అన్వేషించండి

Mobile Charger: ఇక అన్నింటికీ ఒకే ఛార్జర్‌, త్వరలోనే కేంద్రం న్యూ రూల్స్‌!

USB-C: ఒక్కో బ్రాండ్‌ ఫోన్‌కు ఒక్కో రకమైన చార్జింగ్‌ పోర్ట్‌ ఉండటం మొబైల్‌ యూజర్లకు ఒక పెద్ద సమస్య ఈ విషయంలో కేంద్రం ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.

The Center Will Bring A New Rule Of One Charger For All Phones: ఎలక్ట్రానిక్ వ్యర్థాలు(e-waste)  విపరీతంగా పెరిగిపోతున్న వేళ... కేంద్ర ప్రభుత్వం(Central Government) కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కామన్‌ ఛార్జింగ్‌ పోర్ట్‌ వైపుగా ప్రయాణిస్తున్న వేళ భారత ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులేస్తోంది. 2026 నాటికి అన్ని స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లలో USB-C ఛార్జర్లు తప్పనిసరి చేస్తూ కొత్త నిబంధనలను జారీ చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. ఛార్జింగ్ సొల్యూషన్‌లను ప్రామాణీకరించడానికి... ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తగ్గించడానికి భారత ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటోంది. ప్రపంచం మొత్తం ఇప్పటికే సీ టైప్‌ ఛార్జర్ల వైపే అడుగులు వేసి ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు తగ్గిస్తున్న వేళ భారత్‌ కూడా అదే విధానం అవలంభించేందుకు సిద్ధమైంది.

ఫోన్‌ ఛార్జర్లకు 2025 వరకే 
స్మార్ట్‌ఫోన్ తయారీదారులు 2025 జూన్ నాటికి USB-C కనెక్టర్లను మాత్రమే ఉత్పత్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆ నిబంధనల్లో పొందిపరిచినట్లు తెలుస్తోంది. ల్యాప్‌టాప్‌లను ఉత్పత్తి చేసే సంస్థలు వాటి ఛార్జింగ్‌ కోసం తప్పనిసరిగా USB-C పోర్ట్‌లను 2026 చివరి నాటికి అందుబాటులోకి తేవాలని కేంద్రం నిర్దేశించనుంది. ఇప్పటికే యూరోపియన్ యూనియన్ ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ ఏడాది నుంచి USB-C కనెక్టివిటీని తప్పనిసరి చేస్తూ ఐరోపా సమాఖ్య నిబంధనలు రూపొందించింది. ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లన్నీ యూనివర్సల్ ఛార్జింగ్ కేబుల్‌ని ఉపయోగిస్తాయని...దీనివల్ల ఛార్జర్‌లు, కేబుల్స్‌ను వినియోగించే సంఖ్య గణనీయంగా తగ్గుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. ప్రస్తుతం ఒక్కో ఫోన్‌కు ఒక్కో రకమైన ఛార్జర్‌ అందుబాటులో ఉండడంతో చాలామంది వినియోగదారులకు ఛార్జింగ్‌ పెద్ద సమస్యగా మారుతోంది. అది కాకుండా  అన్ని ఫోన్లకు ఒకే ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉంటే ఎక్కువ ఛార్జర్ల సమస్య ఉండబోదని కేంద్రం వివరిస్తోంది. టాబ్లెట్‌లు, విండోస్ ల్యాప్‌టాప్‌లు, మ్యాక్‌బుక్‌లు, ఐ ప్యాడ్‌లు, స్మార్ట్‌ ఫోన్‌లకు కూడా ఒకే రకమైన ఛార్డింగ్ పోర్ట్‌లను అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం నిబంధనలను రూపొందిస్తోంది.
 
