అన్వేషించండి

Presidential Election: దీదీకి 'KK' షాక్- రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఐక్యత గోవిందా గోవిందా!

Presidential Election: ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రులు కేసీఆర్, కేజ్రీవాల్ గైర్హాజరయ్యారు.

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల వేళ ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు బంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన సమావేశం ప్రారంభమైంది. అయితే ఈ కీలక భేటీకి టీఆర్ఎస్, ఆమ్‌ఆద్మీ, బీజేడీ పార్టీలు గైర్హాజరయ్యాయి. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో ఈ భేటీ జరుగుతోంది.

17 పార్టీలు

ఈ సమావేశానికి 17 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. టీఎంసీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఐ (M), సీపీఐఎమ్‌ఎల్, ఆర్‌ఎస్‌పీ, శివసేన, ఎన్‌సీపీ, ఆర్‌జేడీ, ఎస్‌పీ, నేషనల్ కాన్ఫెరెన్స్, పీడీపీ, జేడీ(S), డీఎమ్‌కే, ఆర్‌ఎల్‌డీ, ఐయూఎమ్ఎల్, జేఎమ్ఎమ్ పార్టీల నేతలు ఈ సమావేశానికి వచ్చారు.

KK షాక్!

ప్రతిపక్షాల ఐక్యతలో కీలకంగా వ్యవహరిస్తారని భావించిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ఈ భేటీకి హాజరుకాకపోవడం దీదీకి పెద్ద మైనస్ అని విశ్లేషకుల మాట. ఇప్పటికే ఈ సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే పాల్గొనలేరని శివసేన ప్రకటించింది. మరోవైపు బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్ కూడా ఈ భేటీకి డుమ్మా కొట్టారు.

మరోవైపు అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మాత్రమే ఈ వ్యవహారంపై స్పందిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ చెప్పినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీని ఈ భేటీ పిలవడాన్ని వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ ఈ సమావేశానికి గైర్హాజరైంది.

విభజన శక్తులకు వ్యతిరేకంగా బలమైన, సమర్థవంతమైన ప్రతిపక్షాన్ని నిర్మించే చర్యల్లో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

కాంగ్రెస్ తరఫున

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈ భేటీకి ఆహ్వానించినప్పటికీ, ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ఈ భేటీకి హాజరయ్యారు. కాంగ్రెస్ లేకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని ఎన్నుకోవడం సాధ్యంకాదని, ఎందుకంటే, కాంగ్రెస్‌కు 50 శాతం ఓట్లు ఉన్నాయని ఖర్గే అన్నారు. 

అభ్యర్థి ఎవరు?

శరద్ పవార్‌ను ప్రతిపక్షాల అభ్యర్థిగా నిలపాలని మమతా బెనర్జీ గట్టిగా పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పవార్ ససేమిరా అన్నట్లు సమాచారం. 

Also Read: Congress Protest: 21 గంటలు, 80 ప్రశ్నలు- వరుసగా మూడో రోజూ రాహుల్ గాంధీ విచారణ

Also Read: Viral News: ఇంగ్లీష్‌లో 35 వచ్చాయ్ సర్, మ్యాథ్స్‌లో 36 వచ్చాయండి- కానీ కలెక్టర్ అయ్యారు కదా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

Paritala Sunitha Files Nomination | వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రకాష్ రెడ్డిపై పరిటాల సునీత ఫైర్Singanamala YCP MLA Candidate Veeranjaneyulu | శింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఇంటర్వ్యూCongress Leader Feroz Khan |ఒవైసీ ఓడిపోతే నేను రాజకీయాలు వదిలేస్తా: ABP Straight Talkలో ఫిరోజ్‌ఖాన్SRH vs RCB AT Uppal | Fans Reactions | ఉప్పల్ వద్ద ఫ్యాన్స్ రచ్చ.. కోహ్లీ ఫ్యాన్సే పాపం..! | ABP

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Weather: ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
ఏపీలో మాడు పగిలేలా ఎండలు, ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు - విపత్తుల సంస్థ వార్నింగ్
IPL 2024: బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
బెంగళూరుదే తొలి బాటింగ్, ప్లే ఆఫ్ ఆశ నెరవేరేనా
Telangana Graduate MLC :  తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఉపఎన్నిక - కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నకు చాన్స్
Sajjala Ramakrishna: ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
ఆ ట్వీట్ చూస్తే పశువులు కూడా అసహ్యించుకుంటాయి - సజ్జల ఘాటు స్పందన
Nominations Over :  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం-  ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం- ఏపీలో అసెంబ్లీ ఎన్నికల ఫీవర్ !
DGP  Ravi Gupta : ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం  చేశారో తెలుసా ?
ఎయిర్ లైన్స్ సేవాలోపం - తెలంగాణ డీజీపీ ఏం చేశారో తెలుసా ?
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
మీ పిల్లలు హార్లిక్స్‌ని ఇష్టంగా తాగేస్తున్నారా? అది హెల్తీ డ్రింక్ కాదట - ఆ సంస్థే ఒప్పుకుంది
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Fact Check: ముస్లింలకు ఆస్తులు పంచి పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందా? బీజేపీ చేసిన ఆ ఆరోపణల్లో నిజమెంత?
Embed widget