అన్వేషించండి

Delhi Ordinance Bill: పార్లమెంట్‌లో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్ సెగ - తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆప్, కాంగ్రెస్

Delhi Ordinance Bill: ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్‌పై పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది.

Delhi Ordinance Bill: 

గందరగోళం..

ఢిల్లీ ఆర్డినెన్స్‌ బిల్‌పై పార్లమెంట్‌లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే మణిపూర్ అంశంపై మాట్లాడాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తుండటం వల్ల రెండు సభలూ సజావుగా సాగడం లేదు. వరుసగా వాయిదాలు పడుతూ వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్‌ వివాదానికి కారణమైంది. ఇవాళ (ఆగస్టు 2) లోక్‌సభలో ఈ బిల్‌ని ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని పాలనా వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వానికే అధికారాలు ఉండేలా రూపొందించిన ఈ బిల్‌ని ఆప్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఆమోదించకుండా అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఇందుకోసం మిగతా పార్టీల మద్దతునీ కూడగడుతోంది. కేంద్రహోం మంత్రి అమిత్‌షా ఈ  బిల్‌ని ప్రవేశపెట్టిన తరవాత డిప్యుటీ హోం మంత్రి నిత్యానంద్ రాయ్...అందులోని అంశాలను పార్లమెంట్‌కి వెల్లడిస్తారు. ఇప్పటికిప్పుడు ఈ ఆర్డినెన్స్‌ని ఎందుకు తీసుకొస్తున్నారో అన్నది వివరించనున్నట్టు తెలుస్తోంది. అయితే...అటు ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ మాత్రం అందుకు ససేమిరా అంటున్నారు. ఆప్‌కి అండగా కాంగ్రెస్‌ నిలబడుతోంది. 

YSRCPమద్దతు

అటు కేంద్రానికి మద్దతుగా బీజేడీతో పాటు YSRCP కూడా మద్దతు పలుకుతోంది. ఈ బిల్‌కి పూర్తి మద్దతునిచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఇదే ఇప్పుడు రాజకీయంగా చిచ్చు పెట్టింది. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇప్పటికే INDIA కూటమి నేతలు సమావేశమయ్యారు. ఆ సమయంలోనే ఈ బిల్‌కి మద్దతునిచ్చే పార్టీలపై విమర్శలు చేశారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతా దళ్ ( Biju Janata Dal)పై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా విరుచుకు పడ్డారు. ఈ బిల్‌కి మద్దతు తెలిపే వాళ్లను తాము యాంటీ నేషనల్ పార్టీగా చూస్తామని ఘాటుగా స్పందించారు. దీనిపై ఇంత గొడవ జరుగుతున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా సపోర్ట్ ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. అసలు ఈ పార్టీలు ఎందుకు మద్దతునిస్తున్నాయో అర్థం కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబర్ అసహనం వ్యక్తం చేశారు. 

"బీజేపీ ఎంపీలు ఈ బిల్‌కి ఎందుకు మద్దతునిస్తున్నారో అర్థం కావడం లేదు. అంత గొప్పదనం అందులో ఏం కనిపించిందో కూడా తెలియడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రిపైనా కేంద్రానికి అధికారం ఉండేలా రూపొందించిన ఈ బిల్‌లో ఒడిశా,ఏపీ ప్రభుత్వాలకు ఏం మెరిట్ కనిపించింది..? లెఫ్ట్‌నెంట్ గవర్నర్ చెప్పిందే వేదం అని పాటించాలనడంలో అర్థం ఏంటి..?"

- పి. చిదంబరం, కాంగ్రెస్ సీనియర్ నేత 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తిరుమల బూంది పోటులో సిట్ అధికారుల పరిశీలన, క్వాలిటీపై ఆరాడ్రా అనుకున్న మ్యాచ్‌ని నిలబెట్టిన టీమిండియా, కాన్పూర్‌ టెస్ట్‌లో రికార్డుల మోతKTR on Revanth Reddy: దొరికినవ్ రేవంత్! ఇక నీ రాజీనామానే, బావమరిదికి లీగల్ నోటీసు పంపుతావా?Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేస్‌, ఈ రూట్స్‌లోనే

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pithapuram : మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
మేం సీఎం తాలూకా, మేం డిప్యూటీ సీఎం తాలూకా-పిఠాపురంలో టీడీపీ వర్సెస్ జనసేన
Adilabad News: ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- ఐదుగురి మృతి
South Young Leaders : దక్షిణాది రాజకీయాలు ఇక  యువతవే  - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
దక్షిణాది రాజకీయాలు ఇక యువతవే - వచ్చే ఎన్నికల్లోపు అసలు యుద్దం వారి మధ్యే !
Harish Rao: మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ - ఖండించిన మాజీ మంత్రి హరీష్ రావు
Tirupati Laddu Issue : సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
సుప్రీంకోర్టు కామెంట్లతో వైసీపీకీ నైతిక బలం - సీబీఐ విచారణకు ఆదేశించినా స్వాగతిస్తారా ?
Jammu Kashmir 3rd Phase Voting: జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
జమ్ముకశ్మీర్‌లో ఆఖరి విడత పోలింగ్‌- 40 సీట్లకు 415 మంది పోటీ
Dussehra 2024 Prasadam : దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
దసరా ప్రసాదాల్లో నువ్వులన్నం ఉండాల్సిందే.. అమ్మవారికి నచ్చేలా ఇలా చేసేయండి, రెసిపీ ఇదే
Sobhita Dhulipala : శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
శోభితా తన పిల్లలకు ఇలా చెప్తాదట.. ఇన్​స్టాలో న్యూ పోస్ట్​కి ఏమి రాసుకొచ్చిందంటే
Embed widget