అన్వేషించండి

Modi Egypt Visit: ఈజిప్టు చేరుకున్న మోదీ, 26 ఏళ్ల తర్వాత మొదటిసారి భారత ప్రధాని పర్యటన

Modi Egypt Visit: అమెరికా పర్యటన ముగించుకున్న మోదీ ఈజిప్టుకు చేరుకున్నారు. అక్కడ రెండ్రోజుల పాటు పర్యటించనున్నారు.

Modi Egypt Visit: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని అయిన కైరోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీని ఆహ్వానించేందుకు ఆ దేశ ప్రధాని  మోస్తఫా మడ్‌బౌలీ విమానాశ్రయానికి వచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీ తొలిసారిగా ఈజిప్టులో పర్యటించనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలి సారిగా ద్వైపాక్షిక చర్చల కోసం ఈజిప్టులో పర్యటిస్తున్నారు. 2023 గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అప్పుడే తమ దేశానికి రావాలని ప్రధాన మంత్రి మోదీని ఆహ్వానించారు ఎల్-సిసి. జూన్ 24, 25 రెండు రోజులు ఈజిప్టులో పర్యటిస్తారు మోదీ. ఈ సందర్భంగా ఈజిప్టు ప్రధానితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో ప్రత్యేకంగా సమావేశమవుతారు. 

ఆఫ్రికన్ దేశంలో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులను కూడా ప్రధాని మోదీ కలుస్తారు. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దేల్ కరీం అల్లమ్‌తో ప్రధాని మొదటి రోజు సమావేశం అవుతారు. కొందరు ఈజిప్టు నాయకులతోనూ మోదీ భేటీ అవుతారు. ఆదివారం ప్రధాని మోదీ అల్ హకీమ్ మసీదును సందర్శించనున్నారు. కైరోలోని 16వ ఫాతిమిడ్ ఖలీఫా అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లా (985-1021) పేరు మీద ఉన్న ఈ చారిత్రాత్మకమైన, ప్రముఖ మసీదులో ప్రధాని దాదాపు అరగంట సేపు గడుపుతారు. 

అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశాన వాటికను కూడా మోదీ సందర్శిస్తారు. ఆఫ్రికన్ ఖండంలోని ఈ దేశం భారతదేశ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాముల్లో ప్రధానమైంది అలా మోదీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశం-ఈజిప్టు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 1978 నుంచి అమలులో ఉంది. 

Also Read: ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్

విజయవంతంగా ముగిసిన మోదీ అమెరికా పర్యటన

అమెరికాలో మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తో సహా అగ్రశ్రేణి భారతీయ, అమెరికా సీఈవోలతో సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన టెక్‌ మీటింగ్‌లో ఆపిల్‌, ఆల్ఫాబెట్‌ (గూగుల్‌), మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌, ఓపెన్‌ఏఐ వంటి అగ్రస్థాయి టెక్నాలజీ కంపెనీల CEOలతో ప్రధాని మాట్లాడారు. వైట్‌హౌస్‌లో లోపల దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఇండియాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై చర్చ జరిగింది. గ్లోబల్‌ CEOలు అడిగిన అన్ని ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పారు. భయం వదిలేసి భారత్‌ రమ్మంటూ భరోసా ఇచ్చారు. మీ కోసం ఇండియా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ ఆహ్వానించారు. మోదీతో మీటింగ్‌ తర్వాత... గూగుల్ CEO సుందర్ పిచాయ్, అమెజాన్ యొక్క CEO ఆండ్రూ జాస్సీ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్లాన్స్‌ ప్రకటించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో స్పీడ్‌ పెంచడం, లోకల్‌ లాంగ్వేజీల కంటెంట్‌ను ప్రోత్సహించడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం లక్ష్యంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉంటాయి.

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Karnataka Crime News: కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
కర్ణాటకలో పట్టపగలే దారుణం.. యువతిని కొడవలితో నరికి చంపిన ప్రేమోన్మాది
Sonam Wangchuk vs Anna Hazare: వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?
వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష.. పట్టించుకోని జెన్-జీ - అన్నా హజారేలా ఎందుకు కదిలించలేకపోతున్నారు ?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget