అన్వేషించండి

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సురక్షితం, 141 మంది ఫోన్లు స్విచ్ఛాఫ్!

Coromandel Express Accident: మాటలకందని మహా విషాధ ఘటన, ఒడిశా రైలు ప్రమాదంలో 316 మంది ఏపీ వాసులు సరక్షితంగా ఉండగా.. మరో 141 మంది ఫోన్లు స్విచ్ఫాఫ్ అయినట్లు న్నట్లు రేల్వే అధికారులు తెలిపారు.

Coromandel Express Accident: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 288 మంది దుర్మరణం చెందగా.. 56 మంది తీవ్ర గాయాలపాలయ్యారని, మరో 850 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అధికారులు వెల్లడించారు. అయితే ఈ కోరమాండల్ ఎక్స్ ప్రెస్, యశ్వంత్ పురా-హావ్ డా ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రయాణికులు ఎంత మంది ఉన్నారు, ఎంత మంది చనిపోయారు, మరెంత మంది ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉన్నాయనే విషయాన్ని రైల్వే అధికారులు వెల్లడించారు. రెండు రైళ్లలో ఏపీకి చెందిన వారి యోగక్షేమాలపై పూర్తి సమాచారం ఇచ్చింది. కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదం సంభవించినప్పుడు అందులో ప్రయాణిస్తున్న రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు.. రిజర్వేషన్ చేసుకుని ప్రయాణిస్తున్న వారి వివరాలు వెల్లడించారు. రైల్లో ప్రయాణించిన వారిలో విశాఖపట్నానికి చెందిన 165 మంది, రాజమండ్రికి నుంచి 22 మంది, విజయవాడకు చెందిన 80 మంది మొత్తం 267 మంది సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ లో 113 మంది ఫోన్ లు స్విచ్ఛాఫ్..

పాక్షికంగా గాయపడిన వారిలో విశాఖ నుంచి 11, ఏలూరుకు చెందిన ఇద్దరు, విజయవాడకు చెందిన ఇద్దరు, మొత్తం 20 మంది ఉన్నారు. ఈ మేరకు ప్రయాణికుల వివరాలు తమ వద్ద ఉన్నాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. రిజర్వేషన్ ఉన్నా ఈ రైల్లో ప్రయాణం చేయని వారి జాబితాలో విశాఖ నుంచి 57 మంది, ఏలూరు నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి 22 మంది.. ఇలా మొత్తం 82 మంది ఉన్నారు. ఫోన్ స్విచ్ఛాఫ్ లేదా సమాధానం ఇవ్వని ప్రయాణికుల సంఖ్య 113గా ఉన్నట్లు తేల్చారు. ఇందులో విశాఖ నుంచి 76 మంది, రాజమహేంద్రవరం నుంచి 9, విజయవాడ నుంచి 28 మంది ఫోన్ లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. వీరి ఆచూకీ తెలుసుకునేందుకు రైల్వే శాఖ అధికారులు ఇప్పటికీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. 

యశ్వంత్ పురా - హావ్ డా ఎక్స్ ప్రెస్ లోని 49 మంది సేఫ్

యశ్వంత్ పురా - హావ్ డా ఎక్స్ ప్రెస్ లో ప్రయాణించిన ఏపీకి చెందిన 49 ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో విశాఖ నుంచి 17 మంది, రాజమహేంద్రవరం నుంచి ముగ్గురు, విజయవాడ నుంచి 21 మంది, బాపట్ల నుంచి 8 మంది మొత్తం 49 మంది సురక్షితంగా ఉన్నారు. ఇదే రైల్లో ప్రయాణిస్తూ పాక్షికంగా గాయపడిన వారు విశాఖపట్నం నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రిజర్వేష్ ఉన్నా ఈ రైల్లో ప్రయాణించని వారు విశాఖ నుంచి ఐదుగురు, ఏలూరు నుంచి ఒకరు, విజయవాడ నుంచి నలుగురు మొత్తం 10 మంది ఉన్నట్లు తెలిపారు. ఇదే రైల్లో రిజర్వేషన్ చేసుకున్న వారిలో ఫోన్ స్విచ్ఛాఫ్ లేదా ఫోన్ చేసినా స్పందించని వారు విశాఖ నుంచి 9, విజయవాడ నుంచి 16, నెల్లూరు నుంచి ముగ్గురు మొత్తం 28 మంది ప్రయాణికుల ఆచూకీ ఇప్పటికీ తెలియడం లేదని రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. 

