అన్వేషించండి

Kargil Vijay Diwas 2025 :కార్గిల్ విజయ్ దివస్ శత్రువులపై భారత్ వీరోచిత విజయం! వీర సైనికుల త్యాగాల గాథ!

Kargil Vijay Diwas 2025 : పాకిస్తాన్ సైనికుల చొరబాటుతో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది. పాక్ 'ఆపరేషన్ బదర్' ద్వారా సైనికులను పంపింది.

Kargil Vijay Diwas 2025 : కార్గిల్ మంచు శిఖరాలపై దాదాపు రెండు నెలల పాటు జరిగిన యుద్ధం తర్వాత, భారత సైన్యం పాకిస్తాన్‌పై విజయం సాధించిన రోజే ఈ రోజు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జులై 26న భారతదేశం కార్గిల్ విజయ్ దివస్ ను జరుపుకుంటుంది. కార్గిల్ యుద్ధంలో తమ ప్రాణాలను అర్పించిన సైనికులకు నివాళులర్పిస్తుంది. కెప్టెన్ మనోజ్ కుమార్ పాండే, కెప్టెన్ విక్రమ్ బాత్రా, కెప్టెన్ అమోల్ కలియా, లెఫ్టినెంట్ బల్వాన్ సింగ్ నుంచి గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్,  నాయక్ దిగేంద్ర కుమార్ వరకు దేశం మరచిపోలేని కార్గిల్ 'హీరోలు' చాలా మంది ఉన్నారు.

ఈ యుద్ధం 1999 మే నుంచి జులై వరకు జరిగింది. 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న బటాలిక్, కార్గిల్, లేహ్, బాల్టిస్థాన్ మధ్య వ్యూహాత్మక స్థానం ఈ కార్గిల్ యుద్ధానికి కేంద్ర బిందువుగా ఉంది. కార్గిల్ యుద్ధ సమయంలో బటాలిక్ ప్రధాన యుద్ధ ప్రాంతాలలో ఒకటి. 

శత్రువులతో పోరాడటంతో పాటు, సైనికులు దుర్భరమైన భూభాగాలలో, ఎత్తులో కూడా ఫైట్ చేయాల్సి వచ్చింది. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' కింద పాకిస్తానీ చొరబాటుదారుల నుంచి కార్గిల్ వ్యూహాత్మక ప్రాంతాలను తిరిగి పొందింది. ఈ యుద్ధం భారత సాయుధ దళాల రాజకీయ దృఢత్వం, సైనిక నైపుణ్యం, దౌత్యపరమైన సమతుల్యతకు చిహ్నంగా పరిగణిస్తారు. 

పాకిస్తానీ సైనికుల చొరబాటుతో కార్గిల్ యుద్ధం ప్రారంభం

పాకిస్తాన్ దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తోంది. 1990లలో పాకిస్తాన్ ఉగ్రవాదుల సహాయంతో జమ్మూ కాశ్మీర్‌ను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించింది. కొన్ని సంవత్సరాల తరువాత, 1999 కార్గిల్ యుద్ధం పాకిస్తాన్ కుట్రలలో భాగమైంది. కానీ భారతదేశ సైనిక వీరులు పాకిస్తానీ ఎత్తులను చిత్తు చేశారు. వారినికి మరో పరాజయం మిగిల్చారు. 

పోరాటం పాకిస్తానీ సైనికుల చొరబాటుతో ప్రారంభమైంది, 'ఆపరేషన్ బద్ర్' కింద పాకిస్తాన్ రహస్యంగా కార్గిల్ ప్రాంతంలో నియంత్రణ రేఖను దాటి తన సైనికులను, ఉగ్రవాదులను పంపింది. భారత సైన్యం 1999 మే మొదటి వారంలోనే చొరబాటును గుర్తించింది. కెప్టెన్ సౌరభ్ కలియాతో సహా 5 మంది భారతీయ సైనికులను పాకిస్తానీ సైన్యం పట్టుకుని దారుణంగా హింసించి చంపింది. ఇది శవపరీక్ష నివేదిక ద్వారా వెల్లడైంది. మే 9న పాకిస్తానీలు భారీ షెల్లింగ్ ప్రారంభించారు. ఇది చొరబాటుదారులు నియంత్రణ రేఖ వెంబడి భారత భూభాగంలోకి ప్రవేశించడానికి కవర్ ఫైర్‌గా ఉంది. ద్రాస్, ముష్కోహ్, కాక్సర్ సెక్టార్లలో చొరబాటు జరిగింది.

భారత సైన్యం మే మధ్యలో కాశ్మీర్ లోయ నుంచి తన సైనికులను కార్గిల్ సెక్టార్‌కు తరలించింది. మే చివరిలో భారత వైమానిక దళం ఈ యుద్ధంలోకి ప్రవేశించింది. రెండు వైపుల నుంచి భీకర పోరాటం కొనసాగింది. జూన్ ప్రారంభంలో, భారత సైన్యం పాకిస్తానీ సైన్యం ప్రమేయాన్ని ధృవీకరించే పత్రాలు విడుదల చేసింది. చొరబాటును కాశ్మీరీ "స్వాతంత్ర్య యోధులు" చేశారనే పాకిస్తాన్ వాదనను తోసిపుచ్చింది.

