అన్వేషించండి

Mobile Charger: ఇక అన్నింటికీ ఒకే ఛార్జర్‌, త్వరలోనే కేంద్రం న్యూ రూల్స్‌!

USB-C: ఒక్కో బ్రాండ్‌ ఫోన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్‌ పోర్ట్‌ ఉండటం మొబైల్‌ యూజర్లకు ఒక పెద్ద సమస్య ఈ విషయంలో కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

The Center Will Bring A New Rule Of One Charger For All Phones: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(e-waste)  విపరీతంగా పెరిగిపోతున్న వేళ... కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కామన్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ వైపుగా ప్రయాణిస్తున్న వేళ భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. 2026 నాటికి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో USB-C ఛార్జర్లు తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను జారీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఛార్జింగ్ సొల్యూషన్‌లను ప్రామాణీకరించడానికి... ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచం మొత్తం ఇప్పటికే సీ టైప్‌ ఛార్జర్ల వైపే అడుగులు వేసి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు తగ్గిస్తున్న వేళ భారత్‌ కూడా అదే విధానం అవలంభించేందుకు సిద్ధమైంది.

ఫోన్‌ ఛార్జర్లకు 2025 వరకే 
స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2025 జూన్ నాటికి USB-C కనెక్టర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనల్లో పొందిపరిచినట్లు తెలుస్తోంది. ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసే సంస్థలు వాటి ఛార్జింగ్‌ కోసం తప్పనిసరిగా USB-C పోర్ట్‌లను 2026 చివరి నాటికి అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్దేశించనుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది నుంచి USB-C కనెక్టివిటీని తప్పనిసరి చేస్తూ ఐరోపా సమాఖ్య నిబంధనలు రూపొందించింది. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లన్నీ యూనివర్సల్ ఛార్జింగ్ కేబుల్‌ని ఉపయోగిస్తాయని...దీనివల్ల ఛార్జర్‌లు, కేబుల్స్‌ను వినియోగించే సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఫోన్‌కు ఒక్కో రకమైన ఛార్జర్‌ అందుబాటులో ఉండడంతో చాలామంది వినియోగదారులకు ఛార్జింగ్‌ పెద్ద సమస్యగా మారుతోంది. అది కాకుండా  అన్ని ఫోన్లకు ఒకే ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉంటే ఎక్కువ ఛార్జర్ల సమస్య ఉండబోదని కేంద్రం వివరిస్తోంది. టాబ్లెట్‌లు, విండోస్ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఐ ప్యాడ్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లకు కూడా ఒకే రకమైన ఛార్డింగ్ పోర్ట్‌లను అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం నిబంధనలను రూపొందిస్తోంది.
 
వాచ్‌లకు కూడానా...
ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లతో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్‌ ఫీచర్‌ ఫోనల్‌కు కూడా ఒకేరకమైన టైప్‌ సీ ఛార్జర్‌లను అందుబాటులోకి తేవడంపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ... ఇప్పటికే పరిశ్రమల ప్రముఖులతో చర్చలు ముగిశాయని... దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిబంధనలను రూపొందిస్తోంది. బహుళ రకాల ఛార్జర్‌లు, కేబుల్‌ల ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులను ఈ నిర్ణయంతో తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ రక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని కేంద్రం తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి ఎలాంటి అవరోధాలు ఉండవని... పర్యావరణ అనుకూల భవిష్యత్తును భారత్‌ హామీ ఇస్తుందని కేంద్రం తెలిపింది.

టాప్ హెడ్ లైన్స్

Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC Elections: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ : రామచందర్‌రావు కీలక ప్రకటన
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Embed widget