ఫొన్ లు ఏ లొకేషన్ లో స్విచ్ఛాఫ్ అయ్యాయో తెలుసునే ప్రయత్నాలు

అయితే వీరి ఫోన్ లు స్విచ్ఛాఫ్ అయ్యాయా, చికిత్స పొందుతున్నారా, చనిపోయారా, మరెక్కడైనా ఉన్నారా అనే విషయాలు తెలుసుకునేందుకు అధికారులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఆచూకీ తెలియని వారి ఫోన్లు ఏ లొకేషన్ లో స్విచ్ఛాఫ్ అయ్యాయో విశ్లేషించేందుకు డేటా తెలుసుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills Election: కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండోవర్ -  జూబ్లిహిల్స్ ఉపఎన్నికల భద్రత కోసం పోలీసుల కఠిన చర్యలు !
కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండోవర్ - జూబ్లిహిల్స్ ఉపఎన్నికల భద్రత కోసం పోలీసుల కఠిన చర్యలు !
TTD Parakamani theft case: పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు - ఇక దొంగలంతా దొరికిపోతారా?
పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు - ఇక దొంగలంతా దొరికిపోతారా?
BRS With Auto Drivers: బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్
బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్
Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్‌కు ట్రీట్మెంట్.. పక్కటెముకలకు తీవ్ర గాయంపై ఫ్యాన్స్ ఆందోళన
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్‌కు ట్రీట్మెంట్.. పక్కటెముకలకు తీవ్ర గాయంపై ఫ్యాన్స్ ఆందోళన
Advertisement

వీడియోలు

Ajinkya Rahane Comments on BCCI | బీసీసీఐపై విరుచుకుపడ్డ రహానె
karun Nair in Ranji Trophy | 174 పరుగులు చేసిన కరుణ్ నాయర్
Harry Brook in England vs New Zealand | న్యూజిలాండ్‌తో వన్డేలో హ్యారీ బ్రూక్ సెంచరీ
Pratika Rawal | India vs Australia | గాయపడ్డ టీమ్ ఇండియా ఓపెనర్ ప్రతీక రావెల్
Skeleton Lake: 16 వేల అడుగుల ఎత్తులో ఎటు చూసినా ఎముకలే..
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jubilee Hills Election: కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండోవర్ -  జూబ్లిహిల్స్ ఉపఎన్నికల భద్రత కోసం పోలీసుల కఠిన చర్యలు !
కాంగ్రెస్ అభ్యర్థి తండ్రి బైండోవర్ - జూబ్లిహిల్స్ ఉపఎన్నికల భద్రత కోసం పోలీసుల కఠిన చర్యలు !
TTD Parakamani theft case: పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు - ఇక దొంగలంతా దొరికిపోతారా?
పరకామణి చోరీ కేసులో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు - ఇక దొంగలంతా దొరికిపోతారా?
BRS With Auto Drivers: బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్
బాకీ కార్డు ఉద్యమాన్ని ముమ్మరం చేసిన బీఆర్ఎస్.. ఆటోడ్రైవర్లకు రూ.24 వేలు చెల్లించాలని డిమాండ్
Shreyas Iyer Injury: ఐసీయూలో శ్రేయస్ అయ్యర్‌కు ట్రీట్మెంట్.. పక్కటెముకలకు తీవ్ర గాయంపై ఫ్యాన్స్ ఆందోళన
ఐసీయూలో శ్రేయస్ అయ్యర్‌కు ట్రీట్మెంట్.. పక్కటెముకలకు తీవ్ర గాయంపై ఫ్యాన్స్ ఆందోళన
AP New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై తుది నివేదిక రెడీ
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై తుది నివేదిక రెడీ
Fauzi Heroine: ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ రీల్... ఇన్‌స్టాలో వైరల్ వీడియో
ప్రభాస్ 'ఫౌజీ' హీరోయిన్ లేటెస్ట్ డ్యాన్స్ రీల్... ఇన్‌స్టాలో వైరల్ వీడియో
Nano Banana Prompts : నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే
నానో బనానా ట్రెండ్​లో అబ్బాయిల ఫోటోలు మార్చేయండిలా.. ట్రెండింగ్​లో 5 బెస్ట్ ఫొటో ప్రాంప్ట్​లు ఇవే
E20 Petrol Mileage: E20 పెట్రోల్‌ వాడితే పాత BS4 కార్లలో 10-12% మైలేజ్‌ డ్రాప్‌ - కారణం ఇదే!
E20 పెట్రోల్‌ పోస్తే పాత BS4 కార్ల మైలేజ్‌ ఎందుకు తగ్గుతోంది?
Embed widget