అన్వేషించండి

Indians In Iran: భారతీయులు తక్షణమే ఇరాన్‌ను వదిలివెళ్లండి.. విదేశాంగశాఖ హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల

India MEA advisory: ఇరాన్ లోని భారతీయులు వెంటనే విమానాలతో సహా అందుబాటులో ఉన్న రవాణా మార్గాల ద్వారా దేశం విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ అడ్వైజరీ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: ఇరాన్‌లో జరుగుతున్న నిరసనల వేళ, భారత ప్రభుత్వం తన పౌరులు ఇరాన్ వదిలి వెళ్లాలని మరో సలహా జారీ చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తన అడ్వైజరీలో ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, యాత్రికులు, వ్యాపారులు, పర్యాటకులను వీలైనంత త్వరగా ఇరాన్ నుండి బయలుదేరాలని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇరాన్‌కు ప్రయాణాలు చేయవద్దని సూచించింది. గత 10 రోజుల్లో ఇరాన్ గురించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ జారీ చేసిన రెండవ అడ్వైజరీ నోట్ ఇది.

భారత పౌరులు ఇరాన్ వదిలి వెళ్ళాలి: విదేశాంగ మంత్రిత్వ శాఖ

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలా పేర్కొంది. 'ఇరాన్‌లో ఉన్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిరసనలు లేదా ర్యాలీలు జరిగే ప్రాంతాలకు వెళ్ళకుండా ఉండాలి. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలి. ఏదైనా తాజా సమాచారం కోసం స్థానిక మీడియాను గమనించాలి. వార్తలు తెలుసుకోవాలని’ సూచించింది. భారత పౌరులను వాణిజ్య విమానాలు, అక్కడ అందుబాటులో ఉన్న ఏదైనా రవాణా సౌకర్యాల ద్వారా ఇరాన్ వదిలి వెళ్లాలని సలహా ఇచ్చారు.

భారత రాయబార కార్యాలయం అత్యవసర నంబర్లు విడుదల 

విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్‌లో నివసిస్తున్న భారతీయులు తమ ప్రయాణ, ఇమ్మిగ్రేషన్ పత్రాలను, పాస్‌పోర్ట్‌లు, IDలతో సహా సిద్ధంగా ఉంచుకోవాలని కోరింది. ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర సంప్రదింపుల హెల్ప్‌లైన్ నంబర్‌లను +989128109115; +989128109109; +989128109102; +989932179359 సంప్రదించాలని సూచించింది. ఏదైనా అవసరం అయితే ఈమెయిల్ cons.tehrana mea.gov.in ద్వారా సంప్రదించాలని సూచించింది. 

భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోవడానికి లింక్ విడుదల 

విదేశాంగ మంత్రిత్వ శాఖ మాట్లాడుతూ.. 'ఇరాన్‌లో ఉన్న, భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోని భారతీయులు (https://www.meaers.com/request/home) లింక్‌ను సందర్శించి నమోదు చేసుకోవాలి. ఈ లింక్ రాయబార కార్యాలయ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉంది. ఇరాన్‌లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడటం వల్ల ఏ భారతీయుడైనా నమోదు చేసుకోలేకపోతే, దేశంలోని వారి కుటుంబ సభ్యులు నమోదు చేసుకోవాలని' సూచించారు. 

ఇరాన్‌లో పలు ప్రాంతాల్లో హింసాత్మక నిరసనలు జరుగుతున్న సమయంలో, అమెరికా దేశం ఇరాన్‌పై సైనిక చర్య తీసుకుంటామని బెదిరిస్తున్న సమయంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ సలహా జారీ చేసింది. జనవరి 13న ఒక రోజు ముందు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రజలను నిరసనలు కొనసాగించాలని సూచించారు. 'సహాయం మార్గంలో ఉంది' అంటే ఏమిటో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేయలేదు. ఇరాన్‌లో జరుగుతున్న నిరసనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీయడంతో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇరాన్ ప్రజలకు సాయం: ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ, 'ఇరాన్ దేశభక్తులు నిరసనలు కొనసాగించాలి. మీ ప్రభుత్వ సంస్థలను స్వాధీనం చేసుకోండి. హంతకులు, నియంతల పేర్లను భద్రపరచండి. వారు దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. నిరసనకారులను అకారణంగా చంపడం ఆగిపోయే వరకు నేను ఇరాన్ అధికారులతో అన్ని సమావేశాలను రద్దు చేశాను. దేశ ప్రజలకు సహాయం మార్గంలో ఉంది' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Indian Mango party San Francisco: అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
అమెరికాలో ఫ్రీ మ్యాంగో ఫెస్టివల్ పెట్టిన భారతీయులు - క్యూలో నిలబడి తిన్న అమెరికన్లు - వీడియోలు వైరల్
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ

వీడియోలు

AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్
Gujarat Titans Team Bus Catches Fire | గుజరాత్ టైటాన్స్ బస్సులో అగ్నిప్రమాదం
Krunal Pandya 5 Fingers Celebration | వైరల్ అవుతున్న కృనాల్ పాండ్యా సెలబ్రేషన్స్
Akash Chopra Comments on Shumban Gill | గిల్‌పై ఆకాశ్ చోప్రా సంచలన వ్యాఖ్యలు
Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Peddi Ticket Price Hike In Telangana:
Peddi Ticket Price Hike In Telangana: "పెద్ది"కి గుడ్ న్యూస్- తెలంగాణలో టికెట్‌ ధరలు పెంపు
Minister Ponnam Prabhakar counter to Pawan Kalyan: ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
ఔను.. తెలంగాణ మా అయ్యా జాగీరే.. నువ్వొచ్చి ఇక్కడ పీకేదేంది? పవన్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ సంచలన కౌంటర్!
TGPSC Recruitment 2026: తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
తెలంగాణ ఇంజినీరింగ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్‌! 290 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్! ఖాళీల పూర్తి వివరాలు ఇవే!
NHAI Toll Exemption List: టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
టోల్ ప్లాజాల వద్ద వీఐపీ కల్చర్ కు బ్రేక్: ప్రభుత్వ అధికారుల వాహనాలకు టోల్ మినహాయింపు రద్దు చేయనున్న కేంద్రం
AP DSC Sports Quota Controversy: ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
ఏపీ డీఎస్సీలో పేకాటలో నైపుణ్యం సాధించిన వారికి స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలిచ్చారా? - ఇవిగో సంచలన నిజాలు
Annamalai Resigns BJP Tamil Nadu: బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
బీజేపీకి సింగం అన్నామలై గుడ్‌బై! ఐదు పేజీల లేఖతో షాక్.. సొంత పార్టీతో ఉపఎన్నికల్లో పోటీ
Kanpur Petrol Pump Scam: ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
ట్యాంక్ 45 లీటర్ల కెపాసిటీ అయితే 52 లీటర్ల పెట్రోల్ కొట్టేశారట - ఆ కార్ ఓనర్‌కు అడ్డంగా దొరికిపోయిన బంకు శీను
Tamil Nadu Politics | రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?
రజనీ ఆశీస్సులతో అన్నామలై కొత్త పార్టీ?.. తమిళనాడులో రాజకీయ భూకంపానికి రంగం సిద్ధం!
Embed widget