అన్వేషించండి

BRS Chief KCR : దేశమంతా గులాబీ జెండా ఎగరాలి, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 24 గంటల కరెంటు - కేసీఆర్

BRS Chief KCR :దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా దేశ పరిస్థితుల్లో మార్పు రాలేదన్నారు.

BRS Chief KCR :  భార‌త్ రాష్ట్ర స‌మితి పార్టీ మహారాష్ట్ర నాందేడ్ లో భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ లో చేశారు. వారికి సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాందేడ్‌ జిల్లాకు చెందిన పలు గ్రామాల సర్పంచ్‌లు, యువకులు భారీ సంఖ్యలో బీఆర్ఎస్ లో చేరారు. బీజేపీ, శివసేన, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన కీలకనేతలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలతో సహా సరిహద్దు గ్రామాలకు చెందిన 40 గ్రామాల సర్పంచ్‌లు బీఆర్ఎస్ లో చేరినట్లు తెలుస్తోంది.  ఈ సభలో ప్రజల్ని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు. దేశంలో విప్లవాత్మక మార్పు అవసరం ఉందని కేసీఆర్‌ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్లు పరిస్థితి ఉందని ఆవేదన చెందారు. ఇన్నేళ్లయినా చాలా గ్రామాల్లో తాగునీరు, సాగు నీరు లేదన్నారు. కరెంట్‌ సదుపాయం లేకుండా వందల గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయన్నారు.  వనరులు ఉన్నా ప్రభుత్వాల చేతకాని పరిస్థితుల వల్లే ఇది జరిగిందన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీకి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. 

దేశంలో నాయకత్వ మార్పు రావాలి

మరఠ్వాడా గడ్డ ఎంతో మంది మహానీయులకు జన్మనిచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో నాయకత్వ మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరుగుతున్నాయని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో స్థానిక ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. ఎంత కష్టం, ఆవేదన ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందో ఆలోచించాలన్నారు. దేశానికి అన్నంపెట్టే రైతన్నల ఉసురు తీసుకోవడం శ్రేయస్కరం కాదన్నారు. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అని నినదించిన పార్టీ దేశంలో బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్నారు.  ఇప్పుడు తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ మహారాష్ట్రకు రోటీ - భేటీ బంధం ఉందన్నారు. నిత్యం తెలంగాణకు వచ్చేవాళ్లంతా అక్కడ ఏం జరుగుతుందో గమనిస్తున్నారన్నారు. తెలంగాణలో రైతు బీమాతో కుటుంబాలకు భరోసా దొరికిందన్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా వారం రోజుల్లో రూ.5 లక్షలు సాయం అందిస్తున్నామన్నారు.  

ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు 

ఎకరానికి ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం రైతు బంధు కింద రైతన్నలకు అందజేస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రైతులు పండించిన ప్రతి గింజను కొంటున్నామన్నారు.  తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు మహారాష్ట్రలో ఎందుకు అమలుచేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మహారాష్ట్రలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. తన మాటల్లో నిజం ఉందన్న కేసీఆర్ బీఆర్ఎస్ కండువా భుజాన వేసుకుని పోరాటానికి కదలిరావాలని పిలుపునిచ్చారు. దళితబంధు దేశమంతా అమలు కావాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌  ప్రభుత్వం రాగానే దేశంలో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.  

మహారాష్ట్రలో 24 గంటల కరెంటు ఇస్తాం 

మహారాష్ట్రలో ఏటా 5 లక్షల కోట్ల బడ్జెట్‌ పెడుతున్నారు కానీ రైతులకు రూ.10 వేలు ఇవ్వలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 13 నెలలు రైతులు దిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోదీ కనీసం పలకరించలేదని మండిపడ్డారు. దిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధానికి చేతులు రాలేదన్నారు. ఫసల్‌ బీమా అంతా జూటా అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కిసాన్‌ సర్కార్‌ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయన్నారు. మహారాష్ట్రలో గులాబీ సర్కార్‌ రాగానే 24 గంటల కరెంటు వస్తుందన్నారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు. 

