By: ABP Desam | Updated at : 13 Jan 2022 10:10 AM (IST)
దేశంలో పెరిగిన కరోనా కేసులు
రికార్డు స్థాయిలో దేశంలో కరోనా కేసులు సంఖ్య పెరిగింది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో రెండు లక్షల నలభై ఏడు వేల నాలుగు వందల పదిహేడు కేసులు నమోదయ్యాయి. రోజు వారి పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. ఆ పాజిటివిటీ రేటు 13.11 శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.
గత ఇరవై నాలుగు గంటల కేసులతో పోలిస్తే ఈ సంఖ్య ఇరవై ఏడు శాతం పెరిగినట్టు. ఇది నిన్నటి కంటే సుమారు యాభై వేలు కేసులు ఎక్కువగా రిజిస్టర్ అయ్యాయి. ఈ సంఖ్య ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
మే 26 తర్వాత ఈ స్థాయిలో కేసులు పెరగడం ఇదే మొదటి సారి. ఇప్పటి వరకు ఒక్కరోజులో ఈ స్థాయిలో కేసులు పెరిగింది లేదు. 2021 ఏప్రిల్ 27న అంతకు ముందు రోజు కంటే 43,196 కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఇప్పటి వరకు ఇదే అత్యధికంగా ఉండేది ఇప్పుడు మాత్రం ఆ రికార్డును బ్రేక్ చేసి ఏకంగా యాభై వేలు పెరిగాయి. ఇదే ఆందోళన కలిగించే అంశం.
బుధవారం ఒక్కరోజు 203 మంది చనిపోయారు. అక్టోబర్ 27 తర్వాత చనిపోయిన వారి సంఖ్య పెరగడం కూడా ఇదే ఎక్కువ.
ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ సాయంత్రం ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు.
Also Read: Covid 19 Lockdown: ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ.. లాక్డౌన్ విధిస్తారా?
2024లో జమిలి ఎన్నికలు లేనట్టే, నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్
Breaking News Live Telugu Updates: ఇన్నర్ రింగ్రోడ్డు కేసులో చంద్రబాబు విచారణ వాయిదా
మహిళా రిజర్వేషన్ బిల్కి రాష్ట్రపతి ఆమోదం, ఇక అమలు చేయడమే తరువాయి
బీజేపీ ఎంపీ మనేకా గాంధీపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేసిన ఇస్కాన్
I.N.D.I.A కూటమికే మా ఫుల్ సపోర్ట్, సీట్ షేరింగ్పైనా త్వరలోనే క్లారిటీ - కేజ్రీవాల్
CM Jagan: ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ప్రారంభించిన సీఎం - దీంతో ప్రయోజనాలు ఇవే
Komatireddy Venkat Reddy: చంద్రబాబు కేసుల వార్తలు వస్తే టీవీ బంద్ చేస్తా, ఎంపీ కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
TDP News : అధికార మత్తు వదిలేలా మోత మోగిద్దాం - కొత్త ఆన్ లైన్ ప్రచార ఉద్యమాన్ని ప్రకటించిన టీడీపీ !
/body>