By: ABP Desam | Updated at : 05 Apr 2022 07:12 PM (IST)
Edited By: Murali Krishna
భార్యను 3 కిమీ బండిలో లాక్కెళ్లిని పెద్దాయన- అంబులెన్స్ లేక ఎండలో పాట్లు!
అనారోగ్యంతో ఉన్న తన భార్యను ఎండలో ఓ వృద్ధుడు బండిలో పడుకోబెట్టి లాక్కొని ఆసుపత్రికి తీసుకువెళ్తోన్న ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో ప్రభుత్వం దృష్టికి రావడంతో యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్ పాతక్ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
ఏం జరిగింది?
బల్లియాలోని చిల్కర్ బ్లాక్ అందౌర్ గ్రామానికి చెందిన సకుల్ ప్రజాపతి.. తన భార్య జోగిని (55)ని మార్చి 28న ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అయితే అంబులెన్స్ లేకపోయేసరికి ఎద్దులబండిని తానే లాక్కొని 3 కిమీ దూరంలో ఉన్న హెల్త్ సెంటర్కు తీసుకెళ్లాడు. ఈ వీడియో, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీంతో దీనిపై దర్యాప్తు చేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు.
बलिया,उत्तर प्रदेश के वायरल वीडियो में एक बुजुर्ग व्यक्ति मरीज को ठेले पर अस्पताल ले जाते दिखाई दे रहा है।जानकारी प्राप्त होने पर वायरल वीडियो का संज्ञान लेते हुए स्वास्थ्य महानिदेशक को जांच कर दोषियों के विरुद्ध कार्यवाही करने के निर्देश दिए।जिसकी खबर प्रमुख समाचार पत्रों में.. pic.twitter.com/nOjIuIytTn
— Brajesh Pathak (@brajeshpathakup) April 5, 2022
ఫలితం శూన్యం
అయితే అంత కష్టపడి తన భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లినా ఆ పెద్దాయనకు బాధే మిగిలింది. తన భార్యకు మందులు ఇచ్చి జిల్లా ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు, ఆయనకు తెలిపారు. దీంతో ఆమెను ఆసుపత్రిలోనే విడిచి పెట్టి మళ్లీ ఇంటికి వెళ్లి డబ్బులు, బట్టలు తీసుకువచ్చాడు ప్రజాపతి. ఆ తర్వాత మినీ ట్రక్లో జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. ఆ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.
ఆ తర్వాత
ప్రజాపతి భార్య రాత్రి 11 గంటల సమయంలో చనిపోయింది. అప్పుడు మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు అంబులెన్స్ను కోరగా రాత్రి వేళల్లో సేవలు లేవని ఆసుపత్రి చెప్పింది. దీంతో రూ.1100 ఇచ్చి ఓ ప్రైవేట్ అంబులెన్స్లో తన భార్య మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లాడు.
అఖిలేశ్ విమర్శలు
उप्र में चिकित्सा की झूठी उपलब्धि के झूठे विज्ञापनों में जितना खर्च किया जाता है, उसका थोड़ा-सा हिस्सा भी अगर सपा के समय सुधरी चिकित्सा सेवाओं पर लगातार खर्च किया जाता रहा होता तो आज भाजपा के राज में स्ट्रेचर व एम्बुलेन्स के अभाव में लोगों की जो जान जा रही है वो बचाई जा सकती थी। pic.twitter.com/De892bcDUb
— Akhilesh Yadav (@yadavakhilesh) April 5, 2022
ఈ ఘటనపై సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందించారు. యోగి నేతృత్వంలోని ప్రభుత్వం.. ప్రజలకు కనీస ఆరోగ్య సేవలు అందించలేకపోతుందని విమర్శించారు.
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
SonuSood Foundation : ఆపన్నులకు సేవ చేయాలనుకుంటున్నారా ? సోనుసూద్ పిలుపు మీ కోసమే
Tour of Duty Scheme : ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్స్ రిక్రూట్మెంట్లో విప్లవాత్మక మార్పులు, 4 ఏళ్ల తర్వాత సర్వీస్ నుంచి రిలీజ్
IAS Couple Dog : ఇప్పుడు ఆ కుక్కను ఎవరు తీసుకెళ్తారు ? బదిలీ అయిన ఐఏఎస్ జంటపై సోషల్ మీడియాలో పేలుతున్న సెటైర్లు
Ysrcp Bus Yatra : సామాజిక న్యాయమే సీఎం జగన్ ఫిలాసఫీ, నరసరావుపేట సభలో మంత్రులు
Redmi 11 5G Launch: రెడ్మీ చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - జూన్లోనే లాంచ్ - ధర లీక్!
Beer With Urine: నీళ్లు సేవ్ చేసేందుకు మూత్రంతో బీర్ తయారీ, మీ బ్రాండ్ ఇది కాదు కదా?
Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!