శిఖరాలపై ఎగిరిన త్రివర్ణ పతాకం

దృఢ సంకల్పంతో ఉన్న భారత సైన్యం అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ సైన్యాన్ని చుట్టుముట్టి వారిని తరిమి కొట్టింది. అనేక స్థావరాలు, చెక్ పోస్టులను స్వాధీనం చేసుకుంది. సైనికులు పర్వత ప్రాంతాలు, ఎత్తు, తీవ్రమైన చలి వాతావరణం వంటి ప్రతికూల పరిస్థితుల్లో ధైర్యంగా పోరాడారు. భీకర పోరాటంలో, జూన్ 13న తోలోలింగ్ శిఖరం భారత సైన్యం వశమైంది. కార్గిల్ యుద్ధంలో ఇది మొదటి గొప్ప విజయం. ఇది యుద్ధానికి మలుపు తిప్పింది. జూలై 4న, భారత సైన్యం 11 గంటల పాటు జరిగిన పోరాటం తర్వాత టైగర్ హిల్ స్వాధీనం చేసుకుంది. మరుసటి రోజు, భారతదేశం ద్రాస్‌ను స్వాధీనం చేసుకుంది. ఇలా అడుగడుగునా గొప్ప విజయాలు సాధించింది. 

ఇక్కడ సైన్యంతోపాటు భారత వైమానిక దళం సంయుక్త ఆపరేషన్ నిర్వహిస్తోంది, దీనికి 'ఆపరేషన్ సఫేద్ సాగర్' అని పేరు పెట్టారు. ఈ ఆపరేషన్ కార్గిల్ మంచు శిఖరాలపై కూర్చున్న శత్రువుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసింది. ఈ యుద్ధంలో మరో విజయం జూన్‌ 20న లభించింది, లెఫ్టినెంట్ కల్నల్ యోగేష్ కుమార్ జోషి నేతృత్వంలోని భారత సైన్యం ఈ పాయింట్‌ను స్వాధీనం చేసుకోవడంలో విజయం సాధించింది. 

తరువాత, భారత సైన్యం 'త్రీ పింపుల్స్' ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. 'త్రీ పింపుల్స్' ప్రాంతంలో నాల్, బ్లాక్ రాక్ హిల్, త్రీ పింపుల్స్ ఉన్నాయి, వీటిని జూన్ 29న సైన్యం స్వాధీనం చేసుకుంది. జూలై ప్రారంభంలో నిర్ణయాత్మక స్థితికి చేరుకుంటున్న యుద్ధంలో 'టైగర్ హిల్' భారతదేశం వశమైంది. జూలై 4న భారత సైన్యం ఇక్కడ జెండాను ఎగురవేసింది.

పాకిస్తాన్‌ను మోకాలిపై కూర్చోబెట్టింది 
సైన్యం తదుపరి ముఖ్యమైన లక్ష్యం పాయింట్ 4875 ను స్వాధీనం చేసుకోవడం. జూలై 4 నుంచి 7 వరకు పాయింట్ 4875 కోసం యుద్ధం జరిగింది. ఈ ముఖ్యమైన సైనిక చర్యలో భారతదేశం విజయం సాధించింది. పాయింట్ 4875 ను స్వాధీనం చేసుకోవడంతో, భారతదేశం కార్గిల్ ప్రధాన శిఖరాలను జయించింది, ఇక్కడ నుంచి పాకిస్తాన్‌కు ముందుకెళ్లేందుకు వీలు కాలేదు.  

పాకిస్తాన్‌ను మోకాలిపై కూర్చోబెట్టింది. అయితే, భారత సైన్యం ఆగలేదు. ఒక చిన్న పోరాటం తరువాత, సైన్యం పాయింట్ 4700 ను స్వాధీనం చేసుకుంది. దీనితో పాకిస్తాన్ మనోస్థైర్యం పూర్తిగా దెబ్బతింది. బలవంతంగా జూలై 25న పాకిస్తాన్ వెనక్కి తగ్గవలసి వచ్చింది. జూలై 26న కార్గిల్‌లో ఈ యుద్ధం అధికారికంగా ముగిసింది, ఇందులో భారతదేశం విజయం సాధించింది.

భారతదేశం ఈ యుద్ధంలో తన 527 మంది వీర సైనికులను కోల్పోయింది. 1363 మంది సైనికులు గాయపడ్డారు. వారి జ్ఞాపకార్థం, జూలై 26న భారతదేశం కార్గిల్ విజయాన్ని విజయ్ దివస్‌గా జరుపుకుంటుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget