అన్వేషించండి

PM Modi In Lok Sabha: వందేమాతరం నినాదంతో ఎందరో ప్రాణత్యాగం చేశారు.. పార్లమెంటులో చర్చలో ప్రధాని మోదీ

Vande Mataram Debate: వందేమాతరంపై చర్చ ప్రారంభమైంది. ప్రధాని మోదీ లోక్సభలో మాట్లాడారు. స్వాతంత్ర్య సమయంలో ఈ పేరుతో పత్రికను ఎవరు ప్రారంభించారో తెలుసుకోండి.

Vande Mataram Debate | లోక్‌సభలో వందేమాతరంపై చర్చ జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చర్చను ప్రారంభించారు. ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడుతూ, 'మన అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధులు వందేమాతరం అని నినదించి ఉరిశిక్షను స్వీకరించారు.  వివిధ జైళ్లలో ఇది జరిగింది. కానీ అందరి నోటా మంత్రం ఒక్కటే వందేమాతరం. అదే సమయంలో స్వాతంత్ర్య పోరాటంలో ప్రారంభించిన,  వందేమాతరం పేరుతో ఉన్న వార్తాపత్రికలు కొన్ని ఉన్నాయని’ ప్రధాని మోదీ ప్రస్తావించారు. స్వాతంత్ర్య పోరాటం సమయంలో ఈ వార్తాపత్రికలను ఎవరు ప్రారంభించారో తెలుసుకుందాం, దీని గురించి ప్రధాని మోదీ పార్లమెంటులో మాట్లాడారు.

స్వాతంత్ర్య ఉద్యమంలో వందేమాతరం పత్రిక ప్రారంభం 

వందేమాతరం అనే పేరు భారతదేశంలో చాలా శక్తివంతమైనది. కోట్లాది మందికి ఆ పదం, నినాదం స్ఫూర్తిదాయకం. ఇది నినాదాలతో పాటు మీడియాలో కూడా కనిపించింది. ఆ సమయంలో ప్రెస్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అత్యంత బలమైన ఆయుధాలలో ఒకటి వందేమాతరం. చాలా మంది జాతీయవాద నాయకులు ప్రజలలో అవగాహన పెంచడానికి, వలస విధానాలను సవాలు చేయడానికి ఇదే పేరుతో వార్తాపత్రికల్ని ప్రారంభించారు. 

బిపిన్ చంద్ర పాల్ మొదటి బందేమాతరం పత్రిక

ఆగస్టు 1906లో జాతీయవాద నాయకుడు బిపిన్ చంద్ర పాల్ కోల్‌కతా నుంచి 'బందేమాతరం' పేరుతో ఒక ఇంగ్లీష్ వారపత్రికను ప్రారంభించారు. జాతీయ గౌరవాన్ని పెంపొందించడం, స్వదేశీ అంశాన్ని ప్రోత్సహించడం, భారతీయుల రాజకీయ ఆకాంక్షలను సమాజంలోని ఇంగ్లీష్ మాట్లాడే వర్గాలకు చేరవేయడం ఆయన ప్రధాన లక్ష్యం. బిపిన్ చంద్ర పాల్ ప్రచురణ త్వరలోనే మేధోపరమైన ఆయుధంగా మారిపోయింది. 

మహర్షి అరబిందో ఘోష్ సంపాదకుడిగా బాధ్యతలు 

వార్తాపత్రిక ప్రారంభించిన వెంటనే అరబిందో ఘోష్ వందేమాతరం సంపాదకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఈ పత్రికను వీక్లీ నుంచి డైలీగా మార్చారు. ఈ పత్రికను కాంగ్రెస్ లోని గ్రూపునకు అత్యంత ప్రభావవంతమైన స్వరంగా మార్చారు. అరబిందో సంపాదకీయాలు ఉద్రేకపూరితంగా, రాజీలేని జాతీయవాదంతో ఉన్నాయి. బ్రిటిష్ ప్రభుత్వం ఈ పత్రికను చాలా ప్రమాదకరమని భావించింది. దీనిని నేరుగా 1910 ప్రెస్ చట్టం వంటి కఠినమైన చట్టాలకు ఒక కారణంగా పేర్కొంది. ఈ చట్టం విప్లవాత్మక ఆలోచనలను అణచివేయడానికి రూపొందించారు. 

భికాజీ కామా పారిస్ నుంచి వందేమాతరం పత్రిక ప్రారంభం 

మేడమ్ భికాజీ కామా 1909లో పారిస్ నుండి వందేమాతరం పేరుతో ఒక జాతీయవాద పత్రికను ప్రచురించారు. ఈ పేపర్ లక్ష్యం భారతదేశంలో జాతీయవాదం, బ్రిటిష్ వ్యతిరేక భావాలను ప్రోత్సహించడం. దీని కోసం మేడమ్ భికాజీ కామా పారిస్‌లో పారిస్ ఇండియన్ సొసైటీని స్థాపించి, దాని ద్వారా ఈ పత్రికను ప్రచురించారు. ఈ పత్రికను బ్రిటిష్ నిషేధానికి ప్రతిస్పందనగా విదేశాలలో ప్రారంభించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Breaking News: సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్.. పోలీసులు అనుమతిస్తారా?
సాయంత్రం హైదరాబాద్‌లో పవన్ కళ్యాణ్ ప్రెస్‌మీట్.. పోలీసులు అనుమతిస్తారా?
Ethanol Stoves : LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
LPG కంటే చౌకగా ఇథనాల్ స్టవ్.. కేవలం 7% ఇథనాల్‌తోనే వంట, కొత్త స్టవ్ ప్రత్యేకతలు ఇవే
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Telangana Formation Day: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్‌న్యూస్.. నిరుపేదలకు సొంతింటి కల సాకారంపై భరోసా
Tim David Banned: ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
ఆర్సీబీ స్టార్ బ్యాటర్ టిమ్ డేవిడ్‌కు బిగ్ షాక్.. జరిమానాతో పాటు ఓ మ్యాచ్ నిషేధం
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
కాకినాడ జిల్లాలో కల్లు రుచి చూసిన చంద్రబాబు.. కల్లుగీత కార్మికుడి కుటుంబానికి భరోసా
Embed widget