అధికారం ఇస్తే 24 గంటల కరెంటు  

మహారాష్ట్రలో ఏటా 5 లక్షల కోట్ల బడ్జెట్‌ పెడుతున్నారు కానీ రైతులకు రూ.10 వేలు ఇవ్వలేకపోతున్నారని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. 13 నెలలు రైతులు దిల్లీ సరిహద్దుల్లో ధర్నా చేసినా ప్రధాని మోదీ కనీసం పలకరించలేదని మండిపడ్డారు. దిల్లీ సరిహద్దుల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని చెబితే ప్రధానికి చేతులు రాలేదన్నారు. ఫసల్‌ బీమా అంతా జూటా అని కేసీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ కిసాన్‌ సర్కార్‌ వస్తే రైతుల బతుకులు బాగుపడతాయన్నారు. మహారాష్ట్రలో గులాబీ సర్కార్‌ రాగానే 24 గంటల కరెంటు వస్తుందన్నారు. నాయకులు అంటే ఎక్కడి నుంచో రారని, మీ నుంచే వస్తారన్నారు. దేశంలో బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్నాయన్న కేసీఆర్‌... కేవలం బొగ్గుతోనే దేశమంతటా 24 గంటల విద్యుత్‌ ఇవ్వొచ్చన్నారు. బీఆర్ఎస్ కు అధికారం ఇస్తే రెండేళ్లలో మహారాష్ట్రలో 24 గంటల విద్యుత్‌ ఇస్తామన్నారు.  తెలంగాణలో వచ్చిన మార్పు దేశమంతా రావాల్సిన అవసరం ఉందన్నారు. వచ్చే పరిషత్‌ ఎన్నికల్లో మరాఠా ప్రజలు బీఆర్ఎస్ ను గెలిపించాలన్నారు. దేశమంతా గులాబీ జెండా ఎగరాలన్నారు. కిసాన్‌ సర్కార్‌ రావాలని కేసీఆర్ అన్నారు.  బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశమంతా రైతుబంధు, దళితబంధు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.  భారత్‌ పేద దేశం ఎంతమాత్రం కాదన్న కేసీఆర్ భారత్‌ అమెరికా కంటే ధనిక దేశం అన్నారు. భారత్‌లో ఉన్నంత సాగు భూమి ఇంకెక్కడా లేదన్నారు.

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ

వీడియోలు

Nidhhi Agerwal Samantha Anasuya Incidents | హీరోయిన్లతో అసభ్య ప్రవర్తన..ఎటు పోతోంది సమాజం | ABP Desam
India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
India- New Zealand Trade Deal: భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
భారత్‌తో ట్రేడ్ డీల్‌పై న్యూజిలాండ్ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. వ్యర్థమైన FTAగా విమర్శలు
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Deputy CM Pawan Kalyan: ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
ఏపీలో పర్యాటకుల భద్రతపై సర్కార్ ఫోకస్.. త్వరలోనే టూరిజం సేఫ్టీ, ప్రొటెక్షన్ పాలసీ
Bollywood Actress: ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
ఇప్పుడు ఒక్కో పాటకు 60 లక్షలు... 5 వేలతో కెరీర్ స్టార్ట్‌ చేసి 52 కోట్లు సంపాదించిన బ్యూటీ
Netflix Top 10 Movies: నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
నెట్‌ఫ్లిక్స్‌లో టాప్ 10 మూవీస్... డ్యూడ్, కొన్ని వారాలుగా ట్రెండింగ్ ఫిల్మ్స్‌ లిస్ట్ ఇదుగో
Telangana Assembly Sessions: ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
ఈ 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు? జలాల అంశంపై స్పెషల్ సెషన్.. హీటెక్కిన వాటర్ పాలిటిక్స్
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
క్రికెటర్ల జీతాలు పెంచిన BCCI, ఇప్పుడు ఒకరోజు ఆడితే ఎంత మనీ వస్తుందంటే
Bhu Bharati Portal: భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
భూభారతి పోర్టల్‌లో విప్లవాత్మక మార్పులు.. ఒక్క క్లిక్‌తో రైతుల‌కు పూర్తి భూ స‌మాచారం
Embed widget