అన్వేషించండి

Puducherry: సాయంత్రం వేళలో స్నాక్స్‌- విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వం

పుదుచ్చేరిలో సాయంత్రం వేళ విద్యార్థులకు అల్పాహారంగా స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 85 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారను ముఖ్యమంత్రి రంగస్వామి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం పుదుచ్చేరీ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే స్టూడెంట్స్ అందరికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సాయంత్ర వేళలో వారికి అల్పాహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రంగస్వామి నిర్ణయించారు. 

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సాయంత్రం వేళ చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం అందిస్తామని, దీనివల్ల 85 వేలమంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఉదయం,  సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆ సమయంలో విద్యార్థుల ఆకలి కష్టాలు అంతా ఇంతా కాదు. విద్యార్థుల ఆకలి కష్టాలు తీర్చడానికి సాయంత్రం వేళ అల్పాహారం ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రంగస్వామి చెప్పారు. అల్పాహారంలో పాలు, రొట్టె, బిస్కెట్, పండ్లు అందజేస్తామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

"విద్యార్థులంతా క్రమశిక్షణతో ముందుకు సాగాలని, బాల్యం నుండే మన మేధస్సుని దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఉపయోగించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ప్రణాళిక బద్దంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునర్ధ్గాటించారు. చడువులో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతీ ఒక్క విద్యార్థి పట్టుదలగా కృషి చేయాలి. విద్యార్థులు సక్రమంగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి వారి ప్రతిభను కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి" అని ముఖ్యమంత్రి రంగస్వామి వ్యాఖ్యానించారు.

85 వేల మంది విద్యార్థులకు లబ్ధి....

కొత్త ప్రాజెక్టులో భాగంగా సాయంత్రం వేళ పాఠశాల ముగిసిన విద్యార్థులు ఇంటికి వెళ్లేటప్పుడు సెనగలు, వేరుశనగలు తదితరాలతో చేసిన ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని ద్వారా పుదుచ్చేరి, కారైక్కాల్, మహి, యానం, తదితర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి వరకు చదివే 85 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని చెప్పారు.

స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు... 

ప్రభుత్వ పాఠశాలలో  ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

మెనూ ప్రకారం అందించాలి....

ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో... వాటిని మెనూ ప్రకారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతుల దృశ్య ఆకలి తీర్చుకునేందుకు స్నాక్స్ ని అందించడం హర్షించదగ్గ విషయమని తల్లిదండ్రులు చెప్పారు. స్నాక్స్ ని తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఆకలితోపాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని వెల్లడించారు.     

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !

వీడియోలు

Daksharamam Lord Shiva Idol Vandalised | ద్రాక్షారామం కోనేరు వద్ద శివలింగం ధ్వంసం | ABP Desam
Monty Panesar about Gautam Gambhir | గంభీర్ పై మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill Highest Scorer in Test Format | టెస్టుల్లో టాప్‌ స్కోరర్‌గా గిల్
Hardik, Bumrah out of Ind vs NZ ODI Series | న్యూజిలాండ్ సిరీస్ కు సీనియర్లు దూరం ?
Abhishek Sharma 45 Sixes in 60 Minutes | ప్రపంచ కప్‌ ముందు అభిషేక్ విధ్వంసం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Deputy Floor Leader Harish Rao: తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
తెలంగాణ అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా హరీష్ రావు - కీలక నియామకాలు చేసిన కేసీఆర్
Draksharamam Temple : అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో దారుణం-  ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన దుండగులు
Toll free travel: విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
విజయవాడ- హైదరాబాద్ హైవేపై పండగ ట్రాఫిక్ భయం- టోల్ ఫ్రీ ట్రావెల్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ సిఫారసు
Cigarette Price: మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
మీకు సిగరెట్ అలవాటుందా? -ఇది తెలిస్తే వెంటనే మానేస్తారు !
Mega Victory Mass Song : మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
మెగా విక్టరీ మాస్ ఫుల్ సాంగ్ వచ్చేసింది - చిరు, వెంకీ మాస్ స్టైలిష్ స్టెప్పులు చూశారా?
Mega Victory Mass Song Lyrics : మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
మెగా విక్టరీ మాస్ సాంగ్ - న్యూ ఇయర్, సంక్రాంతికి హుషారు పెంచే లిరిక్స్ బాసూ...
Prabhas Dating: 'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
'రాజా సాబ్' హీరోయిన్‌తో ప్రభాస్ డేటింగ్? ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఎందుకీ డిస్కషన్??
Khaleda Zia Net Worth: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా కన్నుమూత... ఆమె నికర ఆస్తుల విలువ ఎంత
Embed widget