అన్వేషించండి

Mann Ki Baat: దేశంలో ఆ జబ్బు అంతానికి కృషి చేస్తున్న యువతకు మోదీ అభినందనలు - మన్‌కీ బాత్‌లో ప్రధాని

Mann Ki Baat: మన్ కీ బాత్ 102 ఎపిసోడ్ లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఎమర్జెన్సీ రోజులు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయన్నారు.

Mann Ki Baat: దేశంలో టీబీని అంతం చేసేందుకు యువత చేస్తున్న కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చడంలో యువత పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. నైనిటాల్ లోని దికర్ సింగ్ ను, కిన్నౌర్ కు చెందిన జ్ఞాన్ సింగ్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు. మన్ కీ బాత్ 102 ఎపిసోడ్ లో భాగంగా ప్రధాని మోదీ వివిధ అంశాలపై ప్రసంగించారు. అమెరికా పర్యటన గురించి ఆయన చెప్పారు. అలాగే ఛత్రపతి శివాజీని స్మరించుకున్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ప్రసంగంలో ఎమర్జెన్సీ గురించి ప్రస్తావించిన మోదీ.. అది దేశానికి చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. సాధారణంగా ప్రతి నెలా చివరి ఆదివారం రోజు మన్ కీ బాత్ కార్యక్రమం ఉంటుంది. అయితే ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్తున్న దృష్ట్యా ఓ వారం ముందుగానే మన్ కీ బాత్ జరుగుతున్నట్లు ప్రధాని వివరించారు. వచ్చే వారంలో అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు చెప్పిన ప్రధాని.. అక్కడ ఉన్నన్ని రోజులు బిజీగా గడిచిపోనున్నట్లు చెప్పారు. అమెరికా పర్యటనకు ముందు దేశ పౌరులతో మాట్లాడాలని అనుకున్నట్లు మోదీ అన్నారు. మీతో సంభాషిస్తే.. మీ ఆశీస్సులతో స్ఫూర్తితో నా శక్తి కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. 

'ఛత్రపతి శివాజీని స్ఫూర్తిగా తీసుకోవాలి '

మన్ కీ బాత్ ప్రసంగంలో భాగంగా ఎమర్జెన్సీ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు ప్రధాన మంత్రి. ఆ రోజుల్లో ఎంతో గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నట్లు చెప్పారు. అది దేశంలో చీకటి అధ్యాయంగా అభివర్ణించారు. ఆనాటి రోజులు ఇప్పటికీ వెంటాడుతున్నాయని చెప్పారు. శివాజీ మహారాజ్ గురించి ప్రస్తావించిన మోదీ.. ఈ నెల ప్రారంభంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు. ఈ సందర్భాన్ని పెద్ద పండుగలా జరుపుకున్నట్లు చెప్పారు. వారి నైపుణ్యాలను తెలుసుకోవడం, వారి నుంచి నేర్చుకోవడం మనందరి కర్తవ్యమని సూచించారు. ఇలాంటి మన వారసత్వాన్ని తలచుకుని మనం ఎంతో గర్వపడతామని పేర్కొన్నారు. భవిష్యత్తుకు కూడా స్ఫూర్తిని పొందాతమని వివరించారు. 

'టీబీని తరిమికొట్టేందుకు యువత కృషి అభినందనీయం'

దేశంలో టీబీని అంతం చేయాలని, టీబీని తరిమికొట్టేందుకు యువత చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశాన్ని టీబీ రహితంగా మార్చడంలో యువత పాత్ర ఎంతో ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో నైనిటాల్ లోని ఓ గ్రామం దికర్ సింగ్ ను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఆయన ఆరుగురు టీబీ రోగులను చేరదీసినట్లు తెలిపారు. అదే విధంగా కిన్నౌర్ కు చెందిన జ్ఞాన్ సింగ్ కూడా టీబీ రోగులకు అన్ని విధాలా సహాయాన్ని అందిస్తున్నట్లు మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ వారిని అభినందించారు. 

యూపీలో 40కి పైగా చెరువులను నిర్మించిన తులసీ రామ్

ఉత్తరప్రదేశ్ లోని బండా నివాసి తులసీ రామ్ యాదవ్ ను ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో ప్రశంసించారు. తులసీ రామ్ యాదవ్ 40కి పైగా చెరువులను నిర్మించారని ఈ సందర్భంగా మోదీ తెలిపారు. హాపూర్ లో అంతరించిపోయిన వేప నదిని కూడా తులసీ రామ్ పునరుద్ధరించినట్లు ప్రధాని తెలిపారు. ప్రజల సమిష్టి కృషి వల్ల నదులు మళ్లీ జీవం పోసుకున్నాయని ప్రశంసించారు. ఏ రంగంలో అయినా చిత్తశుద్ధితో పని చేస్తే ఫలితాలు సాధించవచ్చని తెలిపారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ

వీడియోలు

Delhi Bangladesh High Commissionerate | బంగ్లాదేశ్ హైకమిషనరేట్‌ను ముట్టడించిన హిందూ సంఘాలు | ABP
1 Crore to Pak U-19 Players | పాక్ ఆటగాళ్లకి ఒక్కొక్కరికీ కోటి రూపాయలు | ABP Desam
Shubman Gill vs Yashasvi Jaiswal | t20 వరల్డ్ కప్ 2026 ఇండియన్ స్క్వాడ్ లో జైస్వాల్ కి చోటు దక్కల్సింది | ABP Desam
Virat Kohli Under Pant Captaincy | పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగబోతున్న విరాట్ కోహ్లీ | ABP Desam
Vaibhav Suryavanshi Shoe Controversy | పాక్ పేసర్‌కు వైభవ్ సూర్యవంశీ షూ చూపించిన ఘటనపై క్లారిటీ | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Aravali Contraversi: ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
ఆరావళి పర్వతాలను మైనింగ్ మాఫియాకు అప్పగించేస్తున్నారా? -అసలేం జరుగుతోంది?
YSRCP activist arrest: రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
రాజకీయ అహంకారంతో చెలరేగిపోతున్న వారికి ఏపీ పోలీసుల షాక్ ట్రీట్‌మెంట్ - నడిపించుకుంటూ తీసుకెళ్తున్నారు !
Harish Rao: తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
తప్పుడు కేసుల్ని పెట్టే పోలీసుల్ని వదిలి పెట్టేది లేదు - ట్యాపింగ్ కేసు నోటీసుల ప్రచారంపై హరీష్ రావు హెచ్చరిక
Shambhala Review : బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
బడ్జెట్... హార్డ్ వర్క్ నో కాంప్రమైజ్ - 'శంబాల' థియేటర్స్‌లో చూస్తేనే ఫీల్... హీరో ఆది సాయికుమార్ ఇంటర్వ్యూ
Indian Railways: అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
అస్సాంలో ఏనుగుల మృతితో రైల్వేశాఖ కీలక నిర్ణయం.. AI టెక్నాలజీతో ప్రమాదాలకు చెక్
Top Selling Hatchback: నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
నవంబర్ 2025లో నంబర్ 1 హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్.. హ్యుందాయ్, టాటాల పొజిషన్ ఇదే
Tirupati Govindarajaswamy Temple: వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
వైసీపీ హయాంలో గోవిందరాజస్వామి ఆలయంలో 50 కేజీల బంగారం గోల్ మాల్ ఆరోపణలు - విజిలెన్స్ విచారణ
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
ఫోన్ టాపింగ్ కేస్ లో బిగ్ ట్విస్ట్! కేసీఆర్, ఇద్దరు మాజీ మంత్రులకు సిట్ నోటీసులు?
Embed widget