అన్వేషించండి

Bilaspur Landslide:హిమాచల్ ప్రదేశ్‌లో బస్సుపై కొండచరియలు విరిగిపడి 18 మంది మృతి- రాష్ట్రపతి,ప్రధానమంత్రి సంతాపం

Bilaspur Landslide: హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బర్తీన్ వద్ద కొండచరియలు విరిగిపడి బస్సు ప్రమాదానికి గురైంది. దాదాపు ఇరవై మంది చనిపోయారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom

Bilaspur Landslide: మంగళవారం సాయంత్రం హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలో ఝండుత అసెంబ్లీ నియోజకవర్గంలోని బర్తిన్ ప్రాంతంలో భారీ కొండచరియలు విరిగిపడి ఒక ప్రయాణీకుల బస్సు శిథిలాల కింద చిక్కుకుపోయంది. దీంతో పెద్ద విషాదం చోటు చేసుకుంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, 18 మంది అక్కడికక్కడే మరణించగా, అనేక మంది గాయపడ్డారు. ఒక చిన్నారిని సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. బిలాస్‌పూర్ జిల్లాలోని భల్లు వంతెన సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో శిథిలాలు, బండరాళ్లు అకస్మాత్తుగా 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టాయి.

రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి

అధికారులు వచ్చేలోపు స్థానికులు వెంటనే సహాయ చర్యలు ప్రారంభించారు, శిథిలాల నుంచి ప్రాణాలతో బయటపడిన వారిని బయటకు తీశారు. బిలాస్‌పూర్ జిల్లాలోని ఘుమార్విన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఝండుతా ఆసుపత్రికి చికిత్స కోసం గాయపడిన వారిని తరలించారు. అధికారులు, విపత్తు ప్రతిస్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలను సమన్వయం చేశాయి. ఈ ప్రాంతంలో నిరంతరం కురుస్తున్న వర్షాలకు కొండ వాలు బలహీనపడిందని అందుకే ఈ ఘోర ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.  

హిమాచల్ ముఖ్యమంత్రి విచారం 

ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు, మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని, సాధ్యమైన సహాయాల చేస్తుందని హామీ ఇచ్చిందని అన్నారు.

"ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం బాధితులకు తోడుగా ఉంది. సాధ్యమైన ప్రతి సహాయం అందిస్తుంది" అని ముఖ్యమంత్రి సుఖు అన్నారు. సహాయ, రెస్క్యూ కార్యకలాపాలను ముమ్మరం చేయాలని, గాయపడిన వారందరికీ తక్షణ వైద్య సహాయం అందేలా చూడాలని ఆయన జిల్లా అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి సిమ్లా నుంచి పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

ప్రధాని మోదీ ఎక్స్‌లో సంతాపం 

ప్రధాని కార్యాలయం ఈ ప్రమాదంపై సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఒక పోస్ట్ షేర్ చేసింది. పోస్ట్‌లో ప్రధాని మోదీ ఇలా పోస్టు చేశారు. ‘హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణనష్టం జరగడం బాధాకరం. ఈ కష్ట సమయంలో బాధితులకు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.’ అని అన్నారు.

‘ప్రమాదంలో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి 2 లక్షల రూపాయల పరిహారం, గాయపడిన వారికి 50,000 రూపాయలు అందజేస్తాం.’ అని అన్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాదంపై సంతాపం తెలిపారు

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రమాదాన్ని "చాలా విషాదకరం" అని అభివర్ణించారు. "హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో కొండచరియలు విరిగిపడి జరిగిన బస్సు ప్రమాదంలో అనేక మంది మరణించిన వార్త చాలా బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని ఆమె పేర్కొన్నారు..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా "హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్‌పూర్‌లో కొండచరియలు విరిగిపడిన బస్సు ప్రమాదం పట్ల నేను చాలా బాధపడ్డాను. NDRF బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. ఈ ప్రమాదంలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి నా సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను" అని రాశారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
Railway Advertisements: మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్
మద్యం, పొగాకు, అశ్లీల ప్రకటనలు రైల్వేలో ప్రదర్శించడంపై నిషేధం: అశ్విని వైష్ణవ్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Airports in AP and Telangana: ఉడాన్‌ 2.0తో తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు
తెలుగు రాష్ట్రాలకు గుడ్‌న్యూస్.. ఆదిలాబాద్, నాగార్జునసాగర్‌లలో ఎయిర్‌పోర్టులు!
Kiara Advani: సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
సివంగిలా మారా... డెలివరీ తర్వాత జీవితంలో వచ్చిన మార్పులపై కియారా అద్వానీ
Summer Special Trains: సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
సికింద్రాబాద్ -శ్రీ కాకుళం మధ్య సమ్మర్ స్పెషల్ ట్రైన్స్.. తేదీలు,టైమింగ్స్ ఇవే
IPL 2026: విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
విరాట్ ముద్దు... అనుష్క సిగ్గు... ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ వైరల్ వీడియో చూశారా?
Samuthirakani: క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
క్రెడిట్ కార్డ్స్, ఈఎంఐలు, మిడిల్ క్లాస్ కష్టాలే మెయిన్ పాయింట్... సముద్రఖని ఏం చెప్పారంటే?
TVK Election Manifesto 2026: జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
జాబ్ క్యాలెండర్, 20 లక్షల పూచీకత్తు లేని రుణాలు.. టీవీకే పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోపై విజయ్
Embed widget