అన్వేషించండి

ISIS: ఐసిస్ భారీ ప్లాన్, బీజేపీ నేతల హత్యలకు కుట్ర

ISIS Target BJP Leaders: ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) బీజేపీ (BJP) నేతల హత్యలకు భారీ ప్లాన్ చేసింది. ఆ పార్టీ కార్యాలయాలపై దాడుల చేసి నేతలను హతమార్చేందుకు వ్యూహ రచన చేసింది. 

ISIS Target BJP Offices: ఉగ్రవాద సంస్థ ఐసిస్ (ISIS) బీజేపీ (BJP) నేతల హత్యలకు భారీ ప్లాన్ చేసింది. ఆ పార్టీ కార్యాలయాలపై దాడుల చేసి నేతలను హతమార్చేందుకు వ్యూహ రచన చేసింది. మహారాష్ట్రలోని సంభాజీ నగర్, ఇతర జిల్లాల్లోని బీజేపీ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకోవడంతో పాటు పలువురు హిందూ రాజకీయ నేతలను హతమార్చేందుకు పథకం రచించింది. ఉగ్రవాద పేలుళ్లు, హత్యలు చేసేందుకు తుపాకులు, మందుగుండు సామగ్రి, సిమ్ కార్డ్‌లను ఐసిస్ ఇండియాలోని తన స్లీపర్ సెల్‌కు అందించింది. 

రెండు టెలిగ్రామ్ ఛానెళ్లు
ఇటీవల ఎన్‌ఐఏ (NIA) అరెస్ట్ చేసిన ఉగ్రవాద నిందితుడు మహ్మద్ జోహెబ్ ఖాన్ (Mohammad Zoheb Khan) ఈ విషయాలను వెల్లడించాడు. బీజేపీ కార్యాలయాలు, నేతల హత్య కోసం ఐసిస్‌కు చెందిన అబూ అహ్మద్ ( Abu Ahmed) తనతో ‘అనస్-అల్-హిందీ’(Anas-Al-Hindi), ‘అనన్-అల్-హిందీ’ (Anan-Al-Hindi) పేరుతో టెలిగ్రామ్ లింక్‌లను షేర్ చేశారని మహ్మద్ జోహెబ్ ఖాన్ తెలిపారు. ఐసిస్ స్లీపర్ సెల్‌ను సంప్రదించడానికి, తుపాకులు, మందుగుండు, సిమ్ కార్డుల కోసం ఉపయోగించే వారని జోహెబ్ వెల్లడించాడు. ఇందుకోసం ‘సమన్ చాహియే’ అనే కోడ్ వాడేవారని తెలిపాడు.

‘సమన్ చాహియే’
జోహెబ్ వారి సూచనల మేరకు రెండు టెలిగ్రామ్ ఐడీలను సంప్రదించి ‘సమన్ చాహియే’ (Saman Chahiye) అని మెస్సేజ్ చేశాడు. వెంటనే.. సరకు త్వరలో డెలివరీ చేయబడుతుందని సమాధానం వచ్చింది. జోహెబ్ తెలిపిన వివరాల ప్రకారం.. రెండు టెలిగ్రామ్ ఐడీలతో మొదటి, చివరి మెస్సేజ్ అదే. ఆ తరువాత అతను వారికి ఎటువంటి మెస్సేజ్‌లు చేయలేదు.

బీజేపీ నేతలపై నిఘా పెట్టాలని ఆదేశాలు
ఐసిస్ హ్యాండ్లర్ సూచనల మేరకు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కోసం టెలిగ్రామ్ టెలిగ్రామ్ లింకులను సంప్రదించానని జోహెబ్ ఖాన్ వెల్లడించాడు. వారిని వ్యక్తిగతంగా కలవలేదని, కేవలం బీజేపీ కార్యాలయాలు, నాయకుల కదలికలను పరిశీలించే పని అప్పగించారని చెప్పాడు. దీంతో ఎన్‌ఐఏ గత ఏడాది కాలంలో శంభాజీ నగర్ వెలుపల జోహెబ్ కదలికలను గుర్తించే డేటా విశ్లేషణలో నిమగ్నమై ఉంది.

విశ్వసనీయ సమాచారం మేరకు.. జోహెబ్ ఒక టెర్రర్ ఆపరేషన్‌‌లో కీలకంగా ఉన్నాడని, ఉగ్రదాడులు జరగకుండా ఉండేందుకు ఏజెన్సీ అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. అలాగే ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమకూర్చే అల్ హిందీ మాడ్యూల్ స్లీపర్ సెల్ సభ్యులను గుర్తించే పనిలో ఉంది. 

