అన్వేషించండి

Heatwave: ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఉష్ణోగ్రతలు, 98 మంది మృతి - వేసవి సెలవులు పొడిగింపు

Heatwave: యూపీ, బిహార్‌ రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Heatwave Deaths: 


యూపీ, బిహార్‌లో వేడిగాలులు..

బిపార్‌జాయ్ ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా ఇంకా ఎండ తీవ్ర తగ్గడం లేదు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. యూపీ, బిహార్, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, విదర్బ, ఒడిశా, వెస్ట్ బెంగాల్ సహా తెలుగు రాష్ట్రాల్లో వేడి గాలులు మరింత తీవ్రతరమవుతాయని IMD హెచ్చరించింది. ఇప్పటికే బిహార్‌లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు వేసవి సెలవులను పొడిగించారు. జూన్ 24 తరవాతే స్కూల్స్ తెరుచుకోనున్నాయి. బిహార్‌తో పాటు మరి కొన్ని రాష్ట్రాలు కూడా వేసవి సెలవును పొడిగించాయి. గోవా, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, ఏపీలో నిర్ణయం తీసుకున్నారు. ఇక యూపీలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. ఎండ ధాటిని తట్టుకోలేక చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. బల్లియా జిల్లా ఆసుపత్రిలో దాదాపు 3వందల మంది చేరినట్టు అధికారులు వెల్లడించారు. వీరిలో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. జూన్ 15వ తేదీన 23 మంది చనిపోగా...మరుసటి రోజు మరో 20 మంది ప్రాణాలు విడిచారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారే ఎక్కువగా మృతి చెందినట్టు వైద్యులు స్పష్టం చేశారు. మరి కొందరు గుండెపోటుతో చనిపోయినట్టు చెప్పారు. మృతుల్లో ఎక్కువ మంది 60 ఏళ్లు పైబడిన వారే ఉన్నారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వాళ్ల సంఖ్య పెరుగుతోందని, వాళ్లే ఎక్కువగా ఆసుపత్రిలో చేరుతున్నారని వైద్యులు తెలిపారు. 

"60 ఏళ్లు పైబడిన వాళ్లే ఎక్కువ మంది చనిపోతున్నారు. మరణాలకు కారణమేంటన్నది ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. లఖ్‌నవూ నుంచి ఓ స్పెషల్ టీమ్ త్వరలోనే వచ్చి విచారణ చేపడుతుంది. ఉష్ణోగ్రతలు ఎక్కువైనప్పుడు, తక్కువైనప్పుడు శ్వాసకోశ సమస్యలున్న వారికి అనారోగ్యం కలుగుతుంది. బహుశా ఇప్పుడు వేడి ఎక్కువగా ఉండటం వల్ల మరణాలు నమోదవుతుండొచ్చు"

- వైద్యాధికారి, యూపీ

అటు యూపీ ప్రభుత్వం కూడా ఈ మరణాలపై విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఇక బిహార్‌లనూ ఇదే పరిస్థితులున్నాయి. 24 గంటల్లోనే 44 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 18 ప్రాంతాల్లో వేడిగాలులు సతమతం చేస్తున్నాయి. పట్నాలో 35 మంది చనిపోగా...నలందా మెడికల్‌ కాలేజ్‌లో మరో 9 మంది కన్నుమూశారు. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బిపార్‌జాయ్ ఎఫెక్ట్‌తో వానలు ఆలస్యంగా కురిసే అవకాశాలున్నాయని ఇటీవలే IMD వెల్లడించింది. మరి కొద్ది రోజుల పాటు ఈ వేడిగాలులను భరించక తప్పేలా లేదు. 

Also Read: Mann Ki Baat: దేశంలో ఆ జబ్బు అంతానికి కృషి చేస్తున్న యువతకు మోదీ అభినందనలు - మన్‌కీ బాత్‌లో ప్రధాని

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget