అన్వేషించండి

PM Modi: ప్రధాని మోదీతో భేటీకి ముందు కోవిడ్19 టెస్టు చేయించుకోవాలి- ముందు జాగ్రత్త చర్యలు!

ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో ముఖ్యమైన సమావేశం జరగనుంది. ఢిల్లీ సీఎం, బీజేపీ నేతలు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దాంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

Ministers Asked To Undergo COVID Test Before Meeting PM Modi | దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో వేగంగా కోవిడ్ వ్యాప్తి చెందుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 7 వేలు దాటాయి. ఈ క్రమంలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్న మంత్రులందరూ ముందుగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. ఇదే వారికి సూచించారని జాతీయ మీడియాలో నివేదికలు పేర్కొన్నాయి.

నేటి సాయంత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో జరగనున్న కీలక సమావేశానికి ముందు ఈ చర్యలు తీసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి సహా మంత్రులు, బీజేపీ నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రోటోకాల్ ప్రకారం, సమావేశానికి హాజరయ్యేవారు ఆర్టీ-పీసీఆర్ పరీక్షను చేసుకుని రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని సమాచారం. 

మీడియా లేటెస్ట్ నివేదికల ప్రకారం, ర్యాలీలలో ప్రధాని నరేంద్ర మోదీతో వేదికను పంచుకునే అధికారులు కూడా ఆర్టీ-పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలి. వారికి టెస్టుల్లో నెగటివ్ వస్తేనే ప్రధాని మోదీని కలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే కరోనా పాజిటివ్ గా తేలితే ముందు జాగ్రత్తగా హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.

భారత్‌లో 7,000 దాటిన కరోనా పాజిటివ్ కేసులు

కరోనా కొత్త వేరియంట్‌ల కారణంగా భారత్‌లో  మళ్లీ కోవిడ్19 పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసులు 7,000 మార్కును దాటాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో 7,121 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 8,573 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఢిల్లీలో 757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 66 మందికి కరోనా సోకింది. ఇటీవల ఢిల్లీలో మొత్తం 90 మంది పేషెంట్లు కరోనా నుంచి కోలుకున్నారు.

కేరళలో అత్యధిక కోవిడ్-19 కేసులు

కేరళలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 170 మంది కరోనా బారిన పడగా.. మొత్తం 2,223 యాక్టివ్ కేసులున్నాయి. గుజరాత్ 114 పాజిటివ్ కేసులతో రెండవ స్థానంలో ఉంది, కర్ణాటకలో 100 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  LF.7, XFG, JN.1, NB.1.8.1తో సహా అనేక కొత్త సబ్ వేరియంట్ల కారణంగా కరోనా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య అధికారులు చెబుతున్నారు. .

గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కరోనాతో ఆరు మంది చనిపోయారు. అందులో ఒక్క కేరళలోనే మూడు మరణాలు, కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ఒకరు చనిపోయారు. తాజా మరణాలతో కలిపితే జనవరి 2025 నుండి మొత్తం కోవిడ్-19 మరణాల సంఖ్య 74కి చేరింది.

మహారాష్ట్రలో నమోదైన మరణాలలో 43 ఏళ్ల వ్యక్తి  శ్వాస సమస్య, పొత్తికడుపు నొప్పి, బాధ, సైనోసిస్ వంటి తీవ్రమైన లక్షణాలతో ఉన్నాడు. అతడికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని, ఇది సమస్యలకు గురిచేస్తుందని ఆరోగ్య అధికారులు తెలిపారు.

దేశంలో తాజా పరిస్థితులతో కేంద్ర వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రాలు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, టెస్టుల సంఖ్య పెంచాలని.. హాస్పిటల్స్ లో బెడ్స్ ఏర్పాటు చేయడం, ఆక్షిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉంచడం లాంటి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను కోరింది. వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్నందున రద్దీగా ఉండే ప్రదేశాలలో, ప్రయాణించేటప్పుడు మాస్కులు ధరించడం లాంటివి పాటించడం మంచిదని సూచిస్తున్నారు.

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
India Hockey Jersey: హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
హాకీ జట్టు కాషాయ రంగు జెర్సీపై వివాదం! ఆటల్లో రాజకీయమేంటని ప్రశ్నిస్తున్న కాంగ్రెస్!
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
Embed widget