వాచ్‌లకు కూడానా...
ఫిట్‌నెస్ బ్యాండ్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లతో పాటు బేసిక్‌ ఎలక్ట్రానిక్‌ ఫీచర్‌ ఫోనల్‌కు కూడా ఒకేరకమైన టైప్‌ సీ ఛార్జర్‌లను అందుబాటులోకి తేవడంపై కేంద్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయనప్పటికీ... ఇప్పటికే పరిశ్రమల ప్రముఖులతో చర్చలు ముగిశాయని... దీనిపై ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని వార్తలు వస్తున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కేంద్రం నిబంధనలను రూపొందిస్తోంది. బహుళ రకాల ఛార్జర్‌లు, కేబుల్‌ల ఉత్పత్తికి సంబంధించిన ఖర్చులను ఈ నిర్ణయంతో తగ్గించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ రక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు తెలిపేందుకు ఈ చర్యలు ఉపయోగపడతాయని కేంద్రం తెలిపింది. భారత్‌లో ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి ఎలాంటి అవరోధాలు ఉండవని... పర్యావరణ అనుకూల భవిష్యత్తును భారత్‌ హామీ ఇస్తుందని కేంద్రం తెలిపింది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: మస్కటీన్‌లో ఏడుగురి దుర్మరణం
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం: మస్కటీన్‌లో ఏడుగురి దుర్మరణం
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
India Monsoon Delay 2026:వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 
వాన కోసం ఎదురు చూడాల్సిందే! నైరుతి రుతుపవనాల రాక ఎప్పుడు? వాతావరణ శాఖ ఏమంటోంది? 

వీడియోలు

Sai Sudharsan Sledges Virat Kohli In IPL 2026 | కోహ్లీ, సాయి సుదర్శన్ మధ్య మాటల యుద్ధం
Masterplan Behind RCB's IPL 2026 Victory | ఆర్సీబీ విజయానికి కారణం ఇదే
Reason for GT Lost The IPL 2026 Final | గుజరాత్ పతనం వెనుక అసలు నిజాలు
RCB Celebrations With Family IPL 2026 | ఫ్యామిలీతో ఆర్సీబీ ప్లేయర్స్ సెలబ్రేషన్
RCB Wins IPL 2026 Final | రెండోసారి ఐపీఎల్ టైటిల్ సొంతం చేసుకున్న ఆర్సీబీ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Rajya Sabha Members List History: టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
టీడీపీకి కలసి రాని రాజ్యసభ సభ్యులు - ఎక్కువ మంది షాకిచ్చిన వాళ్లే - ఈ సారి ఈక్వేషన్స్ మారుస్తారా?
Harish Rao BRS : హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
హరీష్ రావుపై మైండ్ గేమ్ -ప్రతీసారీ నిరూపించుకోవాల్సి రావడం.. బీఆర్ఎస్‌కు లాభమా? నష్టమా?
Telangana Formation Day 2026: ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
ఉమ్మడి రాష్ట్ర విభజనకు 12 ఏళ్లు - రెండు రాష్ట్రాలకు మేలు జరిగిందా? కీడు జరిగిందా?
YS Sharmila Rajya Sabha Seat Congress: షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
షర్మిలకు రాజ్యసభ - కాంగ్రెస్ గేమ్‌ ప్లాన్‌ ఏంటి? జగన్‌కు చెక్ పెట్టడానికా.. లేక దోస్తీకా?
EPFO 3.0 PF withdrawal via ATM:ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
ఏటీఎం నుంచి పీఎఫ్‌ విత్‌డ్రా చేస్తే పింఛన్ తగ్గుతుందా?
Hyderabad Traffic Diversions: సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
పరేడ్‌గ్రౌండ్స్‌లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.. మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు
Dry ginger vs Fresh ginger: అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
అల్లం Vs శొంఠి ఆరోగ్యానికి ఏది మంచిది? ఎలా వినియోగించాలి?
ABP India at 2047: అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
అభివృద్ధి చెందిన భారత్ దిశగా అడుగులు.. జూన్ 3న ఏబీపీ నెట్‌వర్క్ ఇండియా @ 2047 కాన్‌క్లేవ్
Embed widget