అన్వేషించండి

India Railways: భారత్‌లో భారీగా రైల్వే ట్రాక్‌ల ధ్వంసానికి పెద్ద కుట్ర - నిఘా వర్గాల హెచ్చరికలు

పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) భారీ కుట్ర పన్నిందని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి.

భారత్‌లోని రైల్వే ట్రాక్‌ల వినాశనానికి పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ పథక రచన చేస్తోంది. ఈ మేరకు దేశ నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి. స్లీపర్ సెల్‌తో కలిసి ఐఎస్‌ఐ పంజాబ్ పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌ను పేల్చివేసేందుకు ప్రయత్నిస్తోందని దేశ భద్రతా సంస్థలు స్పష్టం చేశాయి.

ఇండియా టుడే నివేదిక ప్రకారం, పంజాబ్, దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) భారీ కుట్ర పన్నిందని భారత నిఘా సంస్థలు హెచ్చరించాయి. రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు ఐఎస్‌ఐ కార్యకర్తలు ప్లాన్ చేశారని, ముఖ్యంగా పంజాబ్‌తో పాటు దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను పేల్చివేసేందుకు ప్రణాళికలు రచించారని ఏజెన్సీలు హెచ్చరికలో పేర్కొన్నాయి. రైళ్లు ఢీకొని భారీ నష్టం కలిగించే విధంగా రైల్వే ట్రాక్ ను పేల్చివేయాలనేది వారి ప్లాన్ గా తెలుస్తోంది.

భారీ స్థాయిలో రైల్వే ట్రాక్‌లను లక్ష్యంగా చేసుకోవడానికి ఐఎస్‌ఐ భారతదేశంలోని తన కార్యకర్తలకు నిధులు సమకూరుస్తోందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కూడా తమ హెచ్చరికలో పేర్కొన్నాయి. ఈ పనిని చేయడానికి, భారతదేశంలో ఉన్న పాకిస్తాన్ స్లీపర్ సెల్స్ కూడా పాకిస్తాన్ నుండి భారతదేశానికి వస్తున్నారని భద్రతా సంస్థలు వెల్లడించాయి.

రైల్వే ట్రాక్‌లు ధ్వంసమే లక్ష్యంగా ఇలా బెదిరింపులు రావడం ఇదేం మొదటి సారి కాదు. 2021లోనూ ఇలాంటి బెదిరింపులే ఓ సారి వచ్చాయి. 2021 జులైలో ఐఎస్ఐ సంస్థే భారత్‌లోని ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని రైల్వే ట్రాక్‌లను ధ్వంసం చేస్తామని హెచ్చరించింది. ఆ కరోనా సమయంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. వలస కార్మికులను ఒకచోటి నుంచి మరో చోటికి చేర్చడం మాత్రం అప్పుడు జరుగుతోంది. కాబ్టటి, వలస కూలీల ప్రాణాలే లక్ష్యంగా ఆ దాడులు ప్లాన్ చేశారని అంతా భావించారు. దీంతో అప్పుడు వెంటనే రైల్వే మంత్రి ఏకంగా బిహార్‌లోని 11 మంది ఎస్పీలకు ఈ హెచ్చరికల గురించి లేఖ రాశారు. దీంతో అప్పట్లో వారు కూడా రంగంలోకి దిగారు. మొత్తానికి అప్పుడు రైల్వే ట్రాక్‌లకు ఎలాంటి నష్టమూ జరగలేదు.

ఇటీవలి కాలంలో, పాకిస్థాన్‌కు చెందిన ISI ముఖ్యంగా పంజాబ్, పరిసర రాష్ట్రాల్లో అనేక ఉగ్రవాద కుట్రలు పన్నింది. మొహాలీలోని పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ కార్యాలయంపై జరిగిన దాడిలో ఖలిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి ఐఎస్ఐ పనిచేసినట్లు వార్తలు వచ్చాయి. పంజాబ్ పోలీసులు BSFతో సహా పంజాబ్‌లో పేలుడు పదార్థాలు పాకిస్తాన్ నుండి వచ్చాయని ఆరోపించాయి. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Air India Flight Bird Strike: కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
Mohith Reddy In Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
CJI BR Gavai Attacker: ‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJI గవాయిపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJIపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
Advertisement

వీడియోలు

Pakistan Fielding Women's ODI World Cup | ట్రోల్ అవుతున్న పాకిస్తాన్ ప్లేయర్స్
Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
Ind vs Pak ODI Women's WC 2025 | పాకిస్తాన్‌పై భారత్ సూపర్ విక్టరీ
India vs Pakistan Shake Hand Controversy | వరల్డ్ కప్‌లోనూ ‘నో హ్యాండ్‌షేక్’
దుర్గా నిమజ్జనంలో తీవ్ర ఉద్రిక్తత.. రాళ్లదాడి, వాహనాలకు నిప్పు.. ఇంటర్నెట్ నిషేధం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Air India Flight Bird Strike: కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
కొలంబో- చెన్నై ఎయిరిండియా విమానాన్ని ఢీకొన్న పక్షి.. ల్యాండింగ్ సమయంలో ఘటన
Mohith Reddy In Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
ఏపీ లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
BRS MLA Kaushik Reddy: గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
గెలిచాక పార్టీ మారితే వెయ్యి మందితో దాడి, తుక్కుతుక్కు చేస్తాం: కౌశిక్‌రెడ్డి వార్నింగ్
CJI BR Gavai Attacker: ‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJI గవాయిపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
‘దేవుడు శాసించాడు.. నేను పాటించాను’ CJIపై దాడికి యత్నంపై లాయర్ వింత రియాక్షన్
Australia Squad against India: భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
భారత్‌తో వన్డే, టీ20 సిరీస్ కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా.. కెప్టెన్‌గా మిచెల్ మార్ష్
OG OTT : పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
పవన్ 'OG' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Srikanth Bharat: గాంధీ మహాత్ముడే కాదు - టాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
గాంధీ మహాత్ముడే కాదు - టాలీవుడ్ యాక్టర్ సెన్సేషనల్ కామెంట్స్
Railway Station Closed on Sundays India : ఆదివారం ఈ రైల్వే స్టేషన్​కు సెలవు.. రీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్​గా ఉందిగా
ఆదివారం ఈ రైల్వే స్టేషన్​కు సెలవు.. రీజన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్​గా ఉందిగా
Embed widget