అన్వేషించండి

Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి బస్తర్ కమాండర్ గా మాడ్వి హిడ్మా బాధ్యతలు చేపట్టారు. 'ఆపరేషన్ కగార్'పై పోరాడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించారు.

Maoist Party: మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరుపతి అలియాస్ దేవ్ జి, బస్తర్ కమాండర్ గా గెరిల్లా సుప్రీం లీడర్ మాడ్వి హిడ్మా ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో 'ఆపరేషన్ కగార్'కు వ్యతిరేకంగా పోరాడేందుకు ఆ పార్టీ ప్రణాళికలు రచిస్తున్నట్లు ప్రకటించింది. ప్రజలంతా గెరిల్లా యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. సెప్టెంబర్ 21 నుంచి 27 వరకు దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు) కేంద్ర కమిటీ 21వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటన చేస్తూ, 9 పేజీల లేఖను విడుదల చేసింది. మావోయిస్టులకు, పార్టీ శ్రేణులకు, ప్రజల్లో పోరాట స్ఫూర్తిని రగిలించేందుకే ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు లేఖలో పేర్కొంది. పార్టీ ఎదుర్కొంటున్న సవాళ్లు అధిగమించడానికి, ప్రజావ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి ఓ వేదికగా ఈ ఉత్సవాలు జరగనున్నాయని తెలిపింది.

Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

పార్టీ ముఖ్య నేతల అమరత్వంపై మావోయిస్టు పార్టీ ఏం చెప్పిందంటే...

గత ఏడాది కాలంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న 'ఆపరేషన్ కగార్'లో పార్టీకి జరిగిన నష్టాన్ని స్పష్టంగా లేఖలో పేర్కొనడం జరిగింది. 1972లో పార్టీ ప్రధాన కార్యదర్శి చారు మజుందార్‌ను ప్రభుత్వం హత్య చేసిన తర్వాత, ఇంత పెద్ద మొత్తంలో ప్రభుత్వం చేతిలో తమ నాయకులను కోల్పోవడం ఇదే తొలిసారి అని మావోయిస్టు పార్టీ అభిప్రాయపడింది. పార్టీ ప్రధాన కార్యదర్శి సంబాల కేశవరావు, పార్టీ కీలక నేతలు చలపతి, కిషన్, విలాస్, భరత్, హర్ష, గోతం, వివేక్, ఉదయ్ వంటి పోరాట యోధులు అమరులు కావాల్సి వచ్చిందని ఆ పార్టీ లేఖలో పేర్కొంది. ఈ నష్టాలు తమ విప్లవోద్యమాన్ని, సైద్ధాంతికంగా దీర్ఘకాలం ప్రభావితం చేస్తాయని పార్టీ అంగీకరించింది. అయితే ఈ నష్టాన్ని అధిగమించి ప్రజా పోరాటాన్ని ఉధృతం చేస్తామని, పార్టీని బలోపేతం చేసుకోవడమే తమ లక్ష్యమని మావోయిస్టు పార్టీ 9 పేజీల లేఖ ద్వారా ప్రకటన చేసింది.


Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

'ఆపరేషన్ కగార్' సైనిక యుద్ధమే అంటోన్న మావోయిస్టు పార్టీ.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ కగార్'ను మావోయిస్టు పార్టీ పెద్ద సైనిక యుద్ధంగా తన లేఖలో వివరించింది. ఈ ఆపరేషన్ ఎదుర్కొని, రాజ్యాన్ని ఓడించి తీరతామని లేఖ ద్వారా చెప్పారు. గెరిల్లా యుద్ధాన్ని పటిష్టం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ ను ఎదుర్కోవడానికి ప్రజలను సన్నద్ధం చేస్తామని మావోయిస్టు పార్టీ తెలిపింది. ఇందు కోసం విస్తృత ప్రచారం చేపడతామని తెలిపింది. పార్టీకి ఉన్న బలహీనతలను ఈ లేఖలో మావోయిస్టు నేతలు ప్రస్తావించారు. పార్టీకున్న నియంత్రణలు, సైద్ధాంతిక సమస్యలు, నిధుల కొరత, ప్రజల్లో తమకు తగ్గిన మద్దతు వంటి బలహీనతలు వెంటాడుతున్నాయని, వాటిని అధిగమించి ముందుకు సాగాలని పార్టీ శ్రేణులకు ఈ లేఖ ద్వారా మావోయిస్టు నాయకత్వం పిలుపునిచ్చింది.


Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ


Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

మావోయిస్టు సిద్ధాంతాల ప్రచారానికి అన్నింటినీ వాడాలని మావోయిస్టు పార్టీ పిలుపు.

మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను, పోరాట స్ఫూర్తిని, నాయకుల అమరత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని రకాల మాధ్యమాలను ఉపయోగించాలని పార్టీ శ్రేణులకు లేఖ ద్వారా అధినాయకత్వం పిలుపునిచ్చింది. ప్రజానాట్యమండలి బుర్రకథలు, పాటలు, కవితలు, జానపదాలు, సాహిత్యం వంటి వాటిని ఆయుధంగా వాడుకోవాలని సూచన చేసింది. "బండెనక బండి కట్టి", "పల్లె పల్లెన పండుగ నేడు" వంటి పాటల స్ఫూర్తిని తిరిగి ప్రజల్లో రగిలించాలని పార్టీకి అధినాయకత్వం సూచించింది. అలాగే, డిజిటల్ మాధ్యమాలను కూడా ప్రచారానికి ఉపయోగించుకోవాలని ఈ లేఖలో పేర్కొన్నారు.

Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

మహిళల కోసం మావోయిస్టులు ఏం చెప్పారంటే...

మావోయిస్టు పార్టీలో మహిళా నాయకత్వాన్ని, అమరులైన మహిళలను గుర్తు చేస్తూ పార్టీ అధినాయకత్వం తన లేఖలో తెలంగాణ విమోచన ఉద్యమాన్ని ప్రస్తావించింది. చాకలి ఐలమ్మ, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం వంటి మహిళా యోధుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని మహిళలకు పిలుపునిచ్చింది. తమ ఇంటి పనులు చేసుకుంటూనే వారు సమాచార వాహకులుగా, ఆయుధాలను అందించే సరఫరాదారులుగా నాటి ఉద్యమంలో ఎలా పని చేశారో గుర్తు చేసుకోవాలని మావోయిస్ట్ పార్టీ తన లేఖలో పేర్కొంది. అంతే కాకుండా గ్రామగ్రామాన నాటి పోరాట జ్ఞాపకాలను డాక్యుమెంట్ చేయాలని, వీర గాథలను, పోరాట యోధుల చరిత్రను నేటి సమాజానికి తెలుపుతూ మావోయిస్టు ఉద్యమం బలపడేలా ఉపయోగించుకోవాలని పార్టీ శ్రేణులకు సూచన చేసింది.

Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ



Maoist Party: ''కగార్'పై పోరాట ప్రణాళిక సిద్ధమంటున్న మావోయిస్టు పార్టీ

శాంతి చర్చలకు సిద్దమే

 ఈ నెల ఆరో తేదీన విడుదల చేసిన లేఖ ద్వారా అనేక అంశాలను మావోయిస్టు పార్టీ ప్రస్తావించింది.  దేశంలోని ఆర్థిక అంశాలను,  ఎన్డీఏ పాలన అంశాలను,  అమెరికా పన్ను పోటును, అమెరికా చైనా ఘర్షణ,  ఇజ్రాయెల్ - గాజాలమధ్య ఘర్షణ వంటి అంతర్జాతీయ అంశాలను లేఖలో ప్రస్తావించింది.  అయితే పార్టీకి ఎదురుదెబ్బలు సహజమేనని వీటన్నింటిని ఎదుర్కొనే ముందుకు వెళతాని మావోయిస్టు పార్టీ పేర్కొంది. ఇప్పటీ  కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు తాము సిద్ధమేనని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. ప్రభుత్వం ఉద్రిక్తతలు తగ్గించాల్సిన అవసరం ఉందని, ఆపరేషన్ కగార్ ను ఆపాలని డిమాండ్ చేసింది.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

UPI Transactions: బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
బయోమెట్రిక్ యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. జూన్‌లో 61 కోట్లు దాటిన పేమెంట్స్
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Breaking News: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ గాయని ఎస్ జానకి కన్నుమూత
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND VS ENG 5th T20 Result Update: క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  
క‌థ మార‌లేదు.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘోర ప‌రాజ‌యం.. 4-0తో ఇంగ్లాండ్ క్లీన్ స్వీప్..  రాణించిన ఇషాన్, తిలక్
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Hyderabad Crime News: హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో వ్యక్తి దారుణహత్య కలకలం!
Shabad Mass Killing News: ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
ఆరు హత్యల ఘటనలో షాబాద్ సీఐ సస్పెండ్..! నిందితుడ్ని పట్టిస్తే రూ.2 లక్షల బహుమతి
Vietnam Boat Tragedy: వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
వియత్నాం బోటు ప్రమాదం.. మరణించిన 15 మంది భారతీయులు వీరే.. ఏపీ నుంచి ముగ్గురు
Tribute To Singer S Janaki: సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
సింగర్ ఎస్. జానకి మృతి పట్ల ఏపీ, తెలంగాణ సీఎంలు సహా ప్రముఖులు దిగ్భ్రాంతి
Car Insurance: నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
నీళ్లలో కారు మునిగిపోతే పొరపాటున కూడా ఈ తప్పులు చేయవద్దు, ఇన్సూరెన్స్ రాదు
US Iran War: హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
హత్యకు గురవుతానని ట్రంప్ ఆందోళన! ప్రాణానికి ప్రాణం.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన
Vietnam Boat Accident: వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
వాళ్లను తీసుకెళ్లింది మొబైల్ కంపెనీ - బాధ్యత వారిదేనా? మృతుల కుటుంబాలకు ఎంత పరిహారం ఇస్తారు?
Embed widget