అన్వేషించండి

PV Narasimha Rao: ఆ ఒక్క మాటతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చేశారు - పీవీ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా!

Bharat Ratna 2024: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు 'భారతరత్న' పురస్కారం వరించడంపై అందరిలోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఆ మహోన్నత వ్యక్తి గురించి మరిన్ని విషయాలు మీకోసం.

PV Narasimha Rao Computer Learning Behind Story: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు (PV Narasimha Rao) దేశ అత్యున్నత పురస్కారం 'భారతరత్న' (Bharat Ratna) వరించడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక మాంద్యం నుంచి దేశం గట్టెక్కించాయి. దేశాన్ని అణ్వస్త్ర రాజ్యాల సరసన నిలిపిన ఘనత ఆయనదే. పీవీ నూతన ఆర్థిక సంస్కరణ పథం.. నేడు వీక్షకులు తమ అభిరుచులకు అనుగుణంగా వందలాది టీవీ ఛానళ్లను చూసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందామా..!

ఆ ఒక్క మాటతో

1985వ సంవత్సరం.. రాజీవ్ గాంధీ ప్రధానిగా.. రక్షణ మంత్రిగా పీవీ నరసింహారావు ఉన్నారు. అప్పటికీ కంప్యూటర్ మీద అంత పరిచయం లేనప్పటికీ పీవీకి టెక్నాలజీపై చాలా ఆసక్తి ఉండేది. రాజీవ్ గాంధీకి మాత్రం కంప్యూటర్ పై మంచి అవగాహన ఉండేది. అయితే, ఓ రోజు తన మిత్రుడితో రాజీవ్ గాంధీ మాట్లాడుతూ.. భారత దేశంలో ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ దిగుమతులను అనుమతించాలని అనుకున్నట్లు చెప్పారు. కానీ, తమ పార్టీలోని పాత వాళ్లు దీన్ని ఎలా తీసుకుంటారో తెలియదని.. ఎందుకంటే వారికి కంప్యూటర్ గురించి అవగాహన తక్కువ కదా అని వ్యాఖ్యానించారు. ఈ మాటలను అక్కడే ఉన్న పీవీ విన్నారు. వెంటనే అదే రోజు సాయంత్రం తన కుమారుడు ప్రభాకరరావుకు ఫోన్ చేసి కంప్యూటర్ శాంపిల్ పంపించాలని సూచించారు. ప్రభాకరరావు హైదరాబాద్ లోనే సొంత కంపెనీ నడిపేవారు. అప్పటికే కొన్ని విడి భాగాలతో 3 ప్రోటో టైప్ డెస్క్ టాప్స్ సైతం ఆయన తయారు చేశారు. తండ్రి కోరిక మేరకు ఓ ప్రోటో టైప్ కంప్యూటర్ ను ఢిల్లీకి పంపారు. అంతే కాకుండా పీవీకి కంప్యూటర్ నేర్పేందుకు ఓ టీచర్ ను కూడా ఏర్పాటు చేశారు. 

6 నెలల్లోనే..

అలా, 65 ఏళ్ల వయసులో కంప్యూటర్ పీవీ నరసింహారావు కంప్యూటర్ నేర్చకోవడం ప్రారంభించారు. అయితే, తన కంప్యూటర్ టీచర్ నచ్చకపోవడంతో.. కంప్యూటర్ కు సంబంధించిన మాన్యూవల్స్, బుక్స్ పంపమని కుమారునికి సూచించారు. ఆ పుస్తకాలను ఉదయం, సాయంత్రం చదివి అదే పనిగా 6 నెలలు పాటు పట్టుదలగా కంప్యూటర్ నేర్చుకున్నారు. అయితే, అది సాధారణంగా కంప్యూటర్ వాడకంపైనే కాకుండా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పై కూడా పట్టు సాధించారు. అప్పటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అయిన కోబాల్ (COBOL), బేసిక్ (BASIC), యునిక్స్ (UNICS) ఆపరేటింగ్ సిస్టమ్ లో కోడింగ్ రాయడం కూడా నేర్చుకున్నారు. నిజంగా గ్రేట్ కదూ..!

