అన్వేషించండి

Opposition Meeting: INDIA కూటమికి పవర్‌ఫుల్ ట్యాగ్‌లైన్! జీతేగా భారత్‌ పేరు ఖరారు?

Opposition Meeting: విపక్ష కూటమి INDIAకి జీతేగా భారత్ అనే ట్యాగ్‌ లైన్‌ చేర్చుతారని తెలుస్తోంది.

Opposition Meeting:  


జీతేగా భారత్..

INDIA అనే పేరుతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది విపక్ష కూటమి. 26 పార్టీలకు చెందిన నేతలు బెంగళూరులో భేటీ అయిన తరవాత మొట్ట మొదటి అస్త్రంగా ఈ పేరునే బయటకు తీశారు. అప్పటి నుంచి NDA,INDIA మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇదంతా బూటకం అని NDA విమర్శిస్తుండగా...ఈ పేరుని వ్యతిరేకించే వాళ్లు దేశద్రోహులు అంటూ ఎన్‌కౌంటర్ చేస్తున్నారు విపక్ష నేతలు. అయితే..కేవలం పేరు మాత్రమే కాదు. ట్యాగ్‌లైన్‌ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని భావిస్తున్నారు ఈ కూటమిలోని నేతలు. Jeetega Bharat అనే ట్యాగ్‌లైన్ పెడతారని తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాలు ఇప్పటికే ఈ విషయం వెల్లడించాయి. "భారత్ గెలిచి తీరుతుంది" అనే అర్థం వచ్చేలా బీజేపీపై యుద్ధం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ట్యాగ్‌లైన్ ఆలోచన వెనకా ఓ కారణముంది. INDIA అనే పేరు బాగున్నప్పటికీ Bharat అని వచ్చేలా ఏదైనా ఉంటే మరింత వెయిటేజ్ పెరుగుతుందని కొందరు నేతలు సూచించారట. అందుకే...పేరులో మార్పు చేయకుండా ఇలా ట్యాగ్‌లైన్ పెట్టాలనే ఆలోచనకు వచ్చారు. అందులో భాగంగానే జీతేగా భారత్ అని ట్యాగ్‌లైన్‌ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. 

పేరు మార్పు..

బెంగళూరులో జరిగిన రెండ్రోజుల భేటీకి 26 పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు. "United We Stand" అనే నినాదంతో మేమంతా ఒక్కటే అనే సంకేతాలిచ్చేందుకు ప్రయత్నించారు. రెండ్రోజుల చర్చలు ముగిసిన వెంటనే విపక్ష కూటమి పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు. ఈ మీటింగ్ జరగక ముందు నుంచే UPA పేరు మారిపోతుందని సమాచారం అందింది. దీనిపై పలువురు నేతల్ని ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా దాటవేశారు. భేటీ ముగిసిన తరవాత అధికారికంగా పేరు మార్చుతున్నట్టు ప్రకటించారు. INDIA అంటే.. 

I - Indian 
N - National 
D - Developmental
I - Inclusive 
A - Alliance

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఈ సమావేశానికి నేతృత్వం వహించారు. ఒకే ఐడియాలజీ ఉన్న పార్టీలన్నీ ఒక్కటై చివరి వరకూ కలిసే ఉంటారన్న సంకేతాలిచ్చారు. ఇప్పుడు పేరు పెట్టడం పూర్తైంది కాబట్టి...ఇకపై అనుసరించాల్సిన వ్యూహాలపై దృష్టి పెట్టనుంది కూటమి. 

"రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే మా మధ్య కొన్ని విభేదాలు ఉండొచ్చు. అది కాదనను. కానీ అవేవీ సైద్ధాంతికపరమైనవి కాదు. పరిష్కరించుకోలేనంత సమస్యలేమీ కావు అవి. సాధారణ పౌరుల కోసం మా విభేదాలన్నింటినీ పక్కన పెట్టి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. వెనకబడిన వర్గాల హక్కుల్ని అణిచివేయడాన్ని సహించం"

- మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అధ్యక్షుడు 
 
ఈ ఏడాది జూన్ 23న తొలిసారి విపక్షాలన్నీ సమావేశమయ్యాయి. అయితే...ఆ సమావేశంలో సోనియా గాంధీ కనిపించలేదు. ఈ సారి మాత్రం ఆమె లీడ్‌ తీసుకుని మరీ సమావేశాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే మళ్లీ బలం పుంజుకుంటున్న కాంగ్రెస్‌కి ఇది కలిసొచ్చే అవకాశముంది. సోనియా గాంధీ ఇంకా యాక్టివ్‌గానే ఉన్నారని చెప్పడానికి కాంగ్రెస్‌ ఆమెని ముందు వరసలో ఉంచి మరీ చర్చలు కొనసాగిస్తోంది. 

Also Read: INDIA అనే పేరు పెట్టింది రాహుల్ గాంధీయేనా? మమతా బెనర్జీ ప్రపోజల్‌ని పట్టించుకోలేదా?

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget