By: ABP Desam | Updated at : 28 Jun 2022 05:06 PM (IST)
Edited By: Murali Krishna
(Image Source: PTI)
ED Summons Sanjay Raut: మహారాష్ట్ర రాజకీయ ప్రతిష్టంభన వేళ శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. పత్రచాల్ భూ కుంభకోణం కేసులో సంజయ్ రౌత్కు ఈడీ ఈ నోటీసులు ఇచ్చింది.
అయితే ఈ కేసులో మంగళవారం విచారణ అధికారుల ఎదుట ఆయన హాజరు కావాల్సి ఉంది. సంజయ్ రౌత్ హాజరుకాక పోవడంతో ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది.
Enforcement Directorate (ED) sends a second summon to Shiv Sena leader Sanjay Raut, asking him to appear before them on 1st July in connection with the Patra Chawl land scam case.
(File photo) pic.twitter.com/oMCnaeRRRE— ANI (@ANI) June 28, 2022
సమయం కావాలి
అయితే ఈడీ ఎదుట హాజరయ్యేందుకు తనకు మరింత సమయం కావాలని సంజయ్ రౌత్ కోరారు. దీంతో జులై 1న తమ ముందు హాజరు కావాలని సంజయ్ రౌత్కు ఈడీ తెలిపింది. వచ్చేటప్పుడు ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను తీసుకురావాలని సమన్లలో ఈడీ పేర్కొన్నట్లు సమాచారం.
Sanjay Raut has been asked by ED to bring some important documents related to the matter. He has been summoned on July 1st in connection with the Patra Chawl land scam case.
— ANI (@ANI) June 28, 2022
మహారాష్ట్ర సంక్షోభంపై సంజయ్ గట్టిగా ప్రశ్నిస్తున్నందునే ఆయనపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ఏజెన్సీలను ప్రయోగిస్తోందని శివసేన నేతలు ఆరోపిస్తున్నారు.
ఇదే కేసు
2007లో అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం పత్రచాల్ ప్రాంతంలో 3వేల ఫ్లాట్లు నిర్మించడానికి గురుఆశీష్ కన్స్ట్రక్షన్స్కు 1034 కోట్ల విలువైన ప్రాజెక్ట్ కేటాయించింది. ఇందుకోసం 47 ఎకరాల భూమిని ఈ కంపెనీకి అప్పగించింది. గురుఆశీష్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లలో ఒకరైన ప్రవీణ్ రౌత్.. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్కు అత్యంత సన్నిహితుడు. ప్రవీణ్ రౌత్ భార్య మాధురి సంజయ్ రౌత్ సతీమణి వర్షకు 55 లక్షలు వడ్డీలేని రుణం ఇచ్చినట్టు ఈడీ విచారణలో తేలింది. అంతేకాక, మాధురి, వర్షా కలిసి ఆలీబాగ్లో ఓ భూమి కూడా కొనుగోలుచేశారు. ఈ ల్యాండ్ డీల్పైనా ఈడీ కూపీ లాగుతోంది. ఈ నేపథ్యంలో రౌత్ ఆస్తులు అటాచ్ చేసింది.
Also Read: Maharashtra Political Crisis: 'మాదే అసలైన శివసేన'- 50 మంది ఎమ్మెల్యేలతో ముంబయికి షిండే!
President Droupadi Murmu : ప్రపంచానికి భారత్ ఓ మార్గదర్శి, దేశ నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలి - రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
Independence Day 2022: ప్రధాని మోదీ ఏ ప్రకటనలు చేస్తారో? స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంపై అంచనాలు
Independence Day 2022: పంద్రాగస్టు వేడుకల కోసం దేశ రాజధాని ముస్తాబు, సీఎం ట్వీట్!
UK Next PM: బ్రిటన్ ప్రధాని రేసులో లీడ్లో లిజ్ ట్రస్, రిషి సునక్పై వ్యతిరేకత ఉందా?
Independence Day 2022: ప్రపంచంలో ఎత్తైన వంతెనపై జాతీయ జెండా, అద్భుతం అంటున్న నెటిజన్లు
Minister KTR: భారత్ ను మరే దేశంతో పోల్చలేం, ప్రతి 100 కిలోమీటర్లకు విభిన్న సంస్కృతి - మంత్రి కేటీఆర్
Pawan Kalyan : దావోస్ వెళ్లి ఫొటోలు దిగివస్తే పెట్టుబడులురావు, సీఎం జగన్ పై పవన్ సెటైర్లు
50 మెగాపిక్సెల్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 7 జీబీ ర్యామ్ - ధర మాత్రం రూ.10 వేలలోపే!
Ola Electric Car: సింగిల్ చార్జ్తో హైదరాబాద్ టు తిరుపతి - ఓలా ఎలక్ట్రిక్ కార్తో మామూలుగా ఉండదు!