అన్వేషించండి

PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ

Vande Mataram Debate: వందేమాతరంపై చర్చ ప్రారంభమైంది. ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడారు. స్వాతంత్ర్య సమయంలో ఈ పేరుతో పత్రికను ఎవరు ప్రారంభించారో తెలుసుకోండి.

Vande Mataram Debate | లోక్‌సభలో వందేమాతరంపై చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు. ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ, 'మన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులు వందేమాతరం అని నినదించి ఉరిశిక్షను స్వీకరించారు.  వివిధ జైళ్లలో ఇది జరిగింది. కానీ అందరి నోటా మంత్రం ఒక్కటే వందేమాతరం. అదే సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రారంభించిన,  వందేమాతరం పేరుతో ఉన్న వార్తాపత్రికలు కొన్ని ఉన్నాయని’ ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో ఈ వార్తాపత్రికలను ఎవరు ప్రారంభించారో తెలుసుకుందాం, దీని గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం పత్రిక ప్రారంభం 

వందేమాతరం అనే పేరు భారతదేశంలో చాలా శక్తివంతమైనది. కోట్లాది మందికి ఆ పదం, నినాదం స్ఫూర్తిదాయకం. ఇది నినాదాలతో పాటు మీడియాలో కూడా కనిపించింది. ఆ సమయంలో ప్రెస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత బలమైన ఆయుధాలలో ఒకటి వందేమాతరం. చాలా మంది జాతీయవాద నాయకులు ప్రజలలో అవగాహన పెంచడానికి, వలస విధానాలను సవాలు చేయడానికి ఇదే పేరుతో వార్తాపత్రికల్ని ప్రారంభించారు. 

బిపిన్ చంద్ర పాల్ మొదటి బందేమాతరం పత్రిక

ఆగస్టు 1906లో జాతీయవాద నాయకుడు బిపిన్ చంద్ర పాల్ కోల్‌కతా నుంచి 'బందేమాతరం' పేరుతో ఒక ఇంగ్లీష్ వారపత్రికను ప్రారంభించారు. జాతీయ గౌరవాన్ని పెంపొందించడం, స్వదేశీ అంశాన్ని ప్రోత్సహించడం, భారతీయుల రాజకీయ ఆకాంక్షలను సమాజంలోని ఇంగ్లీష్ మాట్లాడే వర్గాలకు చేరవేయడం ఆయన ప్రధాన లక్ష్యం. బిపిన్ చంద్ర పాల్ ప్రచురణ త్వరలోనే మేధోపరమైన ఆయుధంగా మారిపోయింది. 

మహర్షి అరబిందో ఘోష్ సంపాదకుడిగా బాధ్యతలు 

వార్తాపత్రిక ప్రారంభించిన వెంటనే అరబిందో ఘోష్ వందేమాతరం సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పత్రికను వీక్లీ నుంచి డైలీగా మార్చారు. ఈ పత్రికను కాంగ్రెస్ లోని గ్రూపునకు అత్యంత ప్రభావవంతమైన స్వరంగా మార్చారు. అరబిందో సంపాదకీయాలు ఉద్రేకపూరితంగా, రాజీలేని జాతీయవాదంతో ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పత్రికను చాలా ప్రమాదకరమని భావించింది. దీనిని నేరుగా 1910 ప్రెస్ చట్టం వంటి కఠినమైన చట్టాలకు ఒక కారణంగా పేర్కొంది. ఈ చట్టం విప్లవాత్మక ఆలోచనలను అణచివేయడానికి రూపొందించారు. 

భికాజీ కామా పారిస్ నుంచి వందేమాతరం పత్రిక ప్రారంభం 

మేడమ్ భికాజీ కామా 1909లో పారిస్ నుండి వందేమాతరం పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు. ఈ పేపర్ లక్ష్యం భారతదేశంలో జాతీయవాదం, బ్రిటిష్ వ్యతిరేక భావాలను ప్రోత్సహించడం. దీని కోసం మేడమ్ భికాజీ కామా పారిస్‌లో పారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించి, దాని ద్వారా ఈ పత్రికను ప్రచురించారు. ఈ పత్రికను బ్రిటిష్ నిషేధానికి ప్రతిస్పందనగా విదేశాలలో ప్రారంభించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
Advertisement

వీడియోలు

Nara Lokesh Tribute to NTR on Death Anniversary | ఎన్టీఆర్ కు నివాళి అర్పించిన లోకేష్
Vande Bharat Sleeper Train Started | పచ్చ జెండా ఊపి వందేభారత్ స్లీపర్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ | ABP Desam
WPL 2026 RCB vs GG Highlights | హ్యాట్రిక్ కొట్టిన బెంగళూరు!
Ashwin about India vs New Zealand | టీమ్ సెలక్షన్ పై అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Manoj Tiwari about Rohit Sharma Captaincy | రోహిత్ కెప్టెన్సీపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs NZ 3rd ODI: కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
కీలకమైన మూడో వన్డేలో పరుగుల వర్షమే.. పిచ్ రిపోర్ట్, IND vs NZ ప్లేయింగ్ XI అంచనా
CM Revanth Reddy: ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
ఖమ్మంలో కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Hyderabad Crime News: హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
హైదరాబాద్‌లో సైబర్ మోసం.. 5 వేలు లాభం చూపించి, ఐటీ ఉద్యోగికి రూ. 2.9 కోట్లు ఎగనామం
Rafale Fighter Jets: భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
భారత్‌లో తయారుకానున్న రాఫెల్ ఫైటర్ జెట్స్.. విదేశాలకు ఎగుమతితో ఎలైట్ క్లబ్‌లోకి
TTD Darshan Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
తిరుమల శ్రీవారి భక్తులకు గమనిక.. దర్శన, సేవా టికెట్ల విడుదల షెడ్యూల్ వచ్చేసింది
Shefali Jariwala Death Reason: చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
చేతబడి వల్లే నా భార్య మరణించింది... అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట విలన్
Telangana News: దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక నగదు రూ.2 లక్షలకు పెంపు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్
Kakinada AM Green Energy: గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
గ్లోబల్ గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ - కాకినాడలో అతిపెద్ద అమ్మోనియా ప్లాంట్‌ - చంద్రబాబు, పవన్ కీలక వ్యాఖ్యలు
Embed widget