అన్వేషించండి

Odisha Train Accident: కరెంట్ షాక్‌తోనే 40 మంది మృతి! ఒడిశా రైలు ప్రమాదంలో షాకింగ్ విషయాలు

Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద దుర్ఘటనలో 40 మంది విద్యుత్ షాక్ తోనే ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వారికి ఎలాంటి గాయాలు కాలేవని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు.

Odisha Train Accident: ఒడిశాలో జూన్ 2న జరిగిన రైలు ప్రమాదంలో మరిన్ని విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఘటనలో 278 మంది ప్రాణాలు కోల్పోగా.. అందులో కనీసం 40 మంది ప్రయాణికులు కరెంట్ షాక్ వచ్చే చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షించిన ఓ పోలీసు అధికారులు ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ప్రమాదం తర్వాత ఘటనాస్థలంలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బంది.. బోగీల నుండి మృతదేహాలను బయటకు తీశారు. అయితే ఓ బోగీలో నుంచి దాదాపు 40 మృతదేహాలను బయటకు తీయగా.. వాటిపై ఎలాంటి గాయాలు అయిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసు అధికారి తెలిపారు. ఇదే విషయాన్ని ప్రభుత్వ రైల్వే పోలీసులు కూడా తమ ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో లైవ్ ఓవర్ హెడ్ కేబుల్ తెగి బోగీలపై పడిందని, దీంతో విద్యుత్ షాక్ జరిగినట్లు రైల్వే పోలీసులు పేర్కొంటున్నారు. 

కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌ గూడ్స్ రైలును ఢీకొట్టిన తర్వాత ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలు పట్టాలు తప్పాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై నుంచి వెళ్తున్న బెంగళూరు - హావ్ డా ఎక్స్‌ప్రెస్‌ కు.. కోరమాండల్ బోగీలు ఢీకొట్టడంతో ఆ రైలు వెనక ఉన్న పలు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఓవర్ హెడ్ లోటెన్షన్ లైన్ కరెంట్ వైర్లు తెగి బోగీలపై పడ్డాయి. దీంతో కరెంట్ పాసై విద్యుదాఘాతం జరిగిందని రైల్వే పోలీసు అధికారులు చెబుతున్నారు. బోగీల మధ్య నలిగిపోవడంతో చాలా మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఛిద్రమయ్యాయని..  కానీ దాదాపు 40 మృతదేహాలపై ఎలాంటి గాయాలు కనిపించలేదని అధికారులు చెప్పారు. ఆ మృతదేహాలపై రక్త స్రావం జరిగిన ఆనవాళ్లు కూడా లేవన్నారు. బోగీలపై లోటెన్షన్ వైర్లు పడి విద్యుత్ ప్రసరించడంతోనే ఆ 40 మంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని భావిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

'మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేం'

రైలు దుర్ఘనటలో మొత్తం 278 మంది మృతి చెందగా.. అందులో 100 మృతదేహాలను ఇప్పటికీ గుర్తించలేకపోయారు. వాళ్లు ఎవరూ అనేది ఇప్పటికీ అధికారులు తేల్చలేదు. ఇప్పటికే 80 గంటలు గడిచిపోయాయి. ముక్కలుగా మారిన మృతదేహాలను ఎక్కువ రోజులు ఉంచలేమని ఢిల్లీలోని ప్రీమియర్ ఎయిమ్స్ ఆస్పత్రికి చెందిన సీనియర్ వైద్యుడు ఒకరూ చెబుతున్నారు. మృతదేహాలను వారి వారి కుటుంబాలకు అప్పగించేంత వరకు ఎంబామ్ చేసైనా భద్రపరచాలని భావిస్తున్నారని, కానీ ఎంబామింగ్ ప్రక్రియ వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని ఆ వైద్యుడు చెబుతున్నారు. ముక్కలైన మృతదేహాలను ఎక్కువ సేపు ఉంచడం కూడా అడ్వైజబుల్ కాదని చెప్పారు. ఇప్పటికే డీఎన్ఏ మ్యాచింగ్ కోసం రక్త నమూనాలను కూడా సేకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. 

12 గంటల్లోపు ఎంబామింగ్ చేస్తేనే మృతదేహాలు భద్రపరచవచ్చు

మృతి చెందిన తర్వాత 12 గంటల్లోపు ఎంబామింగ్ సరిగ్గా చేస్తేనే మృతదేహాన్ని సంవత్సరాల తరబడి భద్రపరచవచ్చని ఎయిమ్స్ అనాటమీ విభాగాధిపతి షరీఫ్ తెలిపారు. ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండకపోతే శరీరాలు 12 గంటల వరకు కూడా బాగానే ఉంటాయన్నారు. ఐస్, కోల్డ్ స్టోరేజ్ మృతదేహం కుళ్లిపోవడాన్ని ఆలస్యం చేస్తుందని చెప్పారు. 

టాప్ హెడ్ లైన్స్

Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Tamil Nadu BJP: తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
తమిళనాడు బీజేపీలో అన్నామలై సంక్షోభం! భారీ సంఖ్యలో పార్టీని వీడుతున్న నేతలు!
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Mamata Banerjee Lok Sabha: బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?
బెంగాల్‌ పీఠం కోల్పోయిన మమత ఢిల్లీ కోటపై కన్నేశారా? యూసఫ్‌ పఠాన్ సీటు ఖాళీ వెనుక అసలు కథేంటీ?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget