అన్వేషించండి

Puducherry: సాయంత్రం వేళలో స్నాక్స్‌- విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని తీసుకొచ్చిన పుదుచ్చేరి ప్రభుత్వం

పుదుచ్చేరిలో సాయంత్రం వేళ విద్యార్థులకు అల్పాహారంగా స్నాక్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా 85 వేల మంది విద్యార్థులు లబ్ధిపొందనున్నారను ముఖ్యమంత్రి రంగస్వామి అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం పుదుచ్చేరీ ప్రభుత్వం కొత్త పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివే స్టూడెంట్స్ అందరికీ ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. సాయంత్ర వేళలో వారికి అల్పాహారం ఇవ్వాలని ముఖ్యమంత్రి రంగస్వామి నిర్ణయించారు. 

ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సాయంత్రం వేళ చిరుధాన్యాలతో కూడిన అల్పాహారం అందిస్తామని, దీనివల్ల 85 వేలమంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి రంగస్వామి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాల కోసం ప్రభుత్వ పాఠశాలలో ఉదయం,  సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తారు. ఆ సమయంలో విద్యార్థుల ఆకలి కష్టాలు అంతా ఇంతా కాదు. విద్యార్థుల ఆకలి కష్టాలు తీర్చడానికి సాయంత్రం వేళ అల్పాహారం ప్రవేశపెడుతున్నట్లు ముఖ్యమంత్రి రంగస్వామి చెప్పారు. అల్పాహారంలో పాలు, రొట్టె, బిస్కెట్, పండ్లు అందజేస్తామని చెప్పారు.

ప్రభుత్వ పాఠశాలలో ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

"విద్యార్థులంతా క్రమశిక్షణతో ముందుకు సాగాలని, బాల్యం నుండే మన మేధస్సుని దేశాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు ఉపయోగించాలని, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే ప్రణాళిక బద్దంగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పునర్ధ్గాటించారు. చడువులో మెరుగైన ఫలితాలను సాధించేందుకు ప్రతీ ఒక్క విద్యార్థి పట్టుదలగా కృషి చేయాలి. విద్యార్థులు సక్రమంగా చదువుకొని ఉత్తీర్ణత సాధించి వారి ప్రతిభను కనబరిచి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి" అని ముఖ్యమంత్రి రంగస్వామి వ్యాఖ్యానించారు.

85 వేల మంది విద్యార్థులకు లబ్ధి....

కొత్త ప్రాజెక్టులో భాగంగా సాయంత్రం వేళ పాఠశాల ముగిసిన విద్యార్థులు ఇంటికి వెళ్లేటప్పుడు సెనగలు, వేరుశనగలు తదితరాలతో చేసిన ఆహారం ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దీని ద్వారా పుదుచ్చేరి, కారైక్కాల్, మహి, యానం, తదితర ప్రభుత్వ పాఠశాలలో 12వ తరగతి వరకు చదివే 85 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని చెప్పారు.

స్వాగతించిన ఉపాధ్యాయ సంఘాల నాయకులు... 

ప్రభుత్వ పాఠశాలలో  ఉత్తీర్ణతా శాతం పెరిగించేందుకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అల్పాహారం అందిస్తామని తెలిపారు. ప్రభుత్వ విద్యా రంగం అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులందరికీ ఉచిత నోటు పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులందరూ క్రమశిక్షణ, ఏకాగ్రతతో చదివి మంచి ఫలితాలు రాబట్టాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు.

మెనూ ప్రకారం అందించాలి....

ప్రభుత్వం విద్యార్థులకు అల్పాహారం అందజేస్తామని ప్రకటించిన నేపథ్యంలో... వాటిని మెనూ ప్రకారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతుల దృశ్య ఆకలి తీర్చుకునేందుకు స్నాక్స్ ని అందించడం హర్షించదగ్గ విషయమని తల్లిదండ్రులు చెప్పారు. స్నాక్స్ ని తీసుకోవడం వల్ల విద్యార్థులకు ఆకలితోపాటు చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని వెల్లడించారు.     

టాప్ హెడ్ లైన్స్

Petrol & Diesel Price: ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
ఇరాన్‌తో శాంతి ఒప్పంద రద్దు చేసుకున్న ట్రంప్‌! భారత్‌పై ఎఫెక్ట్‌! పెట్రోల్, గ్యాస్ మోత తప్పదా? 
Scindia Royal Family Property Dispute Settlement: 40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
40 ఏళ్ల రాయల్ వార్‌కు తెర! గ్వాలియర్ కోర్టులో రూ. 40,000 కోట్ల సింధియా ఆస్తి వివాదం సుఖాంతం!
West Bengal Encounter: బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
బరుయిపూర్ రేప్, మర్డర్ కేసు.. ఎన్‌కౌంటర్‌లో ప్రధాన నిందితుడు హతం
Prashant Kishor Electoral Debut: వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!
వ్యూహకర్త పీకే ప్రత్యక్ష పోరు! బీజేపీ కంచుకోటలోనే పోటీ.. ప్రశాంత్ కిషోర్ రిస్క్ వెనుక మర్మమిదే!

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nitin Gadkari on E20 Fuel: E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
E20 పెట్రోల్‌తో ఒక్క వాహనం పాడైనా తీసుకురండి! నితిన్ గడ్కరీ ఓపెన్ ఛాలెంజ్‌!
Kaleshwaram Project Politics: కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
కాళేశ్వరం రిపేర్ రాజకీయం - నీళ్లు ఎత్తిపోస్తే డ్యామ్‌లు కూలుతాయా? అసెంబ్లీ చర్చకు కేసీఆర్ సిద్ధమేనా?
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
వంట నుంచి సైన్స్  కోడింగ్ వరకు ప్రాచీన భారతదేశంలో 14 విద్యలు, 64 కళలు: శ్రీకృష్ణుడి అద్భుత జ్ఞాన రహస్యం!
Peddi OTT : ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
ఓటీటీలోకి వచ్చేసిన రామ్ చరణ్ పెద్ది - 4 భాషల్లో స్ట్రీమింగ్... రన్ టైం ఎంతంటే?
 ICC Rankings Boost: టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా తగ్గని ర్యాంకింగ్స్
టాప్ లోనే ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ .. ఇటీవల విఫలమైనా నిలబెట్టుకున్న ర్యాంకులు
Plug-in Hybrid SUV: 1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
1200 కిలోమీటర్ల రేంజ్‌తో అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తున్న SUVలు!
Anantapur Crime News: జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
జంధ్యం, అప్పడాల ప్యాకెట్‌, కాలిన పేపర్‌తో హత్య కేసు ఛేదించిన పోలీసులు! నిందితులు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు!
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
కేతన్ కేసు: 27 గుణాలు సరిపోలినా బంధం ఎందుకు ఫెయిలైంది! పూణే ఉదంతంపై ఎన్నో ప్రశ్నలు - కేవలం గుణాల ఆధారంగా వివాహాన్ని నిర్ణయించాలా?
Embed widget