గిన్నిస్ రికార్డు

పీవీ నరసింహారావు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఘనతలు సాధించారు. 1991లో నంద్యాల లోక్ సభ స్థానం నుంచి ఏకంగా 5 లక్షల మెజార్టీతో విజయం సాధించి గిన్నిస్ రికార్డు సృష్టించారు. ప్రధానిగా తన హయాంలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఆయన 14 భాషలను అనర్గళంగా మాట్లాడేవారు. పీవీకి సంగీతం, సినిమా, నాటకాలంటే అమితాసక్తి. భారతీయ ఫిలాసఫీ, సంస్కృతి, రచనా వ్యాసాంగం, రాజకీయ వ్యాఖ్యానం, తెలుగు, హిందీలో కవితలు రాయడం, సాహిత్యాలపై ఎక్కువ శ్రద్ధ చూపేవారు. సుప్రసిద్ధ తెలుగు నవల 'వేయి పడగల'ను పీవీ 'సహస్రఫణ్' పేరుతో హిందీలోకి అనువదించారు. ఆయనకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు.

పీవీ ప్రస్థానం..

  • పాములపర్తి వెంకట నరసింహారావు (పీవీ నరసింహారావు) 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు.
  • 1951లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో సభ్యుడిగా స్థానం పొందారు. తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రికలో  'జయ' అనే మారుపేరుతో 1950 ప్రాంతంలో ఆర్టికల్స్ రాశారు.
  • 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థిగా మంథని నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 1971 నుంచి 1973 వరకూ ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
  • 1991లోనే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనుకున్న పీవీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యతో ఆ నిర్ణయం విరమించుకున్నారు.
  • దేశ అత్యున్నత పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచారు. నెహ్రూ - గాంధీ కుటుంబ సభ్యులు కాకుండా కాంగ్రెస్ నుంచి ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తి కూడా ఈయనే కావడం విశేషం. 
  • పీవీ తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా టెక్నాలజీ పరంగా, ఆర్థిక పరంగా దేశం అభివృద్ధి పథంలో నడిచింది. అంతటి మహోన్నత వ్యక్తికి దేశ అత్యున్నత పురస్కారం దక్కడం నిజంగా ఆనందదాయకమని రాజకీయ విశ్లేషకులు, ప్రముఖులు అంటున్నారు.

Also Read: Bharat Ratna 2024: భారత దేశం ఆకలి తీర్చిన MS స్వామినాథన్, ఆహార భద్రత ఆయన చలవే

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
సూసైడ్ చేసుకుంటాను.. 2012 యూపీ ఎన్నికలకు ముందు Manmohan Singh అంత మాట అన్నారా ? సంచలన విషయాలు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Pawan Kalyan: ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
ముంబైకి వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన ఏపీ సీఎం చంద్రబాబు
Nagarjuna Yadav Arrest: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు.. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా
Harish Rao On CM Revanth Reddy: రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
రైతులకు నీళ్లు అడిగితే, రక్తం పారిస్తా అంటావా? షాబాద్ ఉన్మాదికి సీఎంకు తేడా లేదు : హరీష్ రావు
Bengaluru Crime News: ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
ఇంట్లోకి చొరబడి ప్రైవేట్ పార్ట్ చూపించి అసభ్య ప్రవర్తన.. ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అరెస్ట్
Viral News: 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
మెయిన్ రోడ్డుపై 6 ఏళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్ నేర్పిస్తున్న ఎస్ఐ, రంగారెడ్డిలో ఖాకీ నిర్వాకం
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
వైభవ్ సూర్యవంశీ Tata Sierra గెలుచుకున్నా ఇప్పుడే అతడు నడపలేడు.. కారు ధర, ఫీచర్లు ఇవే
Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!
Embed widget