అన్వేషించండి

Kargil Vijay Diwas 2022: మంచు కొండల్లో పాక్‌పై మరపురాని గెలుపు- భారత్ పరాక్రమానికి ప్రపంచం ఫిదా!

Kargil Vijay Diwas 2022: కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను భారత్ మట్టికరిపించిన విధానం తలచుకుంటే మన గుండెలు గర్వంతో ఉప్పొంగుతాయి.

Kargil Vijay Diwas 2022: కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటోంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ.. కార్గిల్ వీరుల త్యాగాలను, శౌర్య పరాక్రమాలను గుర్తు చేసుకున్నారు. అయితే అసలు కార్గిల్ యుద్ధంలో భారత సైనికుల వీర పరాక్రమాల గురించి ఓసారి తెలుసుకుందాం.

భారత సైన్యం చరిత్రలోనే కార్గిల్​ యుద్ధం ఓ మైలురాయి. మన సత్తా ఏమిటో ప్రపంచానికి చాటి చెప్పిన యుద్ధమది. ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని నిల్చొనేలా చేసింది.

2 నెలల పాటు

సరిహద్దు రేఖ వెంబడి జమ్ముకశ్మీర్​లోని కార్గిల్​లో దాయాది పాక్​తో 1999 మే 3న ప్రారంభమైన యుద్ధం 2 నెలల 23 రోజుల పాటు సాగి జులై 26తో ముగిసింది. అదే రోజు పాక్​ అక్రమ చొరబాటుదారులను పూర్తిగా తరిమికొట్టినట్లు భారత సైన్యం ప్రకటించింది. గొప్ప విజయానికి ప్రతీకగా ఏటా జులై 26న కార్గిల్​ దివస్​గా జరుపుకుంటాం. దీనినే 'ఆపరేషన్​ విజయ్'​గానూ పిలుచుకుంటారు.

కార్గిల్​ సమయంలో అటల్​ బిహారీ వాజ్​పేయీ భారత ప్రధానిగా ఉన్నారు. నవాజ్​ షరీఫ్​ పాకిస్థాన్​ ప్రధాని. నియంత, మాజీ పీఎం పర్వేజ్​ ముషారఫ్​ అప్పటి పాక్​ సైన్యాధిపతి.

భారత జవాన్లు శత్రుమూకలను నియంత్రణ రేఖ నుంచి అవతలకు తరిమే వరకూ అలుపన్నదే లేకుండా పోరాడారు. అయితే యుద్ధ క్షేత్రంలోనే కాకుండా.. దౌత్యపరంగానూ పాక్‌ను మట్టికరిపించింది భారత్. అంతర్జాతీయ సమాజం ముందు పాక్ ఆగడాలను బట్టబయలు చేసింది. సైనిక శక్తి పరంగానే కాక దౌత్యపరంగానూ భారత్‌ ఎంత బలమైనదో పాక్‌కు ప్రత్యక్షంగా రుచి చూపించింది కార్గిల్‌ యుద్ధం.

యుద్ధంలోనూ న్యాయం

కార్గిల్‌ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్‌ సాధించిన విజయం అనేక కోణాల్లో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నాటి యుద్ధం భారత సైన్యం సత్తాను ప్రపంచానికి చాటడమే కాదు.. దౌత్య వ్యూహాల పదునును కూడా తెలియజేసింది. అంతేకాకుండా అంత యుద్ధం జరిగినా, చివరకు భారీ విజయం లభించినా.. భారత సేనలు సరిహదుల్లో ఎక్కడా నియంత్రణరేఖ దాటకపోవటం చూసి ప్రపంచ దేశాలే ఆశ్చర్యపోయాయి. ఆ విషయంలో దిల్లీ నిర్ణయం అంతర్జాతీయంగా అనేక దేశాల అభిప్రాయాన్ని భారత్‌కు సానుకూలంగా మార్చింది.

