అన్వేషించండి

Bombay High Court: భర్తను రోడ్డుపైనే ‘నపుంసకుడు’ అని అరిచిన భార్య, తర్వాత ఘోరం, బాంబే హైకోర్టు సంచలన తీర్పు

ముగ్గురు పిల్లలకు తండ్రి అయినప్పటికీ అతని భార్య భర్తను నపుంసకుడు అని అందరి ముందూ గట్టిగా అరిచి అతణ్ని రెచ్చగొట్టిందని.. కోర్టు తీర్పు వెల్లడిస్తూ చెప్పింది.

అందరి ముందూ నపుంసకుడు అని పిలిస్తే ఏ పురుషుడైనా అవమానంగా భావించడం సహజమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. విడాకుల అనంతరం మాజీ భార్యను హత్య చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తి కేసు విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మొత్తానికి ఈ కేసులో అతణ్ని బాంబే హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. జస్టిస్ సాధనా జాదవ్, జస్టిస్ పృథ్వి చవాన్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. ముగ్గురు పిల్లలకు తండ్రి అయినప్పటికీ అతని భార్య భర్తను నపుంసకుడు అని అందరి ముందూ గట్టిగా అరిచి అతణ్ని రెచ్చగొట్టిందని కోర్టు తీర్పు వెల్లడిస్తూ చెప్పింది.

ఈ కేసు ఏంటంటే.. నందు అనే పండర్ పూర్ వాసి శకుంతల అనే మహిళను 15 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు పుట్టారు. ఆ తర్వాత ఇద్దరి మధ్యా గొడవల కారణంగా ఇద్దరికీ మనస్ఫర్థలు వచ్చాయి. గత నాలుగేళ్లుగా ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. కూలీగా పని చేస్తున్న నందు 2009 ఆగస్టు 28న తన పనికి వెళ్తుండగా.. భార్య శకుంతల కూడా అతణ్ని వెంబడించింది. ఓ బస్సు డిపో వద్దకు చేరుకోగానే శంకుతల భర్త కాలర్ పట్టుకొని దుర్భాషలాడింది. ప్రత్యక్ష సాక్షులు కోర్టులో తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన భర్తను బూతులు తిట్టడమే కుండా పదే పదే నపుంసకుడు అని తిట్టింది. అతను నపుంసకుడు కాబట్టి, తాను విడిగా ఉంటున్నానని, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నానని ఆమె సమర్థించుకుందని అతను తెలిపాడు. 

నందు తరఫు న్యాయవాది శ్రద్ధా సావంత్ వాదిస్తూ, తన క్లయింట్ తనపై జరిగిన దుర్భాషలు, ‘‘అతని గౌరవానికి భంగం కలిగేలా చేసిన వ్యాఖ్యల’’ వల్ల కూడా తీవ్రంగా రెచ్చిపోయాడని వాదించారు. కాబట్టి, తన క్లయింట్‌ను హత్యానేరం నుండి నిర్దోషిగా విడుదల చేయాలని ఆమె బెంచ్‌ను కోరారు. అయితే, నిందితుడు నందు సంయమనం పాటించి ఉండాల్సిందని ప్రాసిక్యూటర్ వీర షిండే వాదించారు. మరనించిన శకుంతలపై పడిన 10 గాయాలు, కత్తిపోట్లను గాయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అయితే, హత్య జరిగేందుకు దారితీసిన పరిస్థితులను లోతుగా విశ్లేషించిన బెంచ్.. “నందు ముగ్గురు ఎదిగిన పిల్లలకు తండ్రి. మృతురాలను నిందితుడిని వెంబడించి అతని మార్గాన్ని అడ్డుకోవడమే కాకుండా, అతని మెడ పట్టుకుని, చొక్కా లాగి దూషించడం ప్రారంభించింది. పైగా నిందితుడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా నపుసంకుడు అంటూ వ్యాఖ్యలు చేసింది. రద్దీగా ఉండే రహదారిపై జరిగింది పట్టపగలు అందరూ ఉండగా చేసిన ఆ వ్యాఖ్యలు అతని గౌరవానికి తీవ్రమైన భంగం కలిగించాయి. ఆ మాటలను అందరూ విన్నారు. సమాజంలో అతని విలువ తగ్గించబడింది.’’ అని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!

వీడియోలు

INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?
Rohit Sharma, Virat Kohli ODI Matches in 2026 | 2026లో రో - కో ఆడే మ్యాచులు ఇవే
India vs New Zealand Series Squad | టీమ్ సెలక్షన్ లో భారీ ట్విస్ట్
Shubman Gill in Team India BCCI | గిల్ విషయంలో సెలెక్టర్ల మాస్టర్ ప్లాన్ ఇదేనా?
Hardik Pandya in Test Cricket | టెస్టుల్లోకి పాండ్యా రీఎంట్రీ ఫిక్స్?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే - సంచలన ప్రకటన చేసిన నారా లోకేష్
Ibomma Case: ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
ఐబొమ్మ రవి విచారణలో కొత్త ట్విస్ట్! తెలుగులో హీరో క్రేజ్ ఆధారంగానే పైరసీ ధరలు నిర్ధారణ
Pawan Kalyan Kondagattu: శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
శనివారం కొండగట్టుకు పవన్ కల్యాణ్ - టీటీడీ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Telangana Latest News: తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
తెలంగాణలో యూరియా నిల్వలపై ప్రభుత్వం కీలక ప్రకటన! అసెంబ్లీ సాక్షిగా లెక్కలు బయటపెట్టి మంత్రి తుమ్మల!
Good news for AP farmers: జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
జగన్ బొమ్మ ఉన్న పాస్ పుస్తకాల స్థానంలో కొత్తవి - పంపిణీ ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
Gujarat stock market scam: స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
స్టాక్ మార్కెట్‌కు సమాంతరంగా డబ్బా ట్రేడింగ్ - ఇలా కూడా మోసం చేస్తారా?
Kalvakuntla Kavitha: కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి జల వివాదాలపై సమాధానం చెప్పాలి - బబుల్ షూటర్ల వల్ల ఏం కాదు - కవిత కీలక వ్యాఖ్యలు
Amaravati News: అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
అమరావతి అభివృద్ధి.. ఉండవల్లి పంపింగ్ స్టేషన్, 4 గ్రామాల్లో మౌలిక వసతులకు టెండర్లు ఖరారు
Embed widget