేసిన ప్రదీప్ - మరి సుధీర్ సంగతేంటి?
OG Television Premiere: ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
ఈటీవీలో పవన్ కళ్యాణ్ 'ఓజీ'... గ్రాండ్ టెలికాస్ట్ ప్రీమియర్ ఎప్పుడంటే?
Embed widget