అన్వేషించండి

Rahul Gandhi: రాహుల్ గాంధీ ఆ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం - ఎఫ్ఐఆర్ నమోదు

FIR on Rahul Gandhi: ఆర్ఎస్ఎస్, బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన వేళ.. ఆయనపై గువాహటి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.

FIR Filed Against Congress Leader Rahul Gandhi: దేశంతోనూ కాంగ్రెస్ పోరాడుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన వేళ ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మోన్‌జిత్ చాటియా అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు అస్సాంలోని గువాహటి పీఎస్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. రాహుల్ వ్యాఖ్యలు స్వతంత్ర పరిమితులను దాటాయని.. అవి జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు కలిగిస్తాయని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు అశాంతితో పాటు, వేర్పాటు వాద భావాలు కలిగిన వారిని రెచ్చగొట్టే ప్రమాదం ఉందని అన్నారు. 'ప్రతిపక్ష నాయకుడిగా.. ప్రజాస్వామ్య సంస్థలపై ప్రజలకు విశ్వాసం కల్పించాల్సిన బాధ్యత రాహుల్‌కు ఉంది. కానీ, ఆయన అందుకు బదులుగా అబద్ధాలు వ్యాప్తి చేసి దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తున్నారు.' అని చాటియా ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు.

రాహుల్ ఏమన్నారంటే.?

కాగా, ఢిల్లీలో కాంగ్రెస్ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఇటీవల ప్రారంభించారు రాహుల్ గాంధీ. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడిన ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఆర్ఎస్సెస్ వంటి మా భావజాలం వేల ఏళ్ల నాటిది. బీజేపీ, ఆర్ఎస్సెస్ దేశంలోని ప్రతి సంస్థను తమ గుప్పిట్లో పెట్టుకున్నాయి. మేము ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్సెస్‌తో పాటు భారతదేశంపై కూడా పోరాడుతున్నాం.' అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను పలువురు కేంద్ర మంత్రులు తప్పుబట్టారు. కాంగ్రెస్ అసలు రూపం ఈ వ్యాఖ్యలతో బయటపడిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శించారు.

కులగణనపై రాహుల్ విమర్శలు - మండిపడ్డ ఎన్డీయే

కాగా, బీహార్‌లో సర్కారు చేపట్టిన కులగణనను రాహుల్ గాంధీ ఫేక్‌గా పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత శనివారం తొలిసారి బీహార్ పర్యటించిన ఆయన.. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణనను నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలన మోసం చేసేందుకు ఉద్దేశించి.. 2022 - 23లో బీహార్‌లో స్థానిక ప్రభుత్వం నిర్వహించిన విధంగా ఈ ప్రక్రియ నకిలీది కాదని పేర్కొన్నారు. అయితే, ఈ వ్యాఖ్యలపై ఎన్డీయే మండిపడింది. మొన్నటివరకూ బీహార్ కుల సర్వేను ప్రశంసించిన రాహుల్ గాంధీ.. ఇప్పుడు దాన్ని నకిలీదిగా పేర్కొనడం విస్మయం కలిగిస్తుందని పేర్కొంది. నితీశ్ కుమార్ గతంలో 'ఇండియా' కూటమి సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు రాహుల్ మౌనంగా ఉన్నారని ఆరోపించింది. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర కులగణన వివరాలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించింది.

మరోవైపు, రాహుల్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని జేడీయూ వర్కింగ్ ప్రెసిడెంట్ సంజయ్ ఝా విమర్శించారు. భారత ప్రభుత్వానికి, దేశానికి మధ్య తేడాను గుర్తించలేని నేత నుంచి ఇంతకంటే మరేం ఆశించగలమని మంత్రి విజయ్ కుమార్ చౌదరి సెటైర్లు వేశారు. రాష్ట్రంలో కులగణనకు కాంగ్రెస్ మద్దతిచ్చిందని గుర్తు చేశారు. సర్వేలోని లోపాలను స్పష్టమైన ఆధారాలతో చూపిస్తే సరిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అటు, ఈ విమర్శలకు కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది.

Also Read: Kumbh Mela 2025: ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో అగ్ని ప్రమాదం - భయంతో పరుగులు తీసిన భక్తులు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Indias First Bullet Train: ముంబై నుంచి అహ్మదాబాద్‌కు కేవలం 2 గంటల జర్నీ.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్‌కు.. 2027లో భారత్‌లో తొలి బుల్లెట్ రైలు పరుగులు
Uttar Pradesh Elections Polarisation: అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
అయోధ్య విరాళాల స్కామ్‌తో యూపీలో బీజేపీకి రాజకీయ గండం - ఆదిత్యనాథ్ ఎలా చక్కబెడతారు?
IRCTC South India Tour Package 2026 : IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే
IRCTC టూర్ ప్యాకేజీ 2026.. తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, శ్రీశైలం యాత్ర.. పూర్తి వివరాలు ఇవే

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy : ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
ఈ ఏడాది వర్షాధార పంటలు వేయొద్దు- రైతులకు రేవంత్ రెడ్డి సూచన- ఫామ్‌హౌస్ పశుపతిని రానీయొద్దని పిలుపు!
President Droupadi Murmu: దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
దేశ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర - గిరిజన వర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భావోద్వేగ ప్రసంగం!
Adopted Boy Sad Story: దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
దత్తత తీసుకుని రోడ్డున పడేశారు.. కన్నవారికి స్థోమత లేదు- గుంటూరు ఎస్పీని ఆశ్రయించిన బాలుడు!
Akhil Raj: అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
అఖిల్ రాజ్ కారుపై దుండగుల దాడి... శ్రీరాముణ్ణి తలచుకున్న కుటుంబ సభ్యులు
AP EAPCET 2026 Results: అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
అభ్యర్థులకు అలర్ట్.. ఏపీ ఎప్‌సెట్ ఫలితాల విడుదల చివరి నిమిషంలో వాయిదా
Kris Srikkanth Comments: తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
తిలక్ వర్మ సెల్ఫిష్ ఆట వల్లే ఇండియా ఘోర ఓటమి.. శ్రీకాంత్ సంచలన కామెంట్స్, జెర్సీ ఎగరేసి హీరో అవ్వాలని చూశాడంటూ ఫైర్!
Breaking News: తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
తెలంగాణలో రైతు భరోసా నిధులు విడుదల
Sudha Kongara: డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
డబ్బులు ఎగ్గొట్టారు... నిర్మాతపై కోర్టుకు వెళ్లిన లేడీ డైరెక్టర్
Embed widget