అన్వేషించండి

Kerala Bus Owner: కరోనా దెబ్బకు విలవిల, బస్సులను కిలో రూ.45కు విక్రయించిన ఓనర్

Sold Buses for 45 Rupees per kg: కేరళకు చెందిన టూరిస్ట్ బస్సుల ఓనర్ కరోనా వ్యాప్తి సమయంలో తీవ్రంగా నష్టపోయి కీలక నిర్ణయం తీసుకున్నారు. బస్సులను తుక్కు కింద విక్రయించాలనుకోవడం సమస్యలకు నిదర్శనం.

Kerala Buses Owner: కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాయి. భారత్‌లోనూ ఎన్నో లక్షల కుటుంబాలు కరోనా దెబ్బకు విలవిల్లాడిపోయాయి. కొన్ని రకాల వ్యాపారం చేసే వారు లాభాలు ఆర్జిస్తే, మరికొందరు వ్యాపారులు పూర్తిగా నష్టపోయి రోడ్డు మీద పడ్డారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి కరోనా తీవ్ర నష్టాలను మిగిల్చింది. కేరళకు చెందిన టూరిస్ట్ బస్సుల ఓనర్ కరోనా వ్యాప్తి సమయంలో తీవ్రంగా నష్టపోయి కీలక నిర్ణయం తీసుకున్నారు.

బస్సులను తుక్కు కింద విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం ఆర్థిక సమస్యలకు అద్దం పడుతోంది. కేరళకు చెందిన రాయ్‌సన్ జోసెఫ్ టూరిజానికి సంబంధి వ్యాపారం చేస్తున్నారు. ఆయన వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు 20 వరకు ఉండేవి. కరోనా సమయంలో నిబంధనల కారణంగా ట్రావెల్స్ రంగానికి భారీ షాక్ తగిలింది. భారీగా నష్టపోయిన జోసెఫ్ ఇక బస్సులను భరించడం తన వల్ల కాదని ఇదివరకే 10 బస్సులను తుక్కు కింద విక్రయించాడు. కేవలం కేజీ రూ.45 చొప్పున తుక్కు కింద ట్రావెల్స్ బస్సులను అమ్మేశారు.

కోచి కేంద్రంగా రాయ్ అనే పేరుతో ట్రావెల్స్ సేవలు అందించేవారు. కానీ కరోనా వ్యాప్తి తరువాత పరిస్థితి పూర్తిగా మారిపోయిందని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా తగ్గుముఖం పట్టిన తరువాత కోవిడ్ నిబంధనలతో బస్సులను నడిపినా అసలు పెట్టుబడి కూడా చేతికి రాకపోవడంతో బస్సులను స్క్రాప్ చేసి విక్రయిస్తున్నాడు. గత ఏడాది కరోనా వ్యాప్తి తగ్గిన అనంతరం టూరిజం మళ్లీ పుంజుకుని నష్టాలు పూడ్చుకోవచ్చునని భావించిన ఎంతో మంది ఈ రంగాన్ని నమ్ముకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురైంది. అందులో రాయ్ సన్ జోసెఫ్ ఒకరు.

తన వద్ద ఉన్న మిగతా బస్సులను సైతం కేజీ రూ.45కు విక్రయించాలని నిర్ణయం తీసుకున్నారని కాంట్రాక్ట్ క్యారేజ్ ఆపరేషన్స్ అసోసియేషన్ కేరళ (Contract Carriage Operators Association Kerala) తెలిపింది. ట్రావెల్స్ నిర్వహిస్తున్న చాలా మంది పరిస్థితి ఇలాగే ఉందని, వేల సంఖ్యలో బస్సులు తగ్గిపోయాయని పేర్కొంది. బస్సులకు సంబంధించి లోన్లు తిరిగి చెల్లించడానికి కొన్ని బస్సులను ఇదివరకే బ్యాంకులు, కంపెనీలు సీజ్ చేశాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు దిక్కు తోచని పరిస్థితుల్లో మిగతా బస్సులను కూడా స్క్రాప్ చేసి తుక్కు కింద విక్రయిస్తున్నారు. తన వద్ద పనిచేసే ఉద్యోగుల పరిస్థితి కూడా దారుణంగా ఉందని, కానీ ఇక ఈ బస్సులను నడిపే అవకాశం లేదని వాపోయారు.

రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బస్సుకు రూ.40 వేల వరకు పన్నులు చెల్లించేవాడ్ని. పన్నులు, ఇన్సురెన్స్, ఇంధనం ఇలా మొత్తం ఒక్కో బస్సుకు రూ.80 వేలు చెల్లించాను. కానీ అధికారులు ఏదో ఓ కారణం చూపించి నా బస్సులను నిలిపివేస్తున్నారు. అందుకే బస్సులను అమ్మక తప్పడం లేదన్నారు. 

Also Read: Bank Fraud Cases India: బ్యాంకులకు రూ.22వేల కోట్ల షాక్‌ - దేశంలో అతిపెద్ద బ్యాంకు మోసాలివి!

Also Read: Anantapur Love Story: ఈ మట్టిని తాకితే ప్రేమ సక్సెస్, భగ్న ప్రేమికుల యథార్థగాథ మీకు తెలుసా ?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Madhya Pradesh Dhar Gang Arrest | 55కేసులున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన అనంత పోలీసులు | ABP DesamBaduguvani Lanka Nurseries | గోదావరి తీరంలో ఈ ఊరి పూలతోటల అందాలు చూశారా | ABP DesamElon Musk MARS Square Structure | మార్స్ మీదకు ఆస్ట్రోనాట్స్ ను పంపాలనంటున్న మస్క్ | ABP DesamKiran Royal Janasena Issue | వివాదంలో చిక్కుకున్న తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Ghee Adulteration: తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
తిరుమలలో నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం, సీబీఐ అదుపులో నలుగురు నిందితులు
Harish Rao: బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
బోగస్‌గా మారిన సన్న వడ్లకు బోనస్ హామీ, త్వరగా తేల్చండి - సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ
Megastar Chiranjeevi: ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
ప్రజారాజ్యమే జనసేనగా మారింది... పవన్‌ను చూస్తే గర్వమే - విశ్వక్ జెండా పాతాల్సిందే - మెగాస్టార్ పొలిటికల్ కామెంట్స్‌
Cuttack Odi Result Update: వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో రోహిత్ వీరవిహారం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
వన్డే సిరీస్ భారత్ దే.. మెరుపు సెంచరీతో హిట్ మ్యాన్ హుకుం.. 4 వికెట్లతో ఇంగ్లాండ్ చిత్తు
Palnadu Road Accident: పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
పల్నాడులో ట్రాక్టర్ ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
Mollywood Strike: డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
డిజాస్టర్ సినిమాలు 176, నష్టాలు 100 కోట్లు, హీరోలకు భారీ రెమ్యూనరేషన్లు... మాలీవుడ్‌లో స్ట్రైక్ ఎందుకు జరుగుతుందో తెలుసా?
CM Revanth Reddy: వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాదు, ప్రధాని మోదీ అసలే అజెండా అదే: దక్షిణాది రాష్ట్రాలు చేతులు కలపాలన్న రేవంత్ రెడ్డి
Ramachandra Yadav: కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
కేంద్ర మంత్రి అమిత్ షాని కలిసిన రామచంద్ర యాదవ్- తెరపైకి మరో భారతరత్న డిమాండ్
Embed widget