ఐసిస్‌కు విధేయతా ప్రమాణం
జోహెబ్ ఖాన్‌కు 2021 నుంచి ఐసిస్ హ్యాండ్లర్ అబూ అహ్మద్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. జోహెబ్ భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి వీడియో కాల్ ద్వారా ఐసిస్ ఖలీఫా అబూ-హఫ్స్‌కు బయాహ్ (విధేయత ప్రమాణం) చేశాడు. అబూ హాఫ్స్ 3 ఆగస్టు 2023న ఐసిస్ నాయకత్వాన్ని స్వీకరించాడు. బయాత్ తర్వాత భార్య, పిల్లలతో సిరియాకు వలస వెళ్లాలని అనుకున్నానని, అయితే తన భార్య అందుకు నిరాకరించిందని జోహెబ్ వెల్లడించాడు. 

సోషల్ మీడియా అకౌంట్లతో ఎర
ఐసిస్ హ్యాండ్లర్ అబూ అహ్మద్ సూచనల మేరకు జోహెబ్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియను ప్రారంభించాడు. ఐసిస్ కోసం వ్యక్తులను నియమించడం, నిఘా కార్యకలాపాల కోసం ఫుట్ సైనికులను ఏర్పాటు చేయడం, నిధుల సేకరణ, పేలుళ్లు, హత్యల ప్రణాళికలను చేసే పనిని అప్పగించాడని జోహెబ్ విచారణలో వెల్లడించాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అనేక ప్రొఫైల్‌లను సృష్టించి యువతను ఐసిస్‌లో చేరడానికి ప్రేరేపించాడు.

ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య
జోహెబ్ చేస్తున్న పనికి సహకరించడానికి అతని భార్య నిరాకరించింది. పిల్లలను తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో జోహెబ్ సిరియా వెళ్లడానికి నిధుల సేకరణ చేయడం ప్రారంభించాడు. ఇందుకోసం అతను భారత్ నుంచి అఫ్ఘనిస్తాన్‌కు వెళ్లాలని ప్లాన్ చేశాడు. సిరియా వెళ్లే ముందు ఆఫ్ఘనిస్తాన్‌లోని తన హ్యాండ్లర్‌ను కలవాలని అనుకున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Independence Day 2026 : స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
స్వాతంత్య్ర దినోత్సవం 2026 చరిత్ర, ప్రాముఖ్యత.. ఆగస్టు 15నే ఎందుకు జరుపుకుంటామంటే
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Kerala Influencer Akhil Megha: కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!
కేరళం సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ జంటకు దిష్టి తగిలేసిందా? బస్సు క్లీనర్‌తో భార్య పరార్‌! బోరుమంటున్న భర్త!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL Test Series: గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
గాయంతో టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. లంక టెస్ట్ సిరీస్ నుంచి మ‌రో ఆల్‌రౌండర్ అవుట్!
Sridhar Babu: బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
బీఆర్ఎస్ హయాంలోనే తక్కువ ధర! భూ కేటాయింపుల ఆరోపణలపై కేటీఆర్‌కు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్
Free NEET Coaching: నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
నీట్ ఫ్రీ లాంగ్ టర్మ్ కోచింగ్.. అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించిన TGSWREIS
Indias Top 10 Business Families: భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
భారత్‌లో టాప్ 10 రిచెస్ట్ ఫ్యామిలీస్ సంపద విలువ ఎంత.. ఆ మొత్తంతో ఎన్ని పనులు చేయవచ్చు
Bigg Boss Agnipariksha: 'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
'బిగ్ బాస్'లో డర్టీ పాలిటిక్స్... అగ్నిపరీక్ష సెలక్షన్స్‌లో మోసం జరిగిందా?
Ayyanna Patrudu: వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
వారికి ఎమ్మెల్యే పదవి ఎందుకు? అసెంబ్లీకి రాకుంటే అనర్హత వేటు వేయాలి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
Adilabad Crime News: ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
ఆదిలాబాద్, మహారాష్ట్రలో టూవీలర్స్ మాయం.. అంతర్రాష్ట్ర గ్యాంగ్ అరెస్ట్, 44 బైక్స్ స్వాధీనం
Cases Against YSRCP Leaders: గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
గుంటూరు, కోనసీమ జిల్లాల్లో అంబటి రాంబాబు, పినిపె విశ్వరూప్ సహా వైసీపీ నేతలపై కేసులు నమోదు
Embed widget