దౌత్య పరంగా

దాయాది దేశం సిమ్లా ఒప్పందాన్ని తుంగలోకి తొక్కిందని భారత్‌ ప్రపంచదేశాలకు స్పష్టంగా తెలియజేసింది. చొరబాట్లకు పాల్పడింది ఉగ్రవాదులు కాదు.. ఆ ముసుగులో వచ్చింది.. పాకిస్థాన్‌ సైన్యమే అని ఆధారాలు చూపించింది. అన్నింటికి మించి.. అణుపరీక్షలతో ఆంక్షలు ఎదుర్కొంటున్న సమయంలోనూ... అంతపెద్ద యుద్ధంలో ఎక్కడా అణు కవ్వింపులు లేకుండా.. మన సంయమనం స్థాయి నిరూపించుకున్నామని.. " ఇండియాస్‌ మిలటరీ కాన్‌ఫ్లిక్ట్స్‌ అండ్ డిప్లమసీ" అనే పుస్తకంలో ఈ వివరాలన్నీ సమగ్రంగా పేర్కొన్నారు నాటి సైన్యాధిపతి జనరల్‌ వీపీ మాలిక్.

దిల్లీ చూపించిన సాక్ష్యాధారాలతో పాక్‌ సంప్రదాయ మద్దతుదారు ఓఐసీ(ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్).. కూడా భారత్‌కు వ్యతిరేకంగా నిలిచేందుకు ఇష్టపడలేదు. ఈ పరిణామాలతో భారత్‌ రణక్షేత్రంలోనే కాక వ్యూహాత్మక విధానాల్లోనూ పాక్‌పై పైచేయి సాధించింది. పాక్‌ ప్రధానిపై తీవ్ర ఒత్తిడి పడింది.

దీంతో పాక్‌ సైన్యంలో నిస్సత్తువ అలుముకుంది. చివరకు పాక్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. ఫలితంగా అంతర్జాతీయ సమాజం ముందు ఆ దేశం దోషిగా నిలబడింది. ఉగ్రదేశంగా ముద్ర వేయించుకుంది. దౌత్యపరంగా కోలుకోలేని దెబ్బతింది.

Also Read: Rahul Gandhi Detained: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్ట్

Also Read: Gujarat Hooch Tragedy: కల్తీ మద్యం తాగి 21 మంది మృతి- 40 మంది పరిస్థితి విషమం!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి

వీడియోలు

India vs Pakistan U19 Asia Cup Final | అండర్ 19 ఆసియా కప్ విజేతగా పాకిస్తాన్
Vaibhav Suryavanshi Shoe Gesture | వివాదంలో వైభవ్ సూర్యవంశీ
Smriti Mandhana Record Ind vs SL | టీ20ల్లో స్మృతి 4 వేల పరుగులు పూర్తి
India vs Sri Lanka T20 Highlights | శ్రీలంకపై భారత్ ఘన విజయం
రైల్వే శాఖ న్యూ ఇయర్ గిఫ్ట్.. కొవ్వూరులో ఆగనున్న ఇకపై ఆ 2 ఎక్స్ ప్రెస్‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Phone Tapping case: ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
ఫోన్ టాపింగ్ కేసు.. ఐఏఎస్ లతో పాటు ఐపీఎస్‌లను మరోసారి విచారించిన సిట్
Uttam Kumar Reddy: కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీ కూలిపోవడానికి కారణం కేసీఆర్.. ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్
Champion OTT : 'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
'ఛాంపియన్' ఓటీటీ డీల్ ఫిక్స్ - బడ్జెట్ To నాన్ థియేట్రికల్ బిజినెస్ వరకూ...
iphone 15 Discount: ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
ఐఫోన్ 15 మరింత చౌకగా, ఇక్కడ భారీ తగ్గింపు.. రూ.40 వేలలోపే కొనేయండి
Balakrishna : యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
యంగ్ లుక్‌లో బాలయ్య? - హిస్టారికల్ డ్రామా 'NBK111' కోసం క్రేజీ టైటిల్
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
ఈ PPF పథకంలో చేరితే, రూ.4 వేల పెట్టుబడితో లక్షల కార్పస్ మీ సొంతం
6 అడుగుల ఆజానుబాహులకు బెస్ట్‌ ఆప్షన్లు - కంఫర్ట్‌తో పాటు రైడింగ్‌ ఫన్‌ ఇచ్చే మోటార్‌సైకిళ్లు!
6 అడుగులకు పైగా ఎత్తున్న 30+ ఏజ్‌ వాళ్లకు బెస్ట్‌ బైక్‌లు - సిటీ రోడ్లకు చక్కగా సరిపోతాయి!
Bigg Boss 9 Telugu Winner: జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
జవాన్‌కు జై కొట్టిన ఆడియన్స్... బీబీ9 ట్రోఫీ కామనర్ కళ్యాణ్‌దే... తనూజకు దెబ్బేసిన బ్యాడ్ సెంటిమెంట